వీళ్లంతా.. బంతిని కేకలు పెట్టించారు
టీ20 క్రికెట్లో బ్యాట్స్మెన్ అర్ధశతకం చేస్తేనే ఎక్కువ. ఎందుకంటే.. బ్యాట్స్మెన్కు క్రీజులో కుదురుకొని పిచ్ను అర్థం చేసుకునేంత సమయం ఉండదు. శతకానికి కావాల్సినన్ని బంతులు అంతకన్నా ఉండవు. పైగా బౌలర్ల నుంచి రకరకాలుగా దూసుకొచ్చే బంతులు. యార్కర్లు.. స్లో డెలివరీలు.. ఆఫ్ కట్టర్లు.. గూగ్లీలు..
ఒకే సీజన్లో ఒకటి కంటే ఎక్కువ శతకాలు
టీ20 క్రికెట్లో బ్యాట్స్మెన్ అర్ధశతకం చేస్తేనే ఎక్కువ. ఎందుకంటే.. క్రీజులో కుదురుకొని పిచ్ను అర్థం చేసుకునేంత సమయం ఉండదు. శతకానికి కావాల్సినన్ని బంతులు అంతకన్నా ఉండవు. పైగా బౌలర్ల నుంచి వైవిధ్యభరితంగా దూసుకొచ్చే బంతులు. యార్కర్లు.. స్లో డెలివరీలు.. ఆఫ్ కట్టర్లు.. గూగ్లీలు.. పేరేదైనా బ్యాట్స్మెన్ను ఔట్ చేయడమే వాటి లక్ష్యం. అయితే.. వాటన్నింటినీ ఎదుర్కొంటూ వచ్చీరావడంతోనే బాదుడు మొదలుపెట్టడమే సెంచరీ కొట్టేయడానికి ఉన్న ఏకైక మార్గం. మరి అలాంటి విలువైన సెంచరీని సీజన్కు ఒకటి కంటే ఎక్కువ చేసిన ఆటగాళ్లున్నారు. వాళ్లెవరో చూసేద్దాం..
‘2016’ విరాట్ స్పెషల్
టీ20 లీగ్ చరిత్రలో 2016 సీజన్ అనగానే విరాట్ కోహ్లీ విధ్వంసమే గుర్తొస్తుంది. ఆ సీజన్లో అంతలా సాగింది కోహ్లీ ఊచకోత. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సెంచరీలు బాదేశాడీ రన్ మెషీన్. మళ్లీ ఆ రికార్డు వైపు కన్నెత్తి చూసిన ఆటగాళ్లెవరూ లేరు. గుజరాత్ మీద కోహ్లీ తొలి సెంచరీ 100(63 బంతుల్లో) నమోదు చేశాడు. తర్వాత పుణే మీద 108(58బంతుల్లో, 8ఫోర్లు, 7సిక్సర్లు), తర్వాత మళ్లీ గుజరాత్ మీదే 109(55బంతుల్లో) పరుగుల వరద పారించాడు. పంజాబ్ మీద చేసిన సెంచరీ అన్నింటి కంటే ప్రత్యేకమైంది. చేతికి గాయమై 8 కుట్లు పడినా కోహ్లీ విజృంభన ఆగలేదు. గాయంతోనే బ్యాటింగ్ చేసిన కోహ్లీ 113 (50బంతుల్లో) వీరవిహారం చేశాడు. ఒకే సీజన్లో నాలుగు సెంచరీలు బాదిన ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కోహ్లీ పేరిట మొత్తం 5 సెంచరీలు ఉన్నాయి. వాటిలో నాలుగు ఈ ఒక్క సీజన్లో చేసినవే కావడం విశేషం.
ఎవర్గ్రీన్ యూనివర్స్ బాస్
లీగ్ చరిత్రలో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాడు క్రిస్ గేల్. అందులో బెంగళూరు తరఫున రెండు శతకాలున్నాయి. 2011 ఏప్రిల్ 22న కోల్కతాతో జరిగిన మ్యాచ్లో గేల్ 102(55బంతుల్లో) పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఆ తర్వత మే 5న పంజాబ్పై 107(49బంతుల్లో) మరోసారి శతకంతో చెలరేగాడు. ఆ తర్వాత 2012లో దిల్లీపై, 2013లో పుణేపై, 2015లో పంజాబ్పై, 2018లో హైదరాబాద్పై శతకాలు బాదేశాడు. 2015లో పుణేపై 175*(66బంతుల్లో 13ఫోర్లు, 17 సిక్సర్లు) పరుగులు చేసి లీగ్ చరిత్రలోనే కల్లోలం సృష్టించాడు. అన్ని సీజన్లు కలిపి అందరికంటే ఎక్కువ సెంచరీలు బాది ఎవర్గ్రీన్గా కొనసాగుతున్నాడు.
ఆమ్లా ఖాతాలో రెండు..
టెస్టు బ్యాట్స్మన్గా పేరున్న దక్షిణాఫ్రికా ఆటగాడు హషీం ఆమ్లా సైతం రెండు టీ20 శతకాలు నమోదు చేశాడు. పంజాబ్కు ప్రాతినిధ్యం వహించిన ఆమ్లా 2017 ఏప్రిల్ 20న ముంబయిపై 104(60బంతులు), అదే ఏడాది మే 7న గుజరాత్పై 104*(60) రెండో సెంచరీ బాదాడు. అయితే.. ఆ రెండు సెంచరీల తర్వాత మరోసారి ఆ ఫీట్ను అందుకోలేకపోయాడు.
వాట్సన్ సెంచరీ.. చెన్నై ఛాంపియన్
ప్రస్తుతం చెన్నైకి ఆడుతున్న షేన్ వాట్సన్ కూడా మొత్తం నాలుగు సెంచరీలు చేశాడు. రాజస్థాన్ తరఫున రెండు, చెన్నై తరఫున రెండు ఉన్నాయి. 2018 ఏప్రిల్ 20న చెన్నై తరపున ఆడి రాజస్థాన్పైనే శతకం 106(57బంతుల్లో) బాదాడు. ఆ తర్వాత హైదరాబాద్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 117*(57బంతుల్లో) వీరవిహారం చేశాడు. దీంతో చెన్నై మరోసారి ఛాంపియన్గా నిలిచింది. 2013లో చెన్నైతో జరిగిన మ్యాచ్లో వాట్సన్ 101 కొట్టాడు. తర్వాతి మ్యాచ్లో హైదరాబాద్పై 98* పరుగులు చేసి సెంచరీకి కొద్ది దూరంలో ఆగిపోయాడు.
ధావన్.. ధనాధన్..
శిఖర్ ధావన్ ఈ సీజన్లోనే తన తొలి టీ20 శతకం నమోదు చేశాడు. ఆ తర్వాతి మ్యాచ్లోనే మరో సెంచరీ బాదాడు. దీంతో వరుస మ్యాచుల్లో సెంచరీలు చేసిన ఏకైక ఏటగాడిగా రికార్డు సృష్టించారు. చెన్నైతో జరిగిన మ్యాచ్లో 101*(58) సెంచరీ చేసి దిల్లీని విజేతగా నిలబెట్టాడు. తాజాగా పంజాబ్తో జరిగిన మ్యాచ్లో మరోసారి 106 (61) శతకం బాది నాటౌట్గా నిలిచాడు. మరెవరూ ఒకే సీజన్లో రెండు వరస సెంచరీలు కొట్టలేదు. మంచి ఫామ్లో ఉన్న ధావన్ నుంచి మరో శతకం వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదేమో..!
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్