క్లీన్స్వీప్ తప్పించుకుంటుందా?
ఆస్ట్రేలియా చేతిలో క్లీన్స్వీప్ తప్పించుకోవాలన్నా, టీ20 సిరీస్కు ఆత్మవిశ్వాసంతో సన్నద్ధమవ్వాలన్నా రేపటి వన్డేలో భారత్కు.......
కాన్బెర్రా వేదికగా రేపు భారత్×ఆసీస్ చివరి వన్డే
ఇంటర్నెట్డెస్క్: ఆస్ట్రేలియా చేతిలో క్లీన్స్వీప్ తప్పించుకోవాలన్నా, టీ20 సిరీస్కు ఆత్మవిశ్వాసంతో సన్నద్ధమవ్వాలన్నా రేపటి వన్డేలో భారత్కు విజయం తప్పనిసరి. పసలేని బౌలింగ్, పేలవ ఫీల్డింగ్, నాయకత్వంలో తడబాటుతో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న టీమిండియా కాన్బెర్రా వేదికగా బుధవారం ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన కోహ్లీసేన ఈ మ్యాచ్లో నెగ్గి పరువు నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుండా, మరోవైపు క్లీన్స్వీప్ చేయాలని ఆస్ట్రేలియా ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో నామమాత్రపు మ్యాచ్ అయినా రేపటి పోరుపై ఆసక్తి నెలకొంది.
వరుసగా 5 వన్డేల్లో ఓటమి
ఈ ఏడాది న్యూజిలాండ్ పర్యటనలో భారత్ మూడు వన్డేల సిరీస్ను 0-3తో కోల్పోయింది. కరోనా కారణంగా తర్వాత జరగాల్సిన దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ రద్దైంది. ప్రస్తుత్తం జరగనున్న ఆస్ట్రేలియా వన్డే సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 0-2తో చేజార్చుకుంది. అయితే వరుసగా రెండు వన్డే సిరీస్లు క్లీన్స్వీప్ అయిన ఘోరపరాభవాన్ని తప్పించుకోవాలంటే రేపటి మ్యాచ్లో కోహ్లీసేన కచ్చితంగా గెలవాలి. కాగా, భారీ లక్ష్యాలతో బరిలోకి దిగిన టీమిండియా 66, 51 పరుగుల ఓటమి అంతరం కాస్త ఊరట కలిగిస్తున్నా బౌలింగ్, ఫీల్డింగ్ తీవ్రంగా కలవరపెడుతోంది. ప్రధాన బౌలర్లు బుమ్రా, షమి సత్తాచాటలేకపోవడం.. ఫీల్డర్లు మైదానంలో చురుకుగా కదలలేకపోవడం ప్రతికూలాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో సూపర్ ఫామ్లో ఉన్న ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ను ఎలా కట్టడి చేస్తారనేది ఆసక్తికరం!
నటరాజన్ రాకతో..
ప్రపంచ క్రికెట్లోనే మేటిగా నిలిచిన భారత బౌలింగ్ దళం గత రెండు వన్డేల్లో వరుసగా 374, 389 పరుగులు సమర్పించుకుంది. పేసర్ నవదీప్ సైని, స్పిన్నర్ చాహల్ ప్రదర్శన తీసికట్టుగా మారింది. సైని 17 ఓవర్లలో 153 పరుగులు ఇవ్వగా, చాహల్ 19 ఓవర్లలో 160 పరుగులతో ఒక్క వికెట్ సాధించాడు. దీంతో రేపటి మ్యాచ్లో సైని స్థానంలో నటరాజన్ జట్టులోకి రావడం ఖాయమనిపిస్తోంది. ఐపీఎల్లో యార్కర్లతో గొప్ప ప్రదర్శన చేసిన అతడు బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టగలడు. కట్టర్లతో పాటు పిచ్ అనుకూలిస్తే బంతిని స్వింగ్ చేస్తూ సవాళ్లు విసురుతాడు. అతడి రాకతో ఆసీస్ స్కోరును భారత్ కట్టడి చేయొచ్చు. షమి, బుమ్రా..ఇద్దరిలో ఒక్కరికి విశ్రాంతి ఇవ్వాలనుకుంటే శార్దూల్ ఠాకూర్ కూడా జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
చాహల్×జంపా
అయితే ఆస్ట్రేలియా జట్టులో లెగ్ స్పిన్నర్ జంపా సిరీస్లో ఆరు వికెట్లతో సత్తా చాటుతుండగా చాహల్ మాత్రం విఫలమవుతున్నాడు. ధారాళంగా పరుగులు ఇవ్వడమేగాక వికెట్లు తీయలేకపోతున్నాడు. దీంతో చాహల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ తుదిజట్టులోకి వస్తాడని అంచనా. అయితే వికెట్ టేకర్ అయిన చాహల్ను తుదిజట్టులో కొనసాగించే అవకాశమూ లేకపోలేదు. మరోవైపు జడేజా ఎకానమీతో బౌలింగ్ చేస్తున్నా వికెట్లు సాధించలేకపోతున్నాడు. ఇక ఆరో బౌలర్గా హార్దిక్ అందుబాటులో ఉండటంతో బౌలింగ్ వనరులు మెరుగయ్యాయి. అయితే హార్దిక్ బౌలింగ్ ఫిట్నెస్పై ఇంకా గందరగోళ పరిస్థితే నెలకొంది. బౌలింగ్ కోటా పూర్తిచేయలేని స్థితిలో అతడు ఉన్నాడు.
