ఫుట్బాల్తో జీవితపాఠాలు
అది దిల్లీ నగరంలోని ఓ మురికివాడ. సమయం ఉదయం 3:30. స్పోర్ట్స్ దుస్తులు ధరించి ఫుట్బాల్ ఆడేందుకు మైదానానికి బయలుదేరారు ఆ మురికివాడలో నివసించే పిల్లలు. ...
చిత్రాలు: వారి అధికారిక ఫేస్బుక్ ఖాతా నుంచి..
ఇంటర్నెట్ డెస్క్: అది దిల్లీ నగరంలోని ఓ మురికివాడ. సమయం ఉదయం 3:30. స్పోర్ట్స్ దుస్తులు ధరించి ఫుట్బాల్ ఆడేందుకు మైదానానికి బయలుదేరారు ఆ మురికివాడలో నివసించే పిల్లలు. వీరంతా ఎవరో తెలుసా! ఒకప్పుడు దొంగతనాలు చేసినవారు. తినేందుకు అడుక్కునే వారు. మాదక ద్రవ్యాలకు బానిసలైనవారు. ఒకరైతే ఏకంగా తీవ్రవాదైపోదామనుకున్నారు. కానీ ఇప్పుడు వీరందరూ మారారు. వీరిని మార్చాడో వ్యక్తి. వారి కోసం ఓ అకాడమీ స్థాపించాడు. ప్రొఫెషనల్ ఫుట్బాల్ ఆటగాళ్లుగా తీర్చిదిద్దుతున్నాడు. ఇంతకీ ఎవరతను? తను స్థాపించిన అకాడమీ ఏంటి? చదివేద్దాం.
దిల్లీలోని ఓ మురికివాడ. పేరు వికాస్ పురి. అక్కడ పిల్లలందరూ చదువుకు దూరమై, చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. తిండి, చదువుకు ఆమడదూరంలో అంధకారంలో బతికేస్తున్న వారిని చూసి చలించిపోయాడో ఓ కుర్రాడు. పేరు సిల్వెస్టర్ పీటర్. అప్పుడు తన వయసు కేవలం 13 సంవత్సరాలు. వారికి సరైన విద్య అందేలా చూడాలనుకున్నాడు. ఆ సమయంలో తనకొచ్చిన ఆలోచన ఫుట్బాల్. సంప్రదాయ చదువుల కంటే సమాజాన్ని చదివేలా వారికి ఆటలతో శిక్షణనివ్వాలనుకున్నాడు. అందుకు ఓ అకాడమిని స్థాపించాడు. అదే ‘మై ఏంజెల్స్ అకాడమి’. ఫుట్బాల్ అంటే తనకి చాలా ఇష్టం అందుకే ఆ ఆటతోనే వారిలో మార్పు తేవాలనుకున్నాడు. అలా దగ్గరలోని పబ్లిక్ గ్రౌండ్ని ఎంచుకుని వారికి ఫుట్బాల్ శిక్షణనివ్వడం మొదలెట్టాడు. ప్రతి రోజూ ఉదయం 3:30కి శిక్షణ ప్రారంభం. ఆ సమయంలో మైదానంలో ఎవరూ ఉండరు వారు తప్ప.. అందుకే ఆ సమయాన్ని ఎంచుకున్నాడు. రోజూ వచ్చేలా ఆ పిల్లల్లో ఆసక్తి పెంచాడు. గ్రౌండ్కి వచ్చీరాగానే వారికి వార్మప్ అవసరం. ముందుగా మైదానాన్ని శుభ్రం చేయడమే వారి వార్మప్. అలా వారికి శుభ్రతపైనా, పర్యావరణంపైనా అవగాహన కల్పించేవాడు. శుభ్రమైన దుస్తులనే ధరించాలని చెప్పేవాడు. ఇలా రోజూ ఉదయం సుమారు 130మంది బాలబాలికలకు శిక్షణనిస్తాడు. గత 29ఏళ్లుగా ఎంతో మంది ఫుట్బాల్ క్రీడాకారులను తయారు చేశాడు. ప్రయివేటు పాఠశాల విద్యార్థులతో ఫుట్బాల్ పోటీల్లో తలపడి ఎన్నో విజయాలు అందుకుంది తన ‘మై ఏంజెల్స్ అకాడమి’. మైదానంలో పేద ధనిక తేడాలేదని.. ఒక్కసారి మైదానంలో అడుగెడితే అన్నీ మరిచి ఆటలో సత్తా చాటాలని వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాడీ ఫుట్బాల్ గురు పీటర్..
