టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా

ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లతో అభిమానులకు మజానిస్తున్న టీ20 లీగ్‌లో మరో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. అబుదాబి వేదికగా జరగనున్న 21వ మ్యాచ్‌లో కోల్‌కతా, చెన్నై జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన కోల్‌కతా.....

Published : 07 Oct 2020 19:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లతో అభిమానులకు మజానిస్తున్న టీ20 లీగ్‌లో మరో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. అబుదాబి వేదికగా జరగనున్న 21వ మ్యాచ్‌లో కోల్‌కతా, చెన్నై జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన కోల్‌కతా బ్యాటింగ్‌ ఎంచుకుంది. వరుసగా రెండు విజయాలు సాధించిన కార్తిక్‌సేన.. దిల్లీతో జరిగిన గత మ్యాచ్‌లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి తిరిగి గెలుపు బాట పట్టాలని ఆ జట్టు చూస్తోంది. మరోవైపు వరుస ఓటముల తర్వాత పంజాబ్‌పై ఘన విజయం సాధించిన చెన్నై ఈ మ్యాచ్‌లోనూ పైచేయి సాధించాలని పట్టుదలతో ఉంది. 

జట్ల వివరాలు..

కోల్‌కతా: శుభ్‌మన్‌ గిల్‌, సునిల్‌ నరైన్‌, నితీశ్‌ రాణా, రసెల్‌, దినేశ్‌ కార్తిక్ ‌(కెప్టెన్‌), ఇయాన్‌ మోర్గాన్‌, కమిన్స్‌, రాహుల్‌ త్రిపాఠి, శివమ్‌ మావి, కమలేశ్‌ నాగర్‌కోటి, వరుణ్‌ చక్రవర్తి

చెన్నై: డుప్లెసిస్‌, షేన్‌ వాట్సన్‌, అంబటి రాయుడు, ధోనీ (కెప్టెన్‌), కేదార్‌ జాదవ్‌, రవీంద్ర జడేజా, డ్వేన్‌ బ్రావో, సామ్‌ కరన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, కర్ణ్‌ శర్మ, దీపక్‌ చాహర్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని