అప్పుడు నా కెరీర్ ఏమవుతుందో అని భయపడ్డా..
దేశవాళీ క్రికెట్లో తాను అద్భుతంగా రాణించినప్పుడే తన మామ, పాకిస్థాన్ మాజీ సారథి ఇంజమామ్ ఉల్ హక్ పీసీబీ చీఫ్ సెలక్టర్ అయ్యాడని ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ చెప్పాడు...
నెపోటిజమ్పై స్పందించిన ఇమామ్ ఉల్ హక్
ఇంటర్నెట్డెస్క్: దేశవాళీ క్రికెట్లో తాను అద్భుతంగా రాణిస్తున్న సమయంలోనే తన మామ, పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ సారథి ఇంజమామ్ ఉల్ హక్ పీసీబీ చీఫ్ సెలక్టర్ అయ్యాడని ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ చెప్పాడు. మొదట్లో తాను జాతీయ జట్టుకు ఎంపికైనప్పుడు బంధుప్రీతి వల్లే ఆ స్థాయికి చేరుకున్నట్లు వార్తలు వచ్చాయని తెలిపాడు. టీమ్ఇండియా మాజీ క్రికెటర్ దీప్దాస్ గుప్తాతో తాజాగా ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన ఇమామ్.. తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. చిన్నప్పుడు అతడికి క్రికెట్ కన్నా ఎక్కువ మోడలింగ్, బ్యాడ్మింటన్ మీద ఇష్టం ఉండేదా అని వ్యాఖ్యాత అడగ్గా అలా ఏం లేదన్నాడు. తన సోదరుడు ఫస్ట్క్లాస్ క్రికెటర్ అవడంతో అతడిని చూసి క్రికెట్పై ఆసక్తి పెరిగిందన్నాడు. మొదట్లో ఆట అర్థమయ్యేది కాదని, మెల్లిగా స్కూల్ క్రికెట్లో ఆడటంతో క్రికెట్పై ఇష్టం పెరిగిందన్నాడు. అలాగే తాను పాఠశాలలో బ్యాడ్మింటన్, ఫుట్బాల్ కూడా ఆడానని చెప్పాడు. ఇక స్కూల్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో మోడలింగ్ చేసేవాడినని వివరించాడు.
అనంతరం పాక్ దిగ్గజ క్రికెటర్ ఇంజమామ్తో తనని పోల్చడాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నావని అడగ్గా.. తొలుత తాను ఎలా జాతీయ జట్టుకు ఎలా ఎంపికయ్యాడో వివరించాడు. తన మామ పీసీబీ చీఫ్ సెలక్టర్గా ఎంపికైనప్పుడే తాను దేశవాళి క్రికెట్లో 890 పరుగులు చేశానని, అలా తన బ్యాటింగ్ నైపుణ్యం చూసి అప్పటి పాక్ కోచ్ మిక్కీ ఆర్థర్ ప్రోత్సహించాడని చెప్పాడు. అప్పుడు నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో మంచి ప్రదర్శన చేయడంతో పాక్ జాతీయ జట్టుకు ఎంపికైనట్లు వెల్లడించాడు. కాగా, అదే రోజు సామాజిక మాధ్యమాల్లో తనపై ఆరోపణలు వచ్చాయని, అవి తనని చాలా బాధపెట్టాయని పేర్కొన్నాడు. యూఏఈలో శ్రీలంకతో వన్డే సిరీస్కు ఎంపికైనప్పుడు చాలా ఆందోళన చెందినట్లు వెల్లడించాడు. అప్పుడు తన ఫోన్లు కూడా మేనేజర్కే ఇచ్చానని, ఇంట్లో వాళ్లతో మాట్లాడకుండా, జట్టులోనూ ఒంటరిగా గడిపానన్నాడు.
‘ఒక్క మ్యాచ్ కూడా ఆడకముందే ఇలా అంటున్నారు. ఒకవేళ ఆడాక నిజంగా విఫలమైతే నా పరిస్థితేంటని భయపడ్డా, అలా జరిగితే ఇక అక్కడితో నా కెరీర్ ఆగిపోతుందని భావించా. ఒక్కోసారి బాత్రూమ్లో షవర్ కింద గంటలకొద్దీ ఏడ్చేవాడిని. ఇక లంకతో తొలి రెండు వన్డేలకు నన్ను ఎంపిక చేయలేదు. మూడో మ్యాచ్కు నన్ను ఎంపిక చేశారు కానీ తుది జట్టులో ఉంటానో లేదో చెప్పలేదు. మ్యాచ్ రోజు ఉదయం మిక్కీ ఆర్థర్ మెసేజ్ చేసి తుది జట్టులో ఆడుతున్నానని, అందుకు గుడ్లక్ కూడా చెప్పాడు. దాంతో నాకేం అర్థం కాలేదు. మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. నన్ను ఎందుకు ఎంపిక చేశారో అనుకున్నా. అంతలా నా ఆత్మవిశ్వాసం దెబ్బతినింది. అప్పుడు నేను మ్యాచ్ గురించి ఆలోచించకుండా, మ్యాచ్ తర్వాత జరిగే పరిణామాల గురించే ఆందోళన చెందా. ఒకవేళ సరిగ్గా ఆడకపోతే ఏం జరుగుతుందో అనే విషయమే నా బుర్రలో తిరిగింది. నా కెరీర్ ఆగిపోతుందని, మీడియా మొత్తం నాపై వేలెత్తి చూపిస్తుందని భయపడ్డా’ అని ఇమామ్ తన తొలి మ్యాచ్ నాటి విశేషాల్ని పంచుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల