ధోనీ యాక్షన్.. అంపైర్ రియాక్షన్
యూఏఈలో జరుగుతున్న టీ20 లీగ్లో మంగళవారం చెన్నై, హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. చెన్నై నిర్దేశించిన లక్ష్యాన్ని హైదరాబాద్ జట్టు ఛేదించలేకపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు బ్యాటింగ్.......
దుబాయ్: యూఏఈలో జరుగుతున్న టీ20 లీగ్లో మంగళవారం చెన్నై, హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. చెన్నై నిర్దేశించిన లక్ష్యాన్ని హైదరాబాద్ జట్టు ఛేదించలేకపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చోటు చేసుకున్న ఓ సంఘటన సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ అవుతోంది.
19వ ఓవర్లో రషీద్ఖాన్ బ్యాటింగ్ చేయగా శార్దూల్ఠాకూర్ బౌలింగ్ వేశాడు. ఆ సమయంలో హైదరాబాద్కు 11 బంతుల్లో 25 పరుగులు కావాల్సి ఉంది. ఆ ఓవర్లో శార్దూల్ వేసిన యార్కర్ బంతిని అంపైర్ రెయిఫెల్.. వైడ్గా ప్రకటించబోయారు. దాన్ని గమనించిన చెన్నై సారథి ధోనీ ఆ నిర్ణయాన్ని విభేదిస్తూ ముందుకొచ్చాడు. దీంతో అంపైర్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. అంపైర్ చర్యపై ఆ సమయంలో వార్నర్ అసహనం వ్యక్తం చేశాడు. ధోనీ వ్యవహరించిన తీరుపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. చెన్నై సారథి అంపైర్ను బెదిరించి గెలిచాడని కొందరు.. మిస్టర్ కూల్ కూల్నెస్ను కోల్పోయాడని ఇంకొందరు ట్వీట్లు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.