ఐపీఎల్ కబుర్లు: ఏబీ వచ్చేయ్.. యువీ గుర్తుంది
ఇంటర్నెట్ డెస్క్ ఇండియన్ టీ20 లీగు ఆసక్తికరంగా సాగుతోంది. కోల్కతాపై విజయం సాధించిన బెంగళూరుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అలాగే 33 బంతుల్లో 73* పరుగులు బాదేసిన ఏబీ డివిలియర్స్ను అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేయాలన్న...
ధోనీ కోసం ఆ అభిమాని ఏం చేశాడో తెలుసా?
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ టీ20 లీగు ఆసక్తికరంగా సాగుతోంది. కోల్కతాపై విజయం సాధించిన బెంగళూరుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అలాగే 33 బంతుల్లో 73* పరుగులు బాదేసిన ఏబీ డివిలియర్స్ను అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేయాలన్న డిమాండ్లు మళ్లీ ఊపందుకున్నాయి. కొన్నిసార్లు అతడికి ఎలాంటి బంతులేయాలో తెలియదని డీకే అంటున్నాడు. ఇక ధోనీని విపరీతంగా ఇష్టపడే ఓ అభిమాని తమిళనాడులో ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ధోనీ అభిమాని ఇల్లు
క్రికెట్ ఆడే అనేక దేశాల్లో ఎంఎస్ ధోనీకి అభిమానులు ఉన్నారు. ఇక తమిళనాడు సంగతి చెప్పక్కర్లేదు. ‘తలా’ అంటూ అతడి ఆటను చూసేందుకు పడి చస్తారు. నెట్స్లో సాధన చేస్తున్నా వీక్షించేందుకు వేల సంఖ్యలో హాజరవుతారు. తమిళనాడు అరంగూర్లోని గోపీకృష్ణ అనే వ్యక్తి ధోనీపై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. తన ఇంటికి పూర్తిగా పసుపు రంగు వేయించి, చెన్నై లోగో, ఎంఎస్ ధోనీ ఫొటోలను గీయించాడు. అంతేకాకుండా ఆ ఇంటికి ‘ధోనీ అభిమాని ఇల్లు’ అని పేరు పెట్టాడు. ఈ చిత్రాలను చెన్నై ట్విటర్లో పంచుకుంది.
ఏబీ.. టాటా చెప్పేసెయ్
కోల్కతా మ్యాచులో అదరగొట్టిన బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్పై ప్రశంసలు కురుస్తున్నాయి. టీమ్ఇండియా కోచ్ రవిశాస్త్రి అతడిని అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేయాలని కోరాడు. ‘రాత్రి చూసిందాన్ని నమ్మలేకపోతున్నా. ఉదయం నిద్రలేచిన తర్వాతా అలాంటి అనుభూతే ఉంది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అంతర్జాతీయ క్రికెట్కు నీ అవసరం ఉంది. వీడ్కోలు నుంచి తిరిగొచ్చెయ్. అప్పుడు ఆట మరింత మెరుగవుతుంది’ అని ఏబీని శాస్త్రి తెగ పొగిడేశాడు.
సందడే సందడి
బెంగళూరు శిబిరంలో గెలుపు సందడి నెలకొంది. కోల్కతా మ్యాచ్ తర్వాత డ్రస్సింగ్ రూమ్లో ఆటగాళ్లందరూ సంతోషంగా గడిపారు. సంబరాలు చేసుకున్నారు. ఆడిన రెండు మ్యాచుల్లోనూ అదరగొట్టిన క్రిస్మోరిస్ను బెంగళూరు ప్రశంసించింది. 2 మ్యాచులాడిన అతడు 8 ఓవర్లు విసిరి 5 వికెట్లు తీశాడు. ఎకానమీ 4.5 మాత్రమే. ఇక ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ మధ్య సోదరబంధం గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ ఇండియన్ టీ20 లీగులో 3000+ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో.. ‘సోదరబంధం 3000+కు చేరుకుంది’ అని ట్వీట్ చేసింది.
‘బాస్’కు నయమైంది
కల్తీ ఆహారం తిని అస్వస్థతకు గురైన పంజాబ్ ఓపెనర్ క్రిస్గేల్ కోలుకున్నాడు. గురువారం బెంగళూరుతో జరిగే మ్యాచులో అతడు ఆడతాడని జట్టు వర్గాలు తెలిపాయి. సోమవారం సాయంత్రం నుంచే యూనివర్స్ బాస్ సాధన మొదలు పెట్టాడని తెలిసింది. అనారోగ్యం వల్లే గేల్ను హైదరాబాద్ మ్యాచులో ఆడించలేకపోతున్నామని ఆ జట్టు కోచ్ అనిల్ కుంబ్లే చెప్పిన సంగతి తెలిసిందే.
యూజీకి యువీ కౌంటర్
కోల్కతాపై విజయం తర్వాత తమ జట్టును అభినందిస్తూ బెంగళూరు ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ ఓ ట్వీట్ పెట్టాడు. ‘సింఫనీతో రాగాలు పలికించాలంటే ఒక్కరే సరిపోరు. మొత్తం ఆర్కెస్ట్రా అవసరం. గొప్ప బృంద స్ఫూర్తి ప్రదర్శించాం’ అని అన్నాడు. ఇందుకు టీమ్ఇండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ తమాషాగా బదులిచ్చాడు. ‘నువ్వు ఎవరినీ చనిపోనివ్వకూడదు! చూస్తుంటే నేనే మళ్లీ మైదానానికి రావాల్సి వస్తుందేమో మరి! అద్భుతమైన బౌలింగ్.. యూజీ’ అని సరదాగా ప్రశంసించాడు. అయితే మూడు బంతుల్లో 3 సిక్సర్లు బాదడం తనకింకా గుర్తుందని యూజీ బదులిచ్చాడు.
360 ఆటగాడు.. ఎలా వేయగలం?
అత్యంత కష్టమైన పనినీ ఏబీ డివిలియర్స్ తేలిగ్గా చేసేస్తాడని కోల్కతా సారథి దినేశ్ కార్తీక్ అన్నాడు. తమతో జరిగిన మ్యాచులో ఆఖరి 5 ఓవర్లలో 80 పరుగులు చేయడం అంత సులభం కాదని పేర్కొన్నాడు. అయినా దానిని ఏబీ సులువైందిగా మార్చేశాడని ప్రశంసించాడు. ‘అద్భుతమైన ఆటగాడని ఎందుకు అతడిని ప్రశంసిస్తారో మరోసారి నిరూపించాడు. కొన్నిసార్లు అతడికి ఎలాంటి బౌలింగ్ చేయాలో తెలియదు. ఎందుకంటే అతడు క్రీజులో ఎట్నుంచి ఎటైనా కదలగలడు. కానీ ఈ సారి మాత్రం అతడు ఎడమకాలి సాయంతో బంతుల్ని స్టేడియం బయటకు పంపించాడు’ అని కార్తీక్ అన్నాడు.
సంతోషం సగం బలం
హైదరాబాద్ జట్టు సాయంత్రం చేసిన ట్వీట్ అభిమానులను అలరిస్తోంది. మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ నవ్వుతున్న చిత్రాన్ని పోస్ట్ చేశారు. దానికి ‘సంతోషం సగం బలం’ అనే ట్యాగు జత చేశారు. గెలుపోటములు సహజమేనని, ఓడినా సంతోషంగా ఉంటేనే మళ్లీ గెలుపు పలకరిస్తుందని చెప్పకనే చెప్పారు! అని అభిమానులు అనుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
భళా పంత్!
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!