కోహ్లీపై ఒత్తిడి
బుమ్రాకు కొత్తబంతిని రెండు ఓవర్లకే పరిమితం చేయడం, సైనీని తుదిజట్టులో కొనసాగించడంపై కోహ్లీ కోప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. అంతేగాక స్మిత్, మాక్స్వెల్ను ఔట్ చేయడానికి ప్రత్యేక వ్యూహాలు రచించకపోవడం, వారికి తగ్గట్లుగా ఫీల్డర్లను మోహరించడంలో విరాట్ విజయవంతం కాలేకపోతున్నాడు. బ్యాటింగ్ పరంగానూ కోహ్లీపై ఒత్తిడి నెలకొంది. ఈ ఏడాది అతడు మూడంకెల స్కోరును ఒక్కసారి కూడా అందుకోలేకపోయాడు. ఛేదన రారాజుగా జట్టుకు ఎన్నో విజయాలు అందించిన అతడు భారీ ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ను గెలిపించాల్సి ఉంది. అతడితో పాటు మిగిలిన బ్యాట్స్మెన్ కూడా సమయోచిత ఇన్నింగ్స్లు ఆడితే టీమిండియా తిరిగి గెలుపుబాట పడుతుంది.
వార్నర్ దూరమవ్వడం సానుకూలాంశమే
ఫామ్లో ఉన్న వార్నర్ గాయంతో పరిమిత ఓవర్ల సిరీస్కు దూరమవ్వడం టీమిండియాకు సానుకూలాంశం. ఫించ్తో కలిసి అతడు రెండు మ్యాచ్ల్లోనూ శతక భాగస్వామ్యం నెలకొల్పాడు. కాగా, వార్నర్ స్థానంలో లబుషేన్ ఓపెనర్గా బరిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆదిలోనే భారత్ వికెట్లు సాధిస్తే ఆసీస్పై ఒత్తిడి పెరుగుతుంది. అయితే స్మిత్ను త్వరగా పెవిలియన్కు చేర్చితేనే ఆస్ట్రేలియా ఆత్మరక్షణ ధోరణీలో ఆడుతుంది. లేనిపక్షంలో మరోసారి పరుగుల వరద ఖాయం. అలాగే మాక్స్వెల్ దూకుడును అడ్డుకుంటే భారత్ పోటీలో నిలుస్తుంది. గత మ్యాచ్ల్లో మాక్స్వెల్ ఆడిన ఇన్నింగ్సే ఓటమి అంతరంగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్మిత్, మాక్స్వెల్ను తొందరగా పెవిలియన్కు చేర్చితే క్లీన్స్వీప్ నుంచి టీమిండియా తప్పించుకుంటుంది.
జట్ల వివరాలు
భారత్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, హార్దిక్ పాండ్య, మయాంక్ అగర్వాల్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, నవదీప్ సైని, శార్దూల్ ఠాకూర్, టీ నటరాజన్
ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, లబుషేన్, మాక్స్వెల్, స్టాయినిస్, అలెక్స్ కేరీ, కమిన్స్, మిచెల్ స్టార్క్, జంపా, హేజిల్వుడ్, సీన్ అబాట్, ఆస్టన్ అగర్, కామెరన్ గ్రీన్, హెన్రిక్స్, ఆండ్రూ టై, డేనియల్ సామ్స్, మాథ్యూ వేడ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?