‘ప్రియ’మైన ఆటలో ‘ఎత్తు’కు
ఏడేళ్లపుడు వేసవి శిక్షణ శిబిరంలో ప్రారంభమైన ఆమె ప్రయాణం.. అంతర్జాతీయ స్థాయిలో గొప్ప విజయాలతో సాగుతోంది. పదేళ్ల వయసులో ప్రపంచ ఛాంపియన్గా నిలిచి అందరి చూపు తనవైపు తిప్పుకున్న ఆమె...
చెస్లో రాణిస్తున్న ప్రియాంక
ఏడేళ్లపుడు వేసవి శిక్షణ శిబిరంలో ప్రారంభమైన ఆమె ప్రయాణం.. అంతర్జాతీయ స్థాయిలో గొప్ప విజయాలతో సాగుతోంది. పదేళ్ల వయసులో ప్రపంచ ఛాంపియన్గా నిలిచి అందరి చూపు తనవైపు తిప్పుకున్న ఆమె.. ఇప్పుడు ఆటలో ఎత్తులతో ప్రత్యర్థులను చిత్తుచేస్తూ.. తన వ్యూహాలతో నిలకడగా రాణిస్తూ.. పతకాల వేట కొనసాగిస్తోంది. ఆమే.. నూతక్కి ప్రియాంక. ఇటీవల ఫిడే ఆన్లైన్ ఆసియా కాంటినెంటల్ జూనియర్ ర్యాపిడ్ చెస్ టోర్నీలో కాంస్యం గెలిచిన ఈ విజయవాడ అమ్మాయి.. తాజాగా ప్రపంచ క్యాడెట్, యూత్ ఛాంపియన్షిప్లో క్వార్టర్స్ వరకూ వెళ్లింది.
ఈనాడు డిజిటల్, హైదరాబాద్
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చదరంగం పావులతో కుస్తీ పట్టడం మొదలెట్టిన ప్రియాంక.. ఆటలో ఉత్తమ ప్రదర్శనతో సాగుతోంది. ఏడేళ్లపుడు తల్లి ఆమెను వేసవి శిక్షణ శిబిరంలో చేర్పించడంతో తన చెస్ ప్రయాణం మొదలైంది. ఆ బోర్డు, పావులపై ఆసక్తి పెంచుకున్న తను ఆటపై పట్టు సాధించింది. అండర్-7 బాలికల విభాగంలో కృష్ణా జిల్లా ఛాంపియన్గా నిలవడంతో పాటు మరికొన్ని టోర్నీల్లో గెలవడంతో చెస్ తన కెరీర్గా మారింది. అండర్-9 జాతీయ ఛాంపియన్గా నిలిచింది. 2012లో అండర్-10 విభాగంలో.. ఆసియా యూత్ ఛాంపియన్షిప్తో పాటు ప్రపంచ యూత్ ఛాంపియన్షిప్లో టైటిల్ నెగ్గి సత్తాచాటింది. ఆ తర్వాత కూడా జాతీయ, ఆసియా ఛాంపియన్షిప్ల్లో జోరు కొనసాగించింది. మొత్తంగా ఆసియా ఛాంపియన్షిప్స్లో అయిదు వ్యక్తిగత స్వర్ణాలు నెగ్గింది. మూడు సార్లు జాతీయ ఛాంపియన్గా నిలిచింది. 2016లో యుఎస్ టోర్నీలో టైటిల్ గెలిచింది. ఆ తర్వాత రెండేళ్లు కొద్దిగా ఇబ్బంది పడ్డప్పటికీ ఈ ఏడాది ఆన్లైన్ చెస్ టోర్నీల్లో వరుసగా విజయాలు సాధిస్తోంది. సుసాన్ పోల్గార్ ఫౌండేషన్ ఆన్లైన్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచి.. నగదు బహుమతితో పాటు రూ.44 లక్షల విలువైన వెబ్స్టర్ విశ్వవిద్యాలయ (యుఎస్) ఉపకార వేతనాన్ని సొంతం చేసుకుంది. చెస్కే తన మొదటి ప్రాధాన్యమని, ఆ విశ్వవిద్యాలయంలో చేరే విషయంపై తర్వాత ఆలోచిస్తానని ఈ మహిళా ఇంటర్నేషనల్ మాస్టర్ (డబ్ల్యూఐఎమ్) పేర్కొంది. ప్రస్తుతం ఒక మహిళల గ్రాండ్మాస్టర్ (డబ్ల్యూజీఎమ్) నార్మ్ కలిగిన ఉన్న ఆమె.. మరో రెండు నార్మ్లు సాధిస్తే ఆ హోదా సొంతం చేసుకుంటుంది.
