దాదా, ధోనీ కలయికే రోహిత్ శర్మ
ముంబయి టీమ్ ఐదోసారి టీ20 లీగ్ ఛాంపియన్గా అవతరించడంపై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ హర్షం వ్యక్తం చేశాడు. ఆ జట్టు కెప్టెన్ రోహిత్శర్మ.. సౌరభ్ గంగూలీ, ఎంఎస్ ధోనీలాంటి...
ముంబయి కెప్టెన్ను ప్రశంసించిన ఇర్ఫాన్
ఇంటర్నెట్డెస్క్: ముంబయి టీమ్ ఐదోసారి టీ20 లీగ్ ఛాంపియన్గా అవతరించడంపై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ హర్షం వ్యక్తం చేశాడు. సౌరభ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ లక్షణాలను కలబోస్తే ముంబయి కెప్టెన్ రోహిత్శర్మ అవుతారని ప్రశంసించాడు. భారత జట్టు మాజీ సారథుల్లాగే రోహిత్ సైతం బౌలర్లపై నమ్మకముంచుతాడని చెప్పాడు. తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన ఇర్ఫాన్ ఇలా చెప్పుకొచ్చాడు.
‘ధోనీ, గంగూలీల కలయికే రోహిత్శర్మ. దాదా తన బౌలర్లను నమ్మకొనే ముందుకు సాగాడు. ధోనీ సైతం అలాగే చేశాడు. కానీ, ఎప్పటికప్పుడు అనూహ్యంగా నిర్ణయాలు తీసుకుంటాడు. ఇక రోహిత్ ఆటగాళ్లను వినియోగించే తీరు క్లాసిక్గా ఉంటుంది. అందుకు సూర్యకుమార్ యాదవ్ను ఆడించడమే నిదర్శనం. ఏ కెప్టెన్ అయినా అతడి స్థానంలో ఒక పేసర్ను తీసుకుంటాడు. రోహిత్ మాత్రం తెలివిగా వ్యవహరించాడు. దాంతోనే అతడు స్పష్టతతో నిర్ణయాలు తీసుకొంటున్నాడని అర్థమవుతోంది. అలాగే ఈ టోర్నీలో ఒక మ్యాచ్ ఓడిపోయే స్థితిలో ఉండగా అనూహ్యంగా బుమ్రాకు 17వ ఓవర్లో బంతి ఇచ్చాడు. సహజంగా బుమ్రాకు 18వ ఓవర్ కేటాయిస్తాడు. దాంతో మ్యాచ్ ముంబయికి అనుకూలంగా మారింది. మరోవైపు పొలార్డ్ను కూడా మొదట్లో బౌలింగ్కు ఉపయోగించలేదు. వికెట్లు సహకరించడంతో అతడికి బంతి అందించాడు’ అని పఠాన్ ముంబయి సారథి గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
-
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది నేవీ సిబ్బంది మృతి
-
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
-
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