ఐపీఎల్లో మెరిశారు..మరి ఆసీస్పై?
గాడి తప్పిన ఫామ్.. అంచనాలను అందుకోలేక వైఫల్యం.. వెరసి టీమ్ఇండియాలో స్థానం ప్రశ్నార్థకం. ఇదీ ఐపీఎల్-13కు ముందు కొంతమంది భారత క్రికెటర్ల పరిస్థితి...
ధావన్, మయాంక్, మనీశ్, సంజూ ఏం చేస్తారో చూడాలి!
గాడి తప్పిన ఫామ్.. అంచనాలను అందుకోలేక వైఫల్యం.. వెరసి టీమ్ఇండియాలో స్థానం ప్రశ్నార్థకం. ఇదీ ఐపీఎల్-13కు ముందు కొంతమంది భారత క్రికెటర్ల పరిస్థితి. మళ్లీ జాతీయ జట్టులోకి వస్తామా? అసలు అవకాశం దక్కుతుందా? అనే భయాలు ఓ వైపు.. ఐపీఎల్లో సత్తాచాటి తిరిగి టీమ్ఇండియా జెర్సీ ధరిద్దామనే ఆశ మరో వైపు.. ఇలా ఆ సీజన్లో బరిలో దిగిన ఆ ఆటగాళ్లు గొప్పగా రాణించారు. తమ ప్రదర్శనతో సెలక్టర్లను మెప్పించి ఆస్ట్రేలియా విమానమెక్కారు. కంగారూ గడ్డపై వీళ్లు ఎలాంటి ప్రదర్శన చేస్తారో తెలియాలంటే కొద్దికాలం ఆగాల్సిందే! మరి ఆ ఆటగాళ్లు ఎవరో చూసేద్దాం పదండి!
ధనాధన్ మళ్లీ..
రోహిత్ శర్మతో కలిసి పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమ్ఇండియా విజయాల్లో కీలకంగా మారిన ఓపెనర్ శిఖర్ ధావన్కు ఐపీఎల్కు ముందు నిలకడ లేమి సమస్యగా మారింది. గతేడాది వన్డే ప్రపంచకప్లో ఆస్ట్రేలియాతో మ్యాచ్లో గాయం కారణంగా మొత్తం టోర్నీ నుంచే తప్పుకున్న అతను.. తిరిగి వెస్టిండీస్ సిరీస్తో జట్టులోకి వచ్చినప్పటికీ రాణించలేకపోయాడు. ఓ వైపు గాయాలు.. మరోవైపు అతని స్థానంలో ఓపెనర్గా కేఎల్ రాహుల్ పాతుకుపోవడంతో ధావన్కు జట్టులో చోటే ప్రశ్నార్థకమైంది. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్లో అడుగుపెట్టిన అతను మునుపటిలా చెలరేగి.. వరుసగా రెండు శతకాలు చేసి లీగ్ చర్రితలో ఆ ఘనత అందుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు. మొత్తంగా దిల్లీ క్యాపిటల్స్ తరపున 17 మ్యాచ్ల్లో 618 పరుగులు చేసి అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ ప్రదర్శనతో ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్కు ఎంపికైన అతను.. కంగారూ గడ్డపై ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి.
కొత్త కోణం చూపించి..
గత ఆస్ట్రేలియా సిరీస్ (2018-19)లో ఓపెనర్ పృథ్వీ షా గాయంతో దూరమవడంతో టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న మయాంక్ అగర్వాల్.. ఆ తర్వాత నిలకడగా రాణిస్తూ సుదీర్ఘ ఫార్మాట్లో ఓపెనర్గా స్థిరపడ్డాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం అతనికి ఎక్కువ అవకాశాలు దక్కలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్లో రెండు వన్డేలు ఆడినప్పటికీ ప్రభావం చూపలేకపోయాడు. దీంతో అతను పుజారా లాగా కేవలం టెస్టులకే పరిమితమవుతాడా? అనే వ్యాఖ్యలు వినిపించాయి. కానీ ఐపీఎల్-13 తర్వాత అతని ఆటపై ఉన్న అభిప్రాయాలు మారిపోయాయి. ఈ సీజన్లో తొలి మ్యాచ్లోనే దిల్లీపై 60 బంతుల్లోనే 89 పరుగులు చేసి తనలోని విధ్వంసక కోణాన్ని బయటపెట్టాడు. అదే దూకుడు కొనసాగించిన అతను.. మధ్యలో గాయంతో అందుబాటులో లేనప్పటికీ.. మొత్తంగా 11 మ్యాచ్ల్లో 424 పరుగులతో సీజన్ను ముగించాడు. పంజాబ్ తరపున ఈ ధనాధన్ బ్యాటింగ్తోనే ఆస్ట్రేలియా పర్యటనకు అన్ని జట్లలోనూ చోటు దక్కించుకున్నాడు. అతను ఇదే జోరు కొనసాగిస్తే మూడు ఫార్మాట్లలోనూ కీలక ఆటగాడిగా ఎదిగే అవకాశముంది.