నిరాశ చెందా..: ఈ ఏడాది చివరి నాటికి మహిళల గ్రాండ్మాస్టర్గా నిలవాలనే లక్ష్యం పెట్టుకున్నానని, కానీ కరోనా విరామం తన ప్రణాళికలను దెబ్బతీసిందని ఆమె చెబుతోంది. ‘‘మంచి ఫామ్లో ఉన్నప్పుడు ఈ విరామం దెబ్బతీసింది. టోర్నీలు లేకపోవడంతో నిరాశ చెందా. అయితే మిగతా ఆటలతో పోలిస్తే చెస్ను ఆన్లైన్లోనూ ఆడొచ్చు కాబట్టి ఇబ్బంది అనిపించడం లేదు. అయితే బోర్డుపై ముఖాముఖి తలపడడమే బాగుంటుంది. ఆన్లైన్లో ఆడుతుంటే ప్రత్యర్థులు ఎలా స్పందిస్తునారో, ఎలా ఆలోచిస్తున్నారో తెలీదు. పైగా ఇంటర్నెట్ సమస్య భయపెడుతుంటుంది. ప్రస్తుతం ఆన్లైన్లోనే కోచ్ స్వయమ్ మిశ్రా దగ్గర శిక్షణ తీసుకుంటున్నా’’ అని 18 ఏళ్ల ప్రియాంక తెలిపింది.
ఇబ్బంది ఉన్నప్పటికీ..: గత రెండేళ్లలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ప్రియాంక చెప్పింది. ‘‘గత రెండేళ్లు బాగా కష్టపడ్డప్పటికీ ఫలితాలు రాకపోవడంతో బాధపడ్డా. కానీ ప్రయత్నం ఆపలేదు. ఒక డబ్ల్యూఐఎమ్ నార్మ్ వచ్చాక అన్ని అనుకూలంగా మారిపోయాయి. విజయాలు మొదలయ్యాయి. ఆర్థికంగానూ సమస్యలు ఉన్నప్పటికీ మా నాన్న రాధాకృష్ణ, అమ్మ దుర్గాదేవి నన్ను ప్రోత్సహిస్తూనే వస్తున్నారు. స్పాన్సర్ అంటూ ఎవరూ లేరు. సొంత ఖర్చులతోనే విదేశాల్లో టోర్నీలకు వెళ్లాల్సి వస్తోంది. నాన్న చిన్న వ్యాపారం చేస్తూ నన్ను నడిపిస్తున్నాడు. చెస్లో నాకు క్లాసికల్ విభాగం ఇష్టం. ప్రపంచ మహిళల చెస్లో అత్యుత్తమ క్రీడాకారిణిగా ఎదిగిన జుడిత్ పోల్గర్ను అభిమానిస్తా. ఆనంద్, హంపి అంటే ఎంతో గౌరవం. నా జీవిత లక్ష్యం గ్రాండ్ మాస్టర్ హోదా సాధించి మహిళల ప్రపంచ ఛాంపియన్ కావడం. అంతకంటే ముందు మహిళల గ్రాండ్మాస్టర్ అవ్వాలి’’ అని 2263 ఎలో రేటింగ్ పాయింట్లు కలిగి ఉన్న ప్రియాంక పేర్కొంది.
ఇవీ చదవండి..
స్టాండ్కు నా పేరు తీసేయండి
రాహుల్కు చోటు లేదా?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్లో న్యూజిలాండ్ క్రికెట్ ప్రసార హక్కులు ఎస్పీఎన్ఐ సొంతం
న్యూజిలాండ్ పురుషుల (బ్లాక్ క్యాప్స్), మహిళల (వైట్ ఫెర్న్స్) క్రికెట్ జట్ల మ్యాచ్లను వచ్చే ఏడేళ్ల పాటు భారత్, అనుబంధ ప్రాంతాల్లో ప్రసారం చేసేందుకు సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా (ఎస్పీఎన్ఐ) టెలివిజన్, డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు. -
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
దాదాపు రెండు నెలలపాటు క్రికెట్ అభిమానులను అలరించే ఐపీఎల్.. రికార్డులను ఖాతాలో వేసుకుంటోంది. -
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యను ముంబయి మేనేజ్మెంట్ కెప్టెన్గా నియమించుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఆ ఫ్రాంచైజీపై ట్రోలింగ్ వచ్చింది. ఇప్పుడు ముంబయి వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోవడంతో పాండ్య సారథ్యంపై విమర్శల దాడి ఎక్కువైంది. -
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
తన అభిమాన క్రికెటర్తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ఎప్పటికీ మరిచిపోలేనని చెన్నై ఆటగాడు సమీర్ రిజ్వీ వ్యాఖ్యానించాడు. -
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్కతా మాజీ ఆటగాడు
కోల్కతా ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిత్ వల్ల చాలామంది విదేశీ క్రికెటర్లు ఇబ్బందిపడ్డారని నమీబియా క్రికెటర్ వ్యాఖ్యానించడం సంచలనమైంది. -
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
ముంబయి బౌలర్లు భారీగా పరుగులు ఇవ్వడంతో హైదరాబాద్ రికార్డు స్కోరును నమోదు చేసి చరిత్ర సృష్టించింది. దీంతో ఐపీఎల్ 17వ సీజన్లో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. -
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్గా మారిన కావ్యా మారన్
కావ్యా మారన్.. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని. ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ భారీ స్కోరు సాధించడంతో ఆమె ఒక్కసారిగా నెట్టింట వైరల్గా మారారు. -
ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ బోణీ కొట్టింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబయిని చిత్తు చేసింది. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదు అయ్యాయి. -
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో సన్రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్కు మారు పేరు! సన్రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్రేట్లో ఎప్పుడూ వెనుకంజే! సన్రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్