అదొక్కటే కాదు..!
కేవలం ఫుట్బాల్ మాత్రమే కాదు. జీవితంలో తన కాళ్లపై తాము నిలబడేలా జీవిత పాఠాలను నేర్పుతున్నాడు. ఒక్కపూట తిండి కోసం ఇంటింటికీ తిరిగే పిల్లలు ఇప్పుడు స్వయంగా వంట చేసి ఇతరుల కడుపునింపుతున్నారు. ఎప్పుడూ గొడవలు, అల్లర్లతో కుస్తీలు పట్టే బాలలకి యోగా, వ్యాయామంతో శాంతి పాఠాలను నేర్పుతున్నాడు. అంతేకాదు వారికి నచ్చిన రంగాల్లో వారు స్థిరపడేలా నాట్యం, సంగీతం, చెస్, డిజైనింగ్, పేయింటింగ్, కంప్యూటర్ విద్య.. ఇలా అనేక రంగాల్లో వారి ప్రతిభను నిరూపించుకునేలా వారిని ప్రోత్సహిస్తున్నాడు. జీవితంలో సమయపాలన, సహనం, గెలుపోటములను స్వీకరించేతత్వం.. ఇవి ముఖ్యమని చెబుతూ వారిని అభివృద్ధి పథంలోకి సాగనంపుతున్నాడు. వీలైనపుడు విహారయాత్రలకు తీసుకెళ్తూ వారికి ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నాడు. తన సొంత డబ్బు, స్నేహితులు, దాతల ప్రోత్సాహంతో వీటన్నింటికీ కార్యరూపం దాల్చేలా చూస్తున్నాడు.
అదే తన సంతోషం
తన చిన్నతనంలో ఎన్నో కష్టాలు పడిన పీటర్కి చదువు విలువ తెలుసు. చదువంటే కేవలం పుస్తకాలు మాత్రమే కాదంటాడు. సమాజం పట్ల ఓ అవగాహన కలిగి ఉండాలంటాడు. తోటి వారు ఆపదలో ఉంటే సహాయం చేయాలంటాడు. అలా తన సంస్థ ద్వారా ఎంతో మంది దొంగతనాలకు అలవాటుపడిన వారిని, అడుక్కునే పిల్లలని, కాగితాలు ఏరుకునే చిన్నారులని మార్చానని అదే తనకి సంతృప్తినిస్తుందని చెబుతుంటాడు. తన వద్ద శిక్షణ తీసుకున్న కొందరు ఇప్పడు ఫుట్బాల్ ప్లేయర్లుగా, కోచ్లుగా మారారు. అంతేకాదు ‘లెర్న్ అండ్ ఎర్న్’ ప్రోగ్రామ్ ద్వారా అక్కడే నేర్చుకుని సంపాదించుకునేలా చేస్తోందీ తన అకాడమి. ఇక్కడి నుంచి వెళ్లిన వారు కష్టపడి చదివి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలనీ సంపాదించారు. నెలనెలా వారి జీతంతో సగభాగం సంస్థ కార్యకలాపాలకు ఆర్థిక సహాయం చేస్తుంటారని పీటర్ చెబుతుంటాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
ఎప్పుడూ కూల్గా కనిపించే ఎంఎస్ ధోనీ (MS Dhoni) గురించి ఎవరికీ తెలియని ఓ విషయాన్ని సురేశ్ రైనా ఇటీవల బయటపెట్టాడు. -
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే ఆలోచన లేదని వెస్టిండీస్ మాజీ ఆటగాడు సునీల్ నరైన్ (Sunil Narine) అన్నాడు. -
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ గురించి భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. -
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు