నా దారిలో ఎన్నో కష్టాలు: కోహ్లీ
వ్యక్తిగత ప్రదర్శనల కోసం ఎప్పుడూ ఆడనని, జట్టు విజయాల కోసమే పోరాడతానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఆ ఆలోచనే తాను నిలకడగా పరుగులు సాధించేలా చేస్తుందని...
ఇంటర్నెట్డెస్క్: వ్యక్తిగత ప్రదర్శనల కోసం ఎప్పుడూ ఆడనని, జట్టు విజయాల కోసమే పోరాడతానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఆ ఆలోచనే తాను నిలకడగా పరుగులు సాధించేలా చేస్తుందని తెలిపాడు. ఐసీసీ ప్రకటించిన ప్రతిష్ఠాత్మక పురస్కారాల్లో కోహ్లీ ఈ దశాబ్దపు అత్యుత్తమ ప్లేయర్, వన్డే ప్లేయర్ ఆఫ్ ది డికేడ్ అవార్డులు గెలిచిన సంగతి తెలిసిందే. దీనిపై కోహ్లీ మాట్లాడాడు.
‘‘మీరు వ్యక్తిగత ప్రదర్శనల కోసం ఆడితే నిలకడగా పరుగులు సాధించలేరు. అదే జట్టు విజయం కోసం మైదానంలో అడుగుపెడితే మీ సామర్థ్యానికి మించి గొప్ప ప్రదర్శన చేస్తారు. అదే అన్ని ఫార్మాట్లలో మీరు నిలకడగా ఆడేలా చేస్తుంది. 40, 50, 60 పరుగులు సాధించారా లేదా సెంచరీ, డబుల్ సెంచరీ చేశారా అనేది ముఖ్యం కాదు. జట్టు గెలుపు కోసం ఎంతలా ప్రయత్నించారనేది కీలకం. నా ఆలోచనధోరణి ఎప్పుడు ఇలానే ఉంటుంది. వీలైనంత సేపు బ్యాటింగ్ చేస్తూ జట్టును పటిష్ఠ స్థితిలో ఉంచడానికి ప్రయత్నిస్తా’’ అని కోహ్లీ పేర్కొన్నాడు.
‘‘మూడు ఫార్మాట్లలో సత్తాచాటడం సవాలే. అయితే నేను ఆటలో ప్రాథమిక అంశాలను పాటిస్తాను. చక్కని క్రికెటింగ్ షాట్లు ఆడటం, వాటిని మెరుగుపర్చుకోవడం చేస్తాను. అన్ని ఫార్మాట్లలో ఇదే అనుసరిస్తాను. ఫార్మాట్లను బట్టి గేర్ మార్చడానికి ఇది ఎంతో దోహదపడుతుంది’’ అని కోహ్లీ తెలిపాడు. 87 టెస్టులు, 251 వన్డేలు, 84 టీ20లు ఆడిన అతడు అన్నిఫార్మాట్లలో కలిపి 22,286 పరుగులు సాధించాడు. దీనిలో 70 శతకాలు ఉన్నాయి.
గొప్ప క్రికెటర్గా ఎదగడానికి ఎన్నో కష్టాలను అధిగమించానని కోహ్లీ తెలిపాడు. ‘‘అంతర్జాతీయ స్థాయిలో ఏ జట్టుతో అయినా మ్యాచ్ అంత సులువు కాదు. గతంలో గొప్ప బౌలర్లను ఎదుర్కొంటున్నాను. ఇప్పుడూ నాణ్యమైన బౌలర్లతో ఆడుతున్నాను. నా దారిలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తూ, కఠోర శ్రమతో నా ఆటను మెరుగుపర్చుకున్నాను. నేను ప్రత్యర్థులను గౌరవిస్తాను. ఎదురయ్యే ప్రతి సవాళ్లను ఆనందంతో స్వీకరిస్తాను’’ అని అన్నాడు.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే