ధోనీ యాక్షన్‌.. అంపైర్‌ రియాక్షన్

యూఏఈలో జరుగుతున్న టీ20 లీగ్‌లో మంగళవారం చెన్నై, హైదరాబాద్‌ జట్లు తలపడ్డాయి. చెన్నై నిర్దేశించిన లక్ష్యాన్ని హైదరాబాద్‌ జట్టు ఛేదించలేకపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టు బ్యాటింగ్‌.......

Published : 15 Oct 2020 01:15 IST

దుబాయ్‌: యూఏఈలో జరుగుతున్న టీ20 లీగ్‌లో మంగళవారం చెన్నై, హైదరాబాద్‌ జట్లు తలపడ్డాయి. చెన్నై నిర్దేశించిన లక్ష్యాన్ని హైదరాబాద్‌ జట్టు ఛేదించలేకపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టు బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో చోటు చేసుకున్న ఓ సంఘటన సామాజిక మాధ్యమాల్లో ట్రోల్‌ అవుతోంది. 

19వ ఓవర్లో రషీద్‌ఖాన్‌ బ్యాటింగ్‌ చేయగా శార్దూల్‌ఠాకూర్‌ బౌలింగ్‌ వేశాడు. ఆ సమయంలో హైదరాబాద్‌కు 11 బంతుల్లో 25 పరుగులు కావాల్సి ఉంది. ఆ ఓవర్లో శార్దూల్‌ వేసిన యార్కర్‌ బంతిని అంపైర్ రెయిఫెల్.. వైడ్‌గా ప్రకటించబోయారు. దాన్ని గమనించిన చెన్నై సారథి ధోనీ ఆ నిర్ణయాన్ని విభేదిస్తూ ముందుకొచ్చాడు. దీంతో అంపైర్‌ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. అంపైర్‌ చర్యపై ఆ సమయంలో వార్నర్‌ అసహనం వ్యక్తం చేశాడు. ధోనీ వ్యవహరించిన తీరుపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. చెన్నై సారథి అంపైర్‌ను బెదిరించి గెలిచాడని కొందరు.. మిస్టర్‌ కూల్‌ కూల్‌నెస్‌ను కోల్పోయాడని ఇంకొందరు ట్వీట్లు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని