అభిమానం అంటే ఇదే కదా..!
నేను ధోనీ అభిమానిని.. అని చెప్పుకోవడం కంటే.. ఫలానా వ్యక్తి నా ఫ్యాన్ అని ధోనీ చెప్పుకొంటే ఎలా ఉంటుంది..? అదే కదా అసలైన అభిమానం అంటే. అదే దిశగా అడుగులేస్తున్నాడు తంగరాజ్...
ఆదర్శంగా నిలుస్తున్న ధోనీ సూపర్ ఫ్యాన్
(Photo: twitter)
అభిమానం ఎవరికైనా ఉంటుంది. దానిని చాటుకోవడంలోనే ప్రత్యేకతలుంటాయి. అన్నింటికంటే సులువైన పని.. సోషల్ మీడియాలో ఒక ఫ్యాన్ క్లబ్ను ఏర్పాటు చేయడం. వాళ్లపై పొగడ్తల వర్షం కురిపించడం. అందరి నోటా ఫలానా ఆటగాడు గొప్ప అనేలా చేయడం. కానీ, అందుకు భిన్నంగా చేశాడో అభిమాని. ప్రజలకు సేవ చేసేందుకు, తన అభిమాన క్రికెటర్కు మంచి పేరు తెచ్చేందుకు కృషి చేశాడు. నేను ఫలానా ఆటగాడి అభిమానిని.. అని చెప్పుకోవడం కంటే.. ఫలానా వ్యక్తి నా ఫ్యాన్ అని ఆటగాడే చెప్పుకొంటే ఎలా ఉంటుంది..? అదే కదా అసలైన అభిమానం అంటే. ఇంతకీ ఎవరా అభిమాని.. ఏం చేశాడు..? అనుకుంటున్నారా..? అయితే మీరు ధోనీ వీరాభిమాని తంగరాజ్ గురించి తెలుసుకోవాల్సిందే..!
సిక్సర్ నుంచి పుట్టిందీ ఫ్యాన్ క్లబ్..
అది తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన నెయ్కరపట్టి గ్రామం. దసరా, దీపావళి జరుపుకొన్నట్లే అక్కడి ప్రజలు జూలై 7న ఒక పండుగ జరుపుకొంటారు. అది మహేంద్రసింగ్ ధోనీ జన్మదినం. ఆ రోజు ఆ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. అందరూ సంతోషంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలు చేపడతారు. దీనంతటికీ కారణం 2011 ప్రపంచకప్లో ధోనీ కొట్టిన సిక్సర్.. దాని వల్ల ప్రభావితుడైన తంగరాజ్.
దినసరి కూలీలే సమాజ సేవకులై..
2011లో ధోనీసేన ప్రపంచకప్ గెలిచింది. అదే సమయంలో నెయ్కరపట్టి గ్రామంలో ‘తాలామయి ధోనీ రసిఘర్ మంద్రమ్’ పేరుతో ధోనీ ఫ్యాన్స్ క్లబ్ ఆవిర్భవించింది. పేదలకు ఆహారం, నిత్యావసరాలు అందించడంతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఈ క్లబ్ పని. రక్తదాన శిబిరాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ క్లబ్లో ఇప్పుడు దాదాపు 60మందికి పైగా సభ్యులు ఉన్నారు. దాని సేవలు గ్రామం దాటి జిల్లా వ్యాప్తమయ్యాయి. దీన్ని ప్రారంభించిన తంగరాజ్ ఓ చిరు వ్యాపారి. క్లబ్లో చాలా మంది దినసరి కూలీలే కావడం గమనార్హం. వచ్చిన దాంట్లోనే కొంత సేవాకార్యక్రమాలకు కేటాయిస్తున్నారు. ఇతరుల్లో స్ఫూర్తి నింపుతున్నారు. ఏడాదికి దాదాపు రూ.1లక్ష వరకు ఖర్చు చేసి సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
(Photo: twitter)
తండ్రి ఆశయాన్ని నెరవేరుస్తూనే..
నువ్వేం చేసినా.. దానివల్ల ఇతరులకు మంచి జరగాలి’ అని వాళ్ల నాన్న చెప్పిన మాటకు కట్టుబడి ఉన్న తంగరాజ్ ఈ మార్గం ఎంచుకున్నాడు. ప్రజలకు సేవ చేయాలని తన తండ్రి ఎల్లప్పుడూ ప్రోత్సహించేవారని అంటున్నాడీ తంగరాజ్. ‘2008 నుంచి ధోనీని నేను అభిమానిస్తున్నాను. 2009లో చెన్నై జట్టు ట్రోఫీ గెలవలేకపోయింది. 2010లో గెలిచింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ధోనీ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నా. 2011లో ధోనీసేన ప్రపంచకప్ కూడా గెలిచింది. ఆ ఏడాది మాకు నిజంగా ఎంతో ప్రత్యేకం. అప్పటి నుంచి క్లబ్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం’ అని తంగరాజ్ చెప్పుకొచ్చాడు.
(Photo: twitter)
అది వెలకట్టలేని అనుభూతి
‘‘నాకు ఒకసారి ధోనీని కలిసే అవకాశం వచ్చింది. అది వెలకట్టలేని అనుభూతి. 2017లో తమిళనాడు ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవానికి ధోనీ వచ్చారు. ఆయన పాదాలపై పడి ఆశీర్వాదం తీసుకున్నాను. అప్పుడు ధోనీ.. తమిళంలో 'వెనం పా' (వద్దు) అని చెప్పి నన్ను పైకి లేపాడు’’ అని తన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ధోనీ ఫ్యాన్ క్లబ్లో సభ్యుడిగా ఉన్నందుకు ఎంతో గర్విస్తున్నాను.. అని తంగరాజ్ అంటున్నాడు. చెన్నై జట్టు యాజమాన్యం సైతం పలుమార్లు ఈ ఫ్యాన్ క్లబ్ గురించి ట్విటర్ వేదికగా పోస్టులు చేసింది.
మావాడు గొప్పంటే.. మావాడు గొప్ప అని శత్రుత్వం పెంచుకొని గొడవలకు దిగే అభిమానులకు ఇది స్పూర్తిపాఠమే కదా..!
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో సన్రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్కు మారు పేరు! సన్రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్రేట్లో ఎప్పుడూ వెనుకంజే! సన్రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. -
స్టిమాక్ను తప్పించాల్సిందే
ఫుట్బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో చిన్న జట్టు అఫ్గానిస్థాన్ చేతిలో భారత్ అనూహ్య ఓటమితో కోచ్ స్టిమాక్ను తప్పించాలని మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదు అయ్యాయి.