కోహ్లీ కన్నా బుమ్రాకే ఎక్కువ పారితోషికం
చూస్తుండగానే 2020 పూర్తి అయింది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాదంతా గందరగోళంగా మారింది. ఆటలు కూడా పూర్తి స్థాయిలో సాగలేదు. టీమ్ఇండియా సైతం ఈ ఏడాది పరిమిత సంఖ్యలోనే మ్యాచ్లాడింది...
ఇంటర్నెట్డెస్క్: చూస్తుండగానే 2020 ముగిసింది. కరోనా నేపథ్యంలో టీమ్ఇండియా ఈ ఏడాది పరిమిత సంఖ్యలోనే మ్యాచ్లాడింది. అయితే, భారత ఆటగాళ్లలో ఈ సంవత్సరం అందరి కన్నా ఎక్కువ ఆర్జించింది మాత్రం పేసర్ జస్ప్రీత్ బుమ్రా. కెప్టెన్ విరాట్ కోహ్లీ కన్నా ఎక్కువ పారితోషికం సంపాదించాడు.
బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్లో కోహ్లీ, బుమ్రా, రోహిత్ శర్మ.. A+ కేటగిరీలో ఉన్నారు. ఈ ముగ్గురూ ఏడాదికి రూ.7 కోట్ల చొప్పున అందుకుంటారు. ఇది కాకుండా బీసీసీఐ ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులు కూడా చెల్లిస్తుంది. ఒక్క టెస్టు మ్యాచ్కు రూ.15 లక్షలు, వన్డేకు రూ.6 లక్షలు, టీ20లకు 3లక్షల చొప్పున పారితోషికం అందజేస్తుంది. ఈ నేపథ్యంలో బుమ్రా 2020లో అందరికన్నా ఎక్కువ మ్యాచ్లు ఆడి ఎక్కువ ఆదాయం పొందాడు. మొత్తం 4 టెస్టులు, 9 వన్డేలు, 8 టీ20లు ఆడిన టీమ్ఇండియా పేసర్ ఈ ఏడాది మ్యాచ్ ఫీజుల రూపంలో రూ.1.38 కోట్లు తన ఖాతాలో వేసుకోనున్నాడు.
కోహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు ఆడలేకపోవడంతో రూ.1.29 కోట్లు అందుకోనున్నాడు. ఒకవేళ ఈ మ్యాచ్ కూడా ఆడి ఉంటే టీమ్ఇండియా సారథి మొత్తం రూ.1.44 కోట్లు అందుకొని అగ్రస్థానంలో నిలిచేవాడు. మరోవైపు A కేటగిరీలో ఉన్న ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఈ ఏడాది మ్యాచ్ ఫీజుల రూపంలో తీసుకునేది రూ.96 లక్షలు. బుమ్రా, కోహ్లీ తర్వాత ఇతడే మూడో స్థానంలో నిలిచాడు. ఇక ఓపెనర్ రోహిత్ శర్మ ఈ ఏడాది గాయాల కారణంగా ఎక్కవ మ్యాచ్లు ఆడలేకపోయాడు. దీంతో అతడి ఆదాయం రూ.30లక్షలకే పరిమితమైంది.
ఇవీ చదవండి..
ఇదేం అంపైరింగ్? బాక్సింగ్ డే టెస్టుపై రచ్చ
జింక్స్ అదరహో: సెహ్వాగ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
భళా పంత్!
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..