నిలవాలంటే భారత్ గెలవాల్సిందే!
ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా ఓటమితో ఆరంభించింది. బ్యాటింగ్, బౌలింగ్తో పాటు ఫీల్డింగ్లోనూ ఘోరంగా విఫలమై పరాజయాన్ని చవిచూసింది. అయితే
రేపటి వన్డేలో కోహ్లీసేన పుంజుకుంటుందా?
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా ఓటమితో ఆరంభించింది. బ్యాటింగ్, బౌలింగ్తో పాటు ఫీల్డింగ్లోనూ ఘోరంగా విఫలమై పరాజయాన్ని చవిచూసింది. అయితే సిరీస్ రేసులో నిలవాలంటే రేపటి మ్యాచ్లో కోహ్లీసేన తప్పక విజయం సాధించాలి. కాగా, హార్దిక్ పాండ్య బౌలింగ్కు దూరమవ్వడంతో భారత్కు బౌలింగ్ వనరులు పరిమితంగా మారాయి. ఐదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగాల్సి వస్తుంది. దీంతో ‘ప్లాన్-బి’కీ ఎటువంటి అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో పటిష్ట బ్యాటింగ్ లైనప్ కలిగిన ఆస్ట్రేలియాను బ్యాటింగ్కు అనుకూలించే సిడ్నీ పిచ్పై భారత బౌలర్లు ఎలా కట్టడి చేస్తారనేది ఆసక్తికరం.
తొలి వన్డేలో భారత్ 66 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. హార్దిక్ 76 బంతుల్లో 90 పరుగులతో గొప్పగా పోరాడాడు. కానీ 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో హార్దిక్ ఇన్నింగ్స్ మాదిరిగానే ఇదీ జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయింది. అయితే హార్దిక్ బౌలింగ్కు దూరంకావడంతో జట్టులో ఆరో బౌలర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. కాగా, టీ20 ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకొని దానికి తగ్గట్లుగా సన్నద్ధమవుతున్నట్టు అతడు తెలిపినా బ్యాకప్ ఆల్రౌండర్ లేకపోవడం టీమిండియాకి ఇబ్బందిగా మారింది. దీంతో ‘ప్లాన్-బి’కీ అవకాశం లేకపోవడంతో ఐదుగురు బౌలర్లతో ‘ప్లాన్-ఎ’ను విజయవంతం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జట్టులో శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్. ఇక ఆరో బౌలర్గా కెప్టెన్ కోహ్లీ మాత్రమే ఉన్నాడు. అతడు నుంచి ఒకటి లేదా రెండు ఓవర్లు ఆశించొచ్చు. కానీ ఈ మధ్య కాలంలో విరాట్ బౌలింగ్ చేసిన పరిస్థితులు చాలా అరుదు. మరోవైపు తొలి మ్యాచ్లో సైని, చాహల్ కలిసి 20 ఓవర్లలో 172 పరుగులు ఇచ్చారు. అయితే చాహల్ తన స్పెల్ ముగిసిన తర్వాత గాయంతో మైదానాన్ని వీడాడు. సైని వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. వారిద్దరు రెండో మ్యాచ్కు ఫిట్నెస్ సాధించకపోతే శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ జట్టులోకి వస్తారు. మరో పేసర్ నటరాజన్ జట్టులో ఉన్నప్పటికీ బ్యాటింగ్ కూడా చేయగలిగే శార్దూల్కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
బుమ్రాపై ఒత్తిడి
ఆరో బౌలర్ లేకపోవడం బుమ్రాపై ఒత్తిడిని పెంచుతుంది. గాయం నుంచి కోలుకొని న్యూజిలాండ్ సిరీస్తో జట్టులో చేరిన అతడు వన్డేలో తన ఫామ్ను కొనసాగించట్లేదు. ఐపీఎల్లో మెరిసినప్పటికీ 50 ఓవర్ల ఫార్మాట్లో సత్తా చాటలేకపోతున్నాడు. కాగా, షమి కట్టుదిట్టంగా బంతులు వేస్తుండటం భారత్కు ఊరట. అతడితో పాటు బుమ్రా కూడా మెరిస్తే ఆస్ట్రేలియా స్కోరును పరిమితం చేయవచ్చు. అయితే సూపర్ ఫామ్లో ఉన్న ఆసీస్ టాప్ఆర్డర్ ఫించ్, వార్నర్, స్మిత్ను భారత బౌలింగ్ దళం ఎలా కట్టడిచేస్తుందో చూడాలి.
సమయోచిత ఇన్నింగ్స్లు ఆడితేనే..
ఇక ఛేదనలో 300పరుగులు దాటినప్పటికీ ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోవడం టీమిండియాకి హెచ్చరిక లాంటిదే. హేజిల్వుడ్ వేసిన బౌన్సర్ను పేలవమైన షాట్తో శ్రేయస్ అయ్యర్ ఔటవ్వడం నిరాశకు గురిచేసింది. మయాంక్ బాగానే ఆడుతున్నా నిలకడలేమితో ఇబ్బంది పడుతున్నాడు. కాగా, రెండో వన్డేలో పైచేయి సాధించాలంటే భారత ఆటగాళ్లు సమయోచిత ఇన్నింగ్స్లు ఆడాల్సి ఉంది. ధావన్, హార్దిక్తో పాటు కేఎల్ రాహుల్ రాణించాలి. కెప్టెన్ విరాట్ కోహ్లీ గొప్ప ఇన్నింగ్స్తో జట్టును నడిపించాలి. అంతేగాక మైదానంలోనూ చురుకుగా కదిలితేనే ఫించ్ సేనపై టీమిండియా విజయం సాధించి రేసులో నిలుస్తుంది. మరోవైపు తొలి మ్యాచ్లో పక్కటెముకల గాయంతో ఇబ్బంది పడిన స్టాయినిస్ స్థానంలో కామెరన్ గ్రీన్ ఆసీస్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా సిడ్నీ వేదికగా రెండో వన్డే ఆదివారం జరగనుంది.
జట్ల వివరాలు
భారత్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, హార్దిక్ పాండ్య, మయాంక్ అగర్వాల్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, నవదీప్ సైని, శార్దూల్ ఠాకూర్, టీ నటరాజన్
ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, లబుషేన్, మాక్స్వెల్, స్టాయినిస్, అలెక్స్ కేరీ, కమిన్స్, మిచెల్ స్టార్క్, జంపా, హేజిల్వుడ్, సీన్ అబాట్, ఆస్టన్ అగర్, కామెరన్ గ్రీన్, హెన్రిక్స్, ఆండ్రూ టై, డేనియల్ సామ్స్, మాథ్యూ వేడ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నైతో జరిగిన మ్యాచ్లో లఖ్నవూ 8 వికెట్ల తేడాతో గెలిచింది. 177 పరుగుల లక్ష్యాన్ని లక్నవూ 19 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. -
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
పంజాబ్పై 9 పరుగుల తేడాతో ముంబయి గెలిచింది. కానీ, ఆ జట్టుకు అంపైర్లు మద్దతుగా నిలిచారనే ఆరోపణలు వస్తున్నాయి. -
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?