- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
కోహ్లీ కన్నా బుమ్రాకే ఎక్కువ పారితోషికం
ఇంటర్నెట్డెస్క్: చూస్తుండగానే 2020 ముగిసింది. కరోనా నేపథ్యంలో టీమ్ఇండియా ఈ ఏడాది పరిమిత సంఖ్యలోనే మ్యాచ్లాడింది. అయితే, భారత ఆటగాళ్లలో ఈ సంవత్సరం అందరి కన్నా ఎక్కువ ఆర్జించింది మాత్రం పేసర్ జస్ప్రీత్ బుమ్రా. కెప్టెన్ విరాట్ కోహ్లీ కన్నా ఎక్కువ పారితోషికం సంపాదించాడు.
బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్లో కోహ్లీ, బుమ్రా, రోహిత్ శర్మ.. A+ కేటగిరీలో ఉన్నారు. ఈ ముగ్గురూ ఏడాదికి రూ.7 కోట్ల చొప్పున అందుకుంటారు. ఇది కాకుండా బీసీసీఐ ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులు కూడా చెల్లిస్తుంది. ఒక్క టెస్టు మ్యాచ్కు రూ.15 లక్షలు, వన్డేకు రూ.6 లక్షలు, టీ20లకు 3లక్షల చొప్పున పారితోషికం అందజేస్తుంది. ఈ నేపథ్యంలో బుమ్రా 2020లో అందరికన్నా ఎక్కువ మ్యాచ్లు ఆడి ఎక్కువ ఆదాయం పొందాడు. మొత్తం 4 టెస్టులు, 9 వన్డేలు, 8 టీ20లు ఆడిన టీమ్ఇండియా పేసర్ ఈ ఏడాది మ్యాచ్ ఫీజుల రూపంలో రూ.1.38 కోట్లు తన ఖాతాలో వేసుకోనున్నాడు.
కోహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు ఆడలేకపోవడంతో రూ.1.29 కోట్లు అందుకోనున్నాడు. ఒకవేళ ఈ మ్యాచ్ కూడా ఆడి ఉంటే టీమ్ఇండియా సారథి మొత్తం రూ.1.44 కోట్లు అందుకొని అగ్రస్థానంలో నిలిచేవాడు. మరోవైపు A కేటగిరీలో ఉన్న ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఈ ఏడాది మ్యాచ్ ఫీజుల రూపంలో తీసుకునేది రూ.96 లక్షలు. బుమ్రా, కోహ్లీ తర్వాత ఇతడే మూడో స్థానంలో నిలిచాడు. ఇక ఓపెనర్ రోహిత్ శర్మ ఈ ఏడాది గాయాల కారణంగా ఎక్కవ మ్యాచ్లు ఆడలేకపోయాడు. దీంతో అతడి ఆదాయం రూ.30లక్షలకే పరిమితమైంది.
ఇవీ చదవండి..
ఇదేం అంపైరింగ్? బాక్సింగ్ డే టెస్టుపై రచ్చ
జింక్స్ అదరహో: సెహ్వాగ్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (19/08/2022)
-
World News
Sanna Marin: మరో వివాదంలో ఫిన్లాండ్ ప్రధాని.. డ్యాన్స్ వీడియో వైరల్!
-
India News
Punjab: ₹150 కోట్ల స్కాం.. 11వేలకు పైగా యంత్రాలు మాయం!
-
Sports News
Chahal-Dhanashree: విడాకుల రూమర్లపై స్పందించిన యుజువేంద్ర చాహల్
-
Technology News
Noise Smartwatch: ఫోన్ కాలింగ్, హెల్త్ సూట్ ఫీచర్లతో నాయిస్ కొత్త స్మార్ట్వాచ్
-
Movies News
Puri Jagannadh: ఛార్మితో రిలేషన్షిప్పై పెదవి విప్పిన పూరి జగన్నాథ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Puri Jagannadh: ఛార్మితో రిలేషన్షిప్పై పెదవి విప్పిన పూరి జగన్నాథ్
- Rahul Gandhi: మోదీజీ.. సిగ్గుచేటుగా అనిపించడం లేదా..! రాహుల్ ఫైర్
- Trump: ట్రంప్ పర్యటనకు కేంద్రం ఎంత ఖర్చు చేసిందో తెలుసా?
- Chahal-Dhanashree: విడాకుల రూమర్లపై స్పందించిన యుజువేంద్ర చాహల్
- Arjun kapoor: అర్జున్.. ప్రజల్ని బెదిరించకు..నటనపై దృష్టి పెట్టు: భాజపా మంత్రి సలహా
- Subramanian Swamy: భాజపాలో ఎన్నికల్లేవ్.. అంతా ‘మోదీ’ ఆమోదంతోనే..!
- Sanna Marin: మరో వివాదంలో ఫిన్లాండ్ ప్రధాని.. డ్యాన్స్ వీడియో వైరల్!
- Punjab: ₹150 కోట్ల స్కాం.. 11వేలకు పైగా యంత్రాలు మాయం!
- అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్న ఎక్స్ఛేంజ్లో విద్యుత్ కొనుగోలు, అమ్మకాలు
- Chiranjeevi: మెగా హీరోలను కలవాలనుకుంటున్నారా? మీకిదే అవకాశం!