ఈ ఘటనంతా బాధకు గురిచేస్తోంది: జకోవిచ్
యూఎస్ ఓపెన్ 2020లో హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగిన సెర్బియన్ స్టార్ నోవాక్ జకోవిచ్ ఆదివారం నాలుగో రౌండ్ సందర్భంగా అర్ధాంతరంగా నిష్క్రమించాడు...
మనసారా క్షమాపణలు.. అనుకోకుండా జరిగింది..
ఇంటర్నెట్డెస్క్: యూఎస్ ఓపెన్ 2020లో హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగిన సెర్బియన్ స్టార్ నోవాక్ జకోవిచ్ ఆదివారం నాలుగో రౌండ్ సందర్భంగా అర్ధాంతరంగా నిష్క్రమించాడు. గతరాత్రి మ్యాచ్ ఆడేటప్పుడు అతడు అనుకోకుండా కొట్టిన ఓ బంతి లైన్ అంపైర్కు తగలడంతో ఆమె గొంతకు గాయమైంది. దీంతో నిబంధనల ప్రకారం జకోవిచ్ను ఈ మెగా టోర్నీ నుంచి తొలగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన టెన్నిస్ స్టార్ ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్టు పెట్టాడు. అందులో జకోవిచ్ ఎంతో భావోద్వేగం చెందాడు.
‘ఈ ఘటనంతా నన్ను బాధకు గురిచేస్తోంది. లైన్ అంపైర్ను పరిశీలించాను. అదృష్టంకొద్దీ ఆమె బాగానే ఉన్నారని నిర్వాహకులు తెలిపారు. ఇదంతా అనుకోకుండా జరిగింది. ఆమెకు ఇబ్బంది కలిగించినందుకు మనసారా క్షమాపణలు చెబుతున్నా. ఆమె వ్యక్తిగత సమాచారానికి భంగం కలగకూడదనే నేను పేరును వెల్లడించడంలేదు. ఇక నన్ను టోర్నీ నుంచి తీసేయడం బాధగా ఉంది. నేను చేసింది తప్పే. ఇంటికి వెళ్లి దీన్ని మర్చిపోవడానికి ప్రయత్నించాలి. అలాగే ఈ ఘటన నాకో గుణపాఠం లాంటిది. కెరీర్లో ఆటగాడిగా ఎదిగేందుకు, మనిషిగా జీవించేందుకూ తోడ్పడుతుంది. ఈ సందర్భంగా యూఎస్ ఓపెన్కూ క్షమాపణలు చెబుతున్నా. దీని వల్ల ఇబ్బందికి గురైన ప్రతీ ఒక్కర్నీ మన్నించమని కోరుతున్నా. ఇక ఇలాంటి సమయంలో నాకు అండగా నిలిచిన నా బృందం, కుటుంబం, ఎల్లవేళలా వెన్నంటే ఉండే అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటా. ధన్యవాదాలు’ అని జకోవిచ్ తన బాధను పంచుకున్నాడు.
అయితే, జకోవిచ్పై సామాజిక మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అతడు కోపంతోనే చేశాడని కొందరు అంటుండగా, మరికొందరు మాత్రం అనుకోకుండానే జరిగిందని పేర్కొంటున్నారు. అలాగే ఆ సమయంలో కోర్టులో ఏం జరిగిందనే వీడియోను కూడా పోస్టు చేస్తూ అతడికి అండగా నిలుస్తున్నారు. అనుకోకుండా అతడు ఓ బంతిని కొట్టడంతోనే అది నేరుగా వెళ్లి లైన్ అంపైర్కు తగిలినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటనతో నాలుగో సారి యూఎస్ ఓపెన్ టైటిల్ గెలవాలన్న అతడి కోరిక వృథా అయింది. ఇప్పటికే మూడు రౌండ్లు గెలిచిన అతడు ఇది గెలిస్తే క్వార్టర్ ఫైనల్స్కు చేరేవాడు. మరోవైపు ఈ గ్రాండ్స్లామ్ ఈవెంట్లో ఇతడికి తగ్గ ప్రత్యర్థులు లేకపోవడంతో టైటిల్ ఫేవరెట్గానూ నిలిచాడు. అలాంటి దిగ్గజం ఇలా నిష్క్రమించడంతో టెన్నిస్ అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!