భారత్‌×ఇంగ్లాండ్‌: వాయిదా వేసిన బీసీసీఐ

ఈ ఏడాది సెప్టెంబర్‌-అక్టోబర్‌లో జరగాల్సిన భారత్‌-ఇంగ్లాండ్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీస్‌ వాయిదా పడింది. ఈ సిరీస్‌ను 2021కి వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. కొవిడ్‌-19 ముప్పు తొలగడకపోవడమే ఇందుకు కారణమని వెల్లడించింది. వచ్చే ఏడాది టెస్టు సిరీస్‌ తర్వాత ఈ సిరీస్‌ను కొనసాగిస్తారు.... 

Published : 07 Aug 2020 20:19 IST

ముంబయి: ఈ ఏడాది సెప్టెంబర్‌-అక్టోబర్‌లో జరగాల్సిన భారత్‌-ఇంగ్లాండ్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీస్‌ వాయిదా పడింది. ఈ సిరీస్‌ను 2021కి వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. కొవిడ్‌-19 ముప్పు తొలగకపోవడమే ఇందుకు కారణమని వెల్లడించింది. వచ్చే ఏడాది టెస్టు సిరీస్‌ తర్వాత ఈ సిరీస్‌ను కొనసాగిస్తారు. మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడతారు.

‘ఇంగ్లాండ్‌తో అన్ని ఫార్మాట్ల షెడ్యూలును ధ్రువీకరించుకొనేందుకే ఈసీబీ, బీసీసీఐ సంపద్రింపులు జరిపాయి. 2021 జనవరి నుంచి మార్చి వరకు ఇంగ్లాండ్‌ పురుషుల జట్టు భారత్‌లో పర్యటిస్తుంది’ అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ‘క్రికెట్‌ పునః ప్రారంభం కావడంతో రోజువారీ షెడ్యూలును ఈసీబీ, బీసీసీఐ నిర్ణయించాయి. ప్రపంచ క్రికెట్లో ఎక్కువగా ఎదురుచూసే పోటీల్లో భారత్‌-ఇంగ్లాండ్‌ సిరీస్‌ ఒకటి. ఈ రెండు జట్లు మైదానంలో తీవ్రంగా పోటీపడి అద్భుతమైన జ్ఞాపకాలను మిగులుస్తాయి’ అని షా అన్నారు.

ప్రస్తుతం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ను విజయవంతంగా నిర్వహించాలని బీసీసీఐ పట్టుదలతో ఉంది. మార్చిలో జరగాల్సిన టోర్నీని కొవిడ్‌-19 ముప్పుతో వాయిదా వేసిన సంగతి తెలిసిందే. భారత్‌లో పరిస్థితులు బాగా లేకపోవడంతో సెప్టెంబర్‌ 19-నవంబర్‌ 10 వరకు యూఏఈలో వేదికగా నిర్వహించేందుకు బోర్డు సిద్ధమైంది. నిర్వాహక ప్రక్రియను సైతం మొదలుపెట్టింది. అన్ని ఫ్రాంచైజీలు తమ జట్లకు శిబిరాలు ఏర్పాటు చేసి కొవిడ్‌-19 పరీక్షలు చేసేందుకు సమాయత్తం అవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని