కోహ్లీ కన్నా బుమ్రాకే ఎక్కువ పారితోషికం

చూస్తుండగానే 2020 పూర్తి అయింది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాదంతా గందరగోళంగా మారింది. ఆటలు కూడా పూర్తి స్థాయిలో సాగలేదు. టీమ్‌ఇండియా సైతం ఈ ఏడాది పరిమిత సంఖ్యలోనే మ్యాచ్‌లాడింది...

Updated : 23 Feb 2024 19:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చూస్తుండగానే 2020 ముగిసింది. కరోనా నేపథ్యంలో టీమ్‌ఇండియా ఈ ఏడాది పరిమిత సంఖ్యలోనే మ్యాచ్‌లాడింది. అయితే, భారత ఆటగాళ్లలో ఈ సంవత్సరం అందరి కన్నా ఎక్కువ ఆర్జించింది మాత్రం పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కన్నా ఎక్కువ పారితోషికం సంపాదించాడు.

బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్‌లో కోహ్లీ, బుమ్రా, రోహిత్‌ శర్మ.. A+ కేటగిరీలో ఉన్నారు. ఈ ముగ్గురూ ఏడాదికి రూ.7 కోట్ల చొప్పున అందుకుంటారు. ఇది కాకుండా బీసీసీఐ ఆటగాళ్లకు మ్యాచ్‌ ఫీజులు కూడా చెల్లిస్తుంది. ఒక్క టెస్టు మ్యాచ్‌కు రూ.15 లక్షలు, వన్డేకు రూ.6 లక్షలు, టీ20లకు 3లక్షల చొప్పున పారితోషికం అందజేస్తుంది. ఈ నేపథ్యంలో బుమ్రా 2020లో అందరికన్నా ఎక్కువ మ్యాచ్‌లు ఆడి ఎక్కువ ఆదాయం పొందాడు. మొత్తం 4 టెస్టులు, 9 వన్డేలు, 8 టీ20లు ఆడిన టీమ్‌ఇండియా పేసర్‌ ఈ ఏడాది మ్యాచ్‌ ఫీజుల రూపంలో రూ.1.38 కోట్లు తన ఖాతాలో వేసుకోనున్నాడు.

కోహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు ఆడలేకపోవడంతో రూ.1.29 కోట్లు అందుకోనున్నాడు. ఒకవేళ ఈ మ్యాచ్‌ కూడా ఆడి ఉంటే టీమ్‌ఇండియా సారథి మొత్తం రూ.1.44 కోట్లు అందుకొని అగ్రస్థానంలో నిలిచేవాడు. మరోవైపు A కేటగిరీలో ఉన్న ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఈ ఏడాది మ్యాచ్‌ ఫీజుల రూపంలో తీసుకునేది రూ.96 లక్షలు. బుమ్రా, కోహ్లీ తర్వాత ఇతడే మూడో స్థానంలో నిలిచాడు. ఇక ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఈ ఏడాది గాయాల కారణంగా ఎక్కవ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. దీంతో అతడి ఆదాయం రూ.30లక్షలకే పరిమితమైంది.  

ఇవీ చదవండి..

ఇదేం అంపైరింగ్‌? బాక్సింగ్ డే టెస్టుపై రచ్చ

జింక్స్‌ అదరహో: సెహ్వాగ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని