ఆదిలోనే టీమ్‌ఇండియాకు షాక్‌

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్‌ఇండియా ఆదిలోనే వికెట్‌ కోల్పోయింది. మిచెల్‌ స్టార్క్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ చివరి బంతికి మయాంక్‌ అగర్వాల్‌...

Updated : 26 Dec 2020 12:25 IST

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా ఆదిలోనే వికెట్‌ కోల్పోయింది. మిచెల్‌ స్టార్క్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ చివరి బంతికి మయాంక్‌ అగర్వాల్‌(0) ఔటయ్యాడు. అతడు ఎల్బీడబ్ల్యూగా వెనుతిరగడంతో భారత్‌ పరుగుల ఖాతా తెరవకముందే తొలి వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్‌ గిల్‌, ఛెతేశ్వర్‌ పుజారా ఉన్నారు. వీరిద్దరూ 8 ఓవర్లకు 28 పరుగులు చేశారు. అంతకుముందు బుమ్రా 4/56, అశ్విన్‌ 3/35, సిరాజ్‌ 2/40 చెలరేగడంతో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకు ఆలౌటైంది. మార్నస్‌ లబుషేన్‌(48) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ఇవీ చదవండి..
కాంస్యమే.. కొండంత బలాన్నిచ్చింది
స్టీవ్‌స్మిత్‌ ఇలా ఔటవ్వడం ఇదే తొలిసారి

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని