ఫుట్బాల్ దిగ్గజం పాలోరోజీ కన్నుమూత
1982 ఫుట్బాల్ ప్రపంచకప్ విజేత సభ్యుడు, ఇటలీ దిగ్గజం పాలోరాసీ(64) గురువారం తెల్లవారుజామున కన్నుమూశాడు. ఆయన పనిచేస్తున్న ఆర్ఏఐ స్పోర్ట్స్ వార్తా సంస్థ...
ఇంటర్నెట్డెస్క్: 1982 ఫుట్బాల్ ప్రపంచకప్ విజేత సభ్యుడు, ఇటలీ దిగ్గజం పాలోరోజీ(64) గురువారం తెల్లవారుజామున కన్నుమూశాడు. ఆయన పనిచేస్తున్న ఆర్ఏఐ స్పోర్ట్స్ వార్తా సంస్థ ఈ విషయాన్ని ట్వీట్ చేసి వెల్లడించింది. 1982 స్పెయిన్లో జరిగిన సాకర్ ప్రపంచకప్లో రోజీ ఆరు గోల్స్ సాధించి ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. లీగ్ దశలో బ్రెజిల్ పై హ్యాట్రిక్ సాధించిన అతడు తర్వాత సెమీఫైనల్స్లో పొలాండ్పై 2 గోల్స్ కొట్టాడు. ఇక వెస్ట్ జర్మనీతో తలపడిన ఫైనల్లో తొలి గోల్ ఆయనే సాధించాడు. దాంతో ఇటలీ 3-1 తేడాతో వెస్ట్ జర్మనీపై విజయం సాధించింది. ఇదిలా ఉండగా, పాలోరోజీ జువాంటస్ జట్టు తరఫున నాలుగేళ్లు ఆడి రెండుసార్లు ‘ఇటాలియన్ సిరీస్-ఏ’ టైటిళ్లు అందించాడు. ఒక యూరోపియన్ కప్ను అందించాడు. అనంతరం స్పాట్ ఫిక్సింగ్ కేసులో చిక్కుకొని రెండేళ్ల పాటు ఆటకు దూరమయ్యాడు. గురువారం ఉదయం రోజీ మరణించిన కొద్దిసేపటికే సతీమణి కాపెల్లీ ఫెడెరికా ఇన్స్టాగ్రామ్లో తన భర్తతో దిగిన ఫొటోను పంచుకొని ‘Forever’ అని పేర్కొంది. అయితే, అతడి మృతికి గల కారణాలను వెల్లడించలేదు. ఫుట్బాల్ దిగ్గజం డీగో మారడోనా మరణించిన కొద్దిరోజులకే రోజీ మృతిచెందడం ఫుట్బాల్ అభిమానులను కలచివేస్తోంది.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?