
అతడే భవిష్యత్తు నాయకుడు!
దిల్లీ: కేఎల్ రాహుల్ భవిష్యత్తులో టీమ్ ఇండియా కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మాజీలు అంటున్న విషయం తెలిసిందే. అలా పేర్కొంటున్న వారి జాబితాలో తాజాగా సునీల్ గావస్కర్ సైతం చేరిపోయారు. భారత క్రికెట్ జట్టుకు భవిష్యత్తులో కేఎల్ రాహుల్ నాయకుడయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ‘బాధ్యతగా వ్యవహరించాల్సి వచ్చినప్పుడు భారీ స్కోర్లు చేయగలను అని నిరుపించుకోవడానికి కేఎల్కు గొప్ప అవకాశం ఉంది. మరో విషయం ఏమిటంటే తనకు నాయకుడి లక్షణాలు ఉన్నాయని అతడు నిరూపించుకోగలడు. జట్టును ఎలా మలచుకోవాలి, ఎలాంటి నైపుణ్యం ప్రదర్శించాలన్న విషయంలో రాణించగలిగితే త్వరలోనే భారత జట్టుకు వైస్ కెప్టెన్ అవుతాడు. మన జట్టులో రోహిత్, కోహ్లీ, రహానే లాంటి గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. అయితే భవిష్యత్ కెప్టెన్ ఎవరనే విషయంలో రాహుల్ సైతం సెలక్షన్ కమిటీకి ఓ ఛాయిస్ కాగలడు. అందువల్ల ప్రస్తుత టోర్నీ అతడికి గొప్ప అవకాశం’’అని గావస్కర్ వివరించారు. టీ20 లీగ్లో కేఎల్ పంజాబ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సైతం కోహ్లీ వారసుడిగా రాహుల్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాడు. అయితే అందుకు తాను తగిన వాడినేనని రాహుల్ నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపాడు. ‘‘అతడే తన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించగలడని నేను అనుకుంటున్నాను. కోహ్లీ, రోహిత్లు దాదాపు ఒకే వయసు వారు. అందువల్ల ఏదో ఒక సందర్భంలో నాయకుడు ఎవరనే సందేహం కలుగుతుంది. ధోనీ తరువాత కోహ్లీ వచ్చాడు. కోహ్లీ తరువాత ఎవరో ఒకరు వస్తారు. అది కేఎలే అయ్యే అవకాశం ఉంది’’అని చోప్రా ఓ వీడియోలో తన అభిప్రాయం తెలిపాడు.
ధోనీ సారథిగా ఉన్న సమయంలో భారత భవిష్యత్తు కెప్టెన్ కోహ్లీనే అని చాలా స్పష్టంగా తెలిసింది. విరాట్ సైతం తన బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తున్నాడు. అయితే ప్రస్తుతం అతడి వయసు 30 దాటింది. దాంతో మరోసారి భవిష్యత్తు భారత కెప్టెన్ గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. వైస్ కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మ వయసు కూడా 30కి పైగా ఉండటంతో మాజీలు కేఎల్పై అంచనాలను పెంచుతున్నారు. మరి వారి అంచనా సరైనదేనా! కాదా! తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే..!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Kaali Poster: దర్శకురాలి పోస్టును తొలగించిన ట్విటర్.. క్షమాపణ చెప్పిన కెనడా మ్యూజియం
-
Crime News
కరాటే శిక్షణ ముసుగులో సంఘవిద్రోహ చర్యలు.. నిజామాబాద్లో ముగ్గురి అరెస్టు
-
India News
Bhagwant Mann: పంజాబ్ సీఎంకు కాబోయే భార్య గురించి తెలుసా?
-
Movies News
Driver Jamuna: ‘డ్రైవర్ జమున’గా ఐశ్వర్య రాజేశ్.. ఉత్కంఠ భరితంగా ట్రైలర్
-
Sports News
ధోనీ బర్త్డే స్పెషల్..41 అడుగుల కటౌట్
-
General News
Hyderabad: కన్నులపండువగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Andhra News: మేకప్ వేసి.. మోసం చేసి.. ముగ్గురిని వివాహమాడి..
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Online Food delivery: ఆన్లైన్ Vs ఆఫ్లైన్: ఫుడ్ డెలివరీ దోపిడీని బయటపెట్టిన యూజర్.. పోస్ట్ వైరల్!
- Gas Cylinder: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- Gautham Raju: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత
- Bhagwant Mann: రెండో వివాహం చేసుకోబోతోన్న సీఎం భగవంత్ మాన్!
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్పై శోభు యార్లగడ్డ ఫైర్
- Paid trip to employees: ఉద్యోగులందరికీ 2 వారాల ట్రిప్.. ఖర్చులన్నీ కంపెనీవే!
- Health : పొంచి ఉన్న ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు!
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?