కోల్కతా.. కోరుకోని రికార్డులు..!
బెంగళూరు చేతిలో ఘోర పరాభవం చవిచూసిన కోల్కతా జట్టు పలు చెత్త రికార్డులను నమోదు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కోల్కతా బ్యాటింగ్కు దిగింది. కోల్కతాకు కలిసొచ్చిన విషయం ఏమైనా ఉంది అంటే అది టాస్ గెలవడం ఒక్కటే.
ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరు చేతిలో ఘోర పరాభవం చవిచూసిన కోల్కతా జట్టు పలు చెత్త రికార్డులు నమోదు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆ జట్టు బ్యాటింగ్కు దిగింది. ఆ జట్టుకు కలిసొచ్చిన విషయం ఏమైనా ఉంది అంటే అది టాస్ గెలవడం ఒక్కటే. తర్వాత మొత్తం బెంగళూరుదే ఆధిపత్యం. ప్రత్యర్థి బౌలర్ల ధాటికి కోల్కతా బ్యాట్స్మెన్ తేలిపోయారు. దీంతో 84 పరుగులకే ఆ జట్టు పరిమితమైంది. బ్యాటింగ్.. బౌలింగ్ విభాగాల్లో చేతులెత్తేయడంతో ప్రత్యర్థి చేతిలో 8 వికెట్ల తేడాతో చిత్తయింది. అయితే.. ఈ మ్యాచ్లో కోల్కతా ఖాతాలో చేరిన చెత్త రికార్డులేంటో ఓసారి చూద్దాం..
పవర్ప్లేలో అత్యంత పేలవం..
మొదటి ఆరు ఓవర్లు పవర్ప్లే. అది బ్యాటింగ్ జట్టుకు ఒక వరంలాంటింది. కానీ.. అదే సమయంలో వికెట్ కోల్పోయే ప్రమాదాలూ ఉంటాయి. పవర్ప్లేలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించనూ వచ్చు.. వికెట్లూ పడగొట్టొచ్చు. కానీ కోల్కతా కథ వేరేలా ఉంది. అటు పరుగు చేయలేక.. ఇటు బౌలింగ్ సమయంలో వికెట్లను పడగొట్టలేక పవర్ప్లేను వృథా చేసింది. పవర్ప్లే అనగానే కోల్కతా బౌలర్లు వణికిపోతున్నారు. ఆ జట్టు ఆడిన గత ఐదు మ్యాచుల్లో ఈ దశలో ఒక్క వికెట్ కూడా తీయలేదు. పంజాబ్-47/0, బెంగళూరు-47/0, ముంబయి-51/0, హైదరాబాద్-58/0, బెంగళూరు-44/0 ఇలా వికెట్ తీయకుండానే ప్రత్యర్థి జట్లకు పరుగులిచ్చేసింది. పవర్ప్లేలో ఆ జట్టు బౌలర్లు తీసిన వికెట్లు కేవలం 3. ఈ విషయంలో ముంబయిది అగ్రస్థానం. 6 మ్యాచుల్లో 13 వికెట్లు తీసి టాప్లో ఉంది. పవర్ప్లేలో కోల్కతా బ్యాట్స్మెన్ ప్రదర్శన కూడా అలాగే ఉంది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో మొదటి ఆరు ఓవర్లలో 17 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు సమర్పించుకొన్నారు. ఈ టీ20 సీజన్లో ఇదే అత్యల్పం. కోల్కతాకు మాత్రం ఆల్టైం చెత్త రికార్డు ఇది. 2009లో హైదరాబాద్-21/3, 2010లో చెన్నై-22/4, 2014లో పంజాబ్-24/3 పవర్ప్లేలో అత్యల్ప స్కోర్లు నమోదు చేశాయి.
అన్ని ఓవర్లూ ఆడి.. అత్యల్ప స్కోరు చేసి..
లీగ్ చరిత్రలోనే 20 ఓవర్లు బ్యాటింగ్ చేసి ఆలౌట్ కాకుండా అత్యల్ప స్కోరు చేసిన జట్టుగా కోల్కతా మరో చెత్త రికార్డు నెలకొల్పింది. బెంగళూరు మీద 8 వికెట్లు కోల్పోయిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 84 పరుగులు మాత్రమే చేసింది. గతంలో 2009 సీజన్లో పంజాబ్ జట్టు చెన్నైతో జరిగిన మ్యాచ్లో 8 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. తాజా ప్రదర్శనతో కోల్కతా ఆ రికార్డును తిరగరాసింది.
వికెట్లు కోల్పోవడంలోనూ రికార్డు..
తక్కువ పరుగులకే మొదటి మూడు వికెట్లు కోల్పోయిన జాబితాలోనూ కోల్కతా చోటు సంపాదించింది. ఈ మ్యాచ్లో కేవలం మూడు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. 2013లో చెన్నై జట్టు కోల్కతా చేతిలో, రాజస్థాన్ జట్టు హైదరాబాద్ చేతిలో ఇలాంటి రికార్డులనే నమోదు చేశాయి. 2009లో హైదరాబాద్ జట్టు చెన్నై చేతిలో, 2011లో కొచ్చి జట్టు హైదరాబాద్ చేతిలో కేవలం ఒక్క పరుగుకే మూడు వికెట్లు కోల్పోయి అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాయి. తాజాగా ఈ జాబితాలో కోల్కతా ఐదో స్థానంలోకి దూసుకెళ్లింది.
కార్తిక్కు లెగ్స్పిన్ ఫీవర్..
లెగ్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో కోల్కతా బ్యాట్స్మన్ దినేశ్ కార్తిక్ ఘోరంగా విఫలమవుతున్నాడు. అతను ఈ సీజన్లో లెగ్స్పిన్నర్ల నుంచి 18 బంతులు ఎదుర్కొని ఐదుసార్లు పెవిలియన్కు చేరాడు. కేవలం 14 పరుగులు చేశాడు. లెగ్ స్పిన్నర్లపై అతని సగటు 2.80. బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
పంజాబ్పై 9 పరుగుల తేడాతో ముంబయి గెలిచింది. కానీ, ఆ జట్టుకు అంపైర్లు మద్దతుగా నిలిచారనే ఆరోపణలు వస్తున్నాయి. -
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