ఎప్పటి నుంచో ఆడుతున్నా..
అయిదేళ్ల క్రితమే పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత జట్టులో అరంగేట్రం చేసిన మనీశ్ పాండే కెరీర్ పడుతూ లేస్తూ సాగుతోంది. ప్రతిభావంతుడైన క్రికెటర్గా జట్టులో అడుగుపెట్టిన అతను అంచనాలను అందుకోవడంలో విఫలమవుతున్నాడు. ఓ మ్యాచ్లో రాణించి అబ్బురపరచడం.. మరో మ్యాచ్లో విఫలమై నిరాశపరచడం.. ఇలా అతని బ్యాటింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకూ 26 వన్డేల్లో 492 పరుగులు చేసిన అతను ఒక్క శతకం మాత్రమే నమోదు చేశాడు. మరోవైపు 38 టీ20ల్లో 707 పరుగులు చేశాడు. పొట్టి ఫార్మాట్లో అతని రికార్డు మెరుగ్గానే ఉన్నప్పటికీ.. జట్టులో పోటీ కోసం కుర్రాళ్లు పోటీపడుతున్న తరుణంలో మనీశ్ ఈ ఐపీఎల్లో కానీ రాణించకపోయి ఉంటే కచ్చితంగా టీమ్ఇండియాకు దూరమయ్యేవాడే. కానీ సన్రైజర్స్ తరపున 16 మ్యాచ్ల్లో 425 పరుగులు చేసి తనలో పరుగులు చేసే సామర్థ్యం ఉందని చాటిచెప్పి.. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికయ్యాడు.
ప్రతిభ ఉన్నా..
సంజూ శాంసన్ మంచి ప్రతిభావంతుడైన ఆటగాడు.. అతనికి తుది జట్టులో చోటు ఇవ్వాల్సిందేననే వ్యాఖ్యలు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. కానీ అతను అందివచ్చిన అవకాశాలను మాత్రం సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 2014 ఐపీఎల్లో అదిరే ప్రదర్శనతో 2015లోనే టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేసినప్పటికీ ఇప్పటివరకూ కేవలం నాలుగు టీ20లు మాత్రమే ఆడి 35 పరుగులు మాత్రమే చేశాడు. అతనిలో నైపుణ్యాలకు కొదవ లేనప్పటికీ టీమ్ఇండియాలో విపరీతమైన పోటీ, ఆడిన మ్యాచ్ల్లో విఫలమవడం అతణ్ని వెనక్కునెట్టింది. ఈ నేపథ్యంలో.. ధోని రిటైర్మెంట్తో పరిమిత ఓవర్ల క్రికెట్లో వికెట్ కీపింగ్ స్థానాన్ని దక్కించుకోవాలనే పట్టుదలతో ఈ ఐపీఎల్ సీజన్లో అడుగుపెట్టిన అతను తొలి మ్యాచ్ నుంచే బాదుడు మొదలెట్టాడు. 14 మ్యాచ్ల్లో 375 పరుగులు చేసిన ఈ రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు.. పరిమిత ఓవర్ల జట్లకు ఎంపికై ఆస్ట్రేలియాలో అడుగుపెట్టాడు. మరోవైపు 21 ఏళ్ల శుభ్మన్ గిల్ కూడా ఈ కోవలోకే వస్తాడు. అండర్-19 ప్రపంచకప్, ఆ తర్వాత దేశవాళీ టోర్నీల్లో ప్రదర్శనతో టీమ్ఇండియా భవిష్యత్ ఆశాకిరణంలా కనిపించిన అతను.. నిరుడు న్యూజిలాండ్తో రెండు వన్డేల్లో అవకాశం వచ్చినప్పటికీ సద్వినియోగం చేసుకోలేదు. కానీ ఈ ఐపీఎల్లో కోల్కతా తరపున పరిణతితో కూడిన ఆటతీరును ప్రదర్శించి ఆకట్టుకున్నాడు. 14 మ్యాచ్ల్లో 440 పరుగులు చేసి మరోసారి టీమ్ఇండియా తలుపు తట్టాడు. వన్డే, టెస్టు జట్లలో చోటు దక్కించుకున్నాడు. మరి ఈసారి అతనెలా రాణిస్తాడో చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