సీఎస్కేలో కొవిడ్: ఆసీస్ పేసర్ ఆందోళన
చెన్నై సూపర్కింగ్స్ బృందంలో కొవిడ్-19 కేసులు రావడం ఆందోళన కలిగిస్తోందని ఆస్ట్రేలియా పేసర్ జోస్ హేజిల్వుడ్ అన్నాడు. వైరస్ సోకినవారు ఏకాంతంలో ఉన్నారని చెప్పాడు. నిజానికి కేసులేమీ రాకుంటేనే మంచిదని పేర్కొన్నాడు. ఇప్పటికైతే ఇంగ్లాండ్ పర్యటనపై దృష్టి సారించానని వెల్లడించాడు...
సౌతాంప్టన్: చెన్నై సూపర్కింగ్స్ బృందంలో కొవిడ్-19 కేసులు రావడం ఆందోళన కలిగిస్తోందని ఆస్ట్రేలియా పేసర్ జోస్ హేజిల్వుడ్ అన్నాడు. వైరస్ సోకినవారు ఏకాంతంలో ఉన్నారని చెప్పాడు. నిజానికి కేసులేమీ రాకుంటేనే మంచిదని పేర్కొన్నాడు. ఇప్పటికైతే ఇంగ్లాండ్ పర్యటనపై దృష్టి సారించానని వెల్లడించాడు. ఐపీఎల్లో అతడు సీఎస్కేకు ఆడాల్సి ఉంది.
సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఐపీఎల్-2020 జరుగుతుంది. జట్లన్నీ ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. అయితే చెన్నై సూపర్కింగ్స్ బృందంలో ఇద్దరు ఆటగాళ్లు సహా 13 మందికి కొవిడ్-19 సోకింది. పేసర్ దీపక్ చాహర్, బ్యాటర్ రుత్రాత్ గైక్వాడ్కు కరోనా రావడంతో మిగతావారికి దూరంగా ఏకాంతంలో ఉన్నారు.
సీజన్ ఆరంభం అయ్యేసరికి కేసులేమీ లేకుంటే మంచిదని హేజిల్వుడ్ అన్నాడు. ‘మాకో (సీఎస్కే) వాట్సప్ గ్రూప్ ఉంది. సమాచారం అంతా అందులో వస్తోంది. కేసుల గురించి తెలుసుకొంటే ఆందోళన కలుగుతోంది. అసలు కేసులే ఉండొద్దు. అయితే ఇప్పుడువారు క్వారంటైన్లో ఉన్నారు. త్వరలోనే ముగుస్తుంది. ఇప్పటికైతే నా దృష్టంతా ఇంగ్లాండ్ పర్యటనపై ఉంది. ఐపీఎల్ తేదీ సమీపించినప్పుడు దాని గురించి ఆలోచిస్తాను. క్రికెట్ ఆస్ట్రేలియా దీని గురించి మాట్లాడలేదు. ఇంకొన్ని రోజులు ఉంది కదా. కేసులు మరిన్ని పెరిగితే సీఏ మాతో మాట్లాడొచ్చు’ అని అతడు పేర్కొన్నాడు. డేవిడ్ వార్నర్, స్టీవ్స్మిత్, ప్యాట్ కమిన్స్, ఆరోన్ ఫించ్ వంటి కీలక ఆటగాళ్లు ఇంగ్లాండ్ నుంచే యూఏఈకి రానున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!