భారత్లోనే కాదు ప్రపంచంలోనే గొప్ప ఆటగాడు
మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ పట్ల పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజిమామ్ ఉల్ హక్ స్పందించాడు. మహీ భారత్లోనే గొప్ప కాదని, ప్రపంచంలోనే గొప్ప ఆటగాడని పేర్కొన్నాడు...
ధోనీ రిటైర్మెంట్పై పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్
ఇంటర్నెట్డెస్క్: మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ పట్ల పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజిమామ్ ఉల్ హక్ స్పందించాడు. మహీ భారత్లోనే గొప్ప కాదని, ప్రపంచంలోనే గొప్ప ఆటగాడని పేర్కొన్నాడు. అలా ప్రశంసించేందుకు నిజమైన అర్హుడని చెప్పాడు. క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని విధంగా ఒక్కడే మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించాడని మాజీ క్రికెటర్ గుర్తుచేసుకున్నాడు. ఇక 2005లో పాకిస్థాన్ భారత పర్యటన సందర్భంగానే ధోనీ వెలుగులోకి వచ్చాడని, అప్పుడు తాను పాకిస్థాన్కు కెప్టెన్గా కొనసాగినట్లు స్పష్టంచేశాడు. తన కళ్లముందే మహీ అరంగేట్రం చేసినా అతడు ఆడే విధానం, బాడీ లాంగ్వేజ్ చూసి ఆశ్చర్యపోయానని చెప్పాడు. అప్పుడే ధోనీ ఎంతో అనుభవమున్న ఆటగాడిలా ఆడాడని వ్యాఖ్యానించాడు.
మరోవైపు ధోనీ సారథ్యంలోనే టీమ్ఇండియా విజయాల నిష్పత్తి మెరుగైందని, అంతకుముందు కేవలం ఉపఖండంలోనే రాణించేదని ఇంజమామ్ చెప్పాడు. ధోనీ పగ్గాలందుకున్నాక విదేశాల్లో సైతం మంచి ఫలితాలు రాబట్టిందని కొనియాడాడు. ఎక్కడికెళ్లినా గెలవాలనే పట్టుదలతోనే ముందడుగు వేస్తాడని, కెప్టెన్గా ఎలా విజయవంతమయ్యాడో ఆటగాడిగానూ అలాగే కొనసాగాడని పేర్కొన్నాడు. ఒక ఆటగాడిగా మ్యాచ్ను ఎలా ముగించాలనే విషయం అతడికి బాగా తెలుసని చెప్పాడు. అతడిలో ఆ లక్షణం చాలా మంచిదని, అది తనకు నచ్చిందని ఇంజమామ్ అన్నాడు. అలాగే టీమ్ఇండియాలో బాగా ఆడేవాళ్లు ఎంతమంది ఉన్నా, ఎవరూ చివరి వరకు క్రీజులో ఉండి గెలిపించేవాళ్లు కాదని చాలా మంది విమర్శించేవారన్నాడు. అలాంటిది ధోనీ వచ్చాక ఆ పరిస్థితిలో మార్పు వచ్చిందన్నాడు. అతడు చేసేవి ఎన్ని పరుగులైనా విజయం సాధించడమే అంతిమ లక్ష్యంగా పెట్టుకునేవాడని వివరించాడు. ఈ నేపథ్యంలోనే 2011 ప్రపంచకప్ ఫైనల్లో నాలుగో నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగి జట్టును గెలిపించాడని మెచ్చుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
భళా పంత్!
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!