భారత్,పాక్.. రెండుజట్లకూ ఆడిన క్రికెటర్లు వీరే
ఏ క్రీడాకారులైనా దేశం తరఫున ఆడాలని కలలుకంటారు. అందుకోసం ఎంతో శ్రమిస్తారు. ఏళ్లకు ఏళ్లు కష్టపడతారు. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా రాణిస్తారు...
ఏ క్రీడాకారులైనా దేశం తరఫున ఆడాలని కలలు కంటారు. అందుకోసం ఎంతో శ్రమిస్తారు. ఏళ్లకు ఏళ్లు కష్టపడతారు. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా రాణిస్తారు. చివరికి అనుకున్నది సాధించి లక్ష్యాన్ని చేరుకుంటారు. తమ రంగాల్లో అత్యున్నత స్థాయిలో రాణించి దేశానికి కీర్తిప్రతిష్ఠలు తెస్తుంటారు. అలా ఏ ఆటగాడైనా ఒక దేశం తరఫున ఆడటమే గొప్ప విశేషం. అలాంటిది రెండు దేశాలకు ఆడటమంటే మాటలా?అది కూడా భారత్ - పాకిస్థాన్ లాంటి దాయాది దేశాలకు. అందులోనూ క్రికెట్ రంగంలో. నేటి తరానికైతే అది కలలో కూడా ఊహించుకోవడానికి సాధ్యం కాదు. కానీ ముగ్గురు ఆటగాళ్లున్నారు. వారు అటు పాకిస్థాన్కు ఇటు భారత జట్టుకు క్రికెట్ ఆడి తమ పేర్లను చరిత్రలో లిఖించుకున్నారు.
అబ్దుల్ హఫీజ్ కర్దార్:
పంజాబ్లోని లాహోర్లో పుట్టిన అబ్దుల్ హఫీజ్ పాకిస్థాన్ జట్టుకు తొలి కెప్టెన్గా నియమితుడయ్యాడు. దాంతో పాక్ క్రికెట్ పితామహుడిగా పేరుగాంచాడు. అంతకుముందు ఉత్తర భారత ముస్లిమ్స్ జట్టుకు కూడా ప్రాతినిథ్యం వహించాడు. ఈ క్రమంలోనే స్వాతంత్ర్యం రాకముందు టీమ్ఇండియా తరఫున ఇంగ్లాండ్పై అరంగేట్రం చేశాడు. దేశ విభజన తర్వాత పాకిస్థాన్కు వలస వెళ్లి తర్వాత ఆ జట్టుకు కెప్టెన్గా ఎంపికయ్యాడు. అలా 1952-53 సీజన్లో పాకిస్థాన్ అతడి సారథ్యంలోనే తొలిసారి అధికారిక భారత పర్యటనకు వచ్చింది. అప్పుడు లాలా అమర్నాథ్ నేతృత్వంలోని టీమ్ఇండియా మూడు టెస్టుల సిరీస్ ఆడగా 2-1తేడాతో పాక్పై విజయం సాధించింది.
ఆమిర్ ఇలాహి:
ఆమిర్ కూడా లాహోర్లోనే జన్మించాడు. 1947లో టీమ్ఇండియా తరఫున ఆడిన అతడు ఆస్ట్రేలియాపై అరంగేట్రం చేశాడు. అంతకుముందు రంజీ క్రికెట్లో బరోడా తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 1946-47 కాలంలో ఆ జట్టు విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక దేశ విభజన సమయంలో పాకిస్థాన్కు వలస వెళ్లిన అతడు తర్వాత ఆ జట్టులో కొనసాగాడు. అలా 1952 వరకు దాయాది జట్టులో ఆడిన ఆమిర్ టీమ్ఇండియాతోనే చివరి మ్యాచ్ ఆడడం గమనార్హం. చివరి మ్యాచ్లో ఒకే వికెట్ తీసి 29 పరుగులిచ్చాడు.
గుల్ మహ్మద్:
గుల్ సైతం లాహోర్లోనే పుట్టి పెరిగాడు. ఎత్తు తక్కువగా ఉన్నా తనదైన బ్యాటింగ్తో అదరగొట్టేవాడు. 17 ఏళ్ల ప్రాయంలోనే ఫస్ట్క్లాస్ క్రికెట్లో అద్భుతంగా రాణించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 1942-43 కాలంలో దేశవాళి క్రికెట్లో భారత క్రికెటర్ విజయ్ హజారేతో కలిసి రికార్డు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అలాగే 1946-47 రంజీ ట్రోఫీ ఫైనల్లోనూ బరోడా తరఫున 319 పరుగులు సాధించాడు. అదే సీజన్లో టీమ్ఇండియాకు ఎంపికైన అతడు ఇంగ్లాండ్పై అరంగేట్రం చేశాడు. తర్వాత 1952-53 పాకిస్థాన్ భారత పర్యటనలో లాలా అమర్నాథ్ సారథ్యంలోని టీమ్ఇండియాలో ఆడాడు. 1955లో దాయాది దేశానికి మకాం మార్చి 1956-57లో ఆ జట్టు తరఫున ఆడాడు. అలా పాకిస్థాన్కు ప్రాతినిధ్యం వహించి ఆస్ట్రేలియాపై ఆడాడు.
-ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
వీరుడొచ్చాడు.. సన్రైజర్స్కు దొరికిన మరో వార్నర్
సన్రైజర్స్ హైదరాబాద్ అంటే ఒకప్పుడు డేవిడ్ వార్నర్ (David Warner) మెరుపులే గుర్తుకొచ్చేవి. వార్నర్ వెళ్లిపోయిన తర్వాత ఆ లోటు కనిపించింది. ఓపెనింగ్లో ఓ ఖాళీ. రెండు సీజన్ల పాటు ఆ వెలితి అలాగే ఉంది. కానీ ఇప్పుడొక వీరుడొచ్చాడు. అతనే.. ట్రావిస్ హెడ్ (Travis Head). -
పరుగులివ్వడు.. వికెట్లు వదలడు... బెంబేలెత్తిస్తున్న బుమ్రా
ఐపీఎల్లో అదరగొడుతున్న బౌలర్ల జాబితా రాస్తే తొలి స్థానంలో కనిపించే పేరు జస్ప్రీత్ బుమ్రా. అతని బౌలింగ్లో ఆడటానికి బ్యాటర్లు బాగా ఇబ్బందిపడుతున్నారు. -
వీళ్లు ఆడితే మామూలుగా ఉండదు!
ఐపీఎల్.. ఈ టోర్నీ పేరు చెప్పగానే వెస్టిండీస్ ఆటగాళ్లే గుర్తొస్తారు. గత 16 ఏళ్లుగా కరీబియన్ ఆటగాళ్ల విన్యాసాలే అభిమానుల మనసుల్లో మెదులుతాయి. ఎందుకంటే తమ ఆటతోనే కాదు తమ హవభావాలతో మైదానంలో, మైదానం బయట ఈ విండీస్ వీరుల సందడి అంతాఇంతా కాదు. -
‘ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్’.. సత్తా చాటేందుకు విదేశీ సంచలనాల తహతహ
ఐపీఎల్లో తమ సత్తా నిరూపించుకోవడానికి ఆటగాళ్లు ఎదురు చూస్తుంటారు. ఫామ్ను అందుకోవడంతోపాటు ఫ్రాంచైజీ దృష్టిలో పడాలనేది కొందరి ఆశ. -
నితీశ్ రెడ్డి.. భారత్ క్రికెట్కు మరో పేస్ ఆల్రౌండర్ లభించినట్లేనా?
హైదరాబాద్ తరఫున మరో ఆణిముత్యం వంటి ఆటగాడు వెలుగులోకి వచ్చాడు. అదీనూ తెలుగు కుర్రాడు కావడం ఇక్కడ విశేషం. జట్టును గెలిపించే ప్రదర్శన చేయడం అభిమానులను ఆకట్టుకుంది. -
ఫామ్తో తంటాలా.. ఆర్సీబీ ఉందిగా!
ఈ ఐపీఎల్ సీజన్లో బెంగళూరుపై ఫామ్లో లేని ఆటగాళ్లు కూడా చెలరేగుతున్నారు. అంతేకాదు వారే మ్యాచ్ విన్నర్లుగా అవతరిస్తున్నారు. -
అప్పుడు వేస్ట్.. ఇప్పుడు బెస్ట్... ‘విఫల’ ముద్ర తొలగించుకున్న బ్యాటర్లు
ఐపీఎల్లో ఇప్పటివరకు సరిగ్గా ఆడని కొంతమంది ప్లేయర్లు ఈ సీజన్ ఐపీఎల్లో అదరగొట్టేస్తున్నారు. వాళ్లెవరు, వాళ్ల సంగతేంటో చూద్దాం! -
యశ్ ఠాకూర్.. ధోనీలా మారదామని వచ్చి.. పేసర్గా అదరగొట్టి!
లఖ్నవూ పేస్ బౌలర్లు పెను సంచలనంగా మారారు. ఇదివరకు మయాంక్ యాదవ్ తన ఫాస్ట్తో బెంబేలెత్తించగా.. తాజాగా యశ్ ఠాకూర్ అదరగొట్టాడు. -
వద్దనుకున్నవాడే వరమయ్యాడు.. ఎవరీ శశాంక్ సింగ్..?
తన అద్భుత బ్యాటింగ్తో గుజరాత్పై పంజాబ్కు విజయం అందించిన శశాంక్ సింగ్పై ఇప్పుడు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. -
ఓరి‘నరైనో’.. బ్యాటుతో రెచ్చిపోతున్న విండీస్ స్పిన్నర్
ప్రత్యర్థి సొంత మైదానాల్లో దూకుడుగా ఆడుతూ పరుగులు రాబట్టడం అతడి ప్రత్యేకత. గత సీజన్లో పెద్దగా ప్రభావం చూపని ఈ కోల్కతా ఆటగాడు మళ్లీ బ్యాట్తో అదరగొట్టేస్తున్నాడు. -
వింటేజ్ ధోనీ... కీపింగ్ మెరుపులు ఓవైపు... భారీ సిక్సర్లు మరోవైపు!
తొలి రెండు మ్యాచుల్లో బ్యాటింగ్కి రాని ధోనీ... మూడో మ్యాచులో బరిలోకి దిగి భారీ సిక్సర్లు బాదాడు. దీంతో ఇప్పుడు అంతా అతని మేనియానే కనిపిస్తోంది. -
పంత్.. ఇదే కావాలయ్యా...రిషబ్ ఇక రెచ్చిపో!
రిషభ్ పంత్ జట్టులో ఉంటే అదో ధైర్యం. మనది కాదనుకున్న మ్యాచ్ను అమాంతం మనవైపు తిప్పేస్తుంటాడు. యాక్సిడెంట్ తర్వాత రీఎంట్రీలో చెన్నై మీద అదరగొట్టాడు. -
రేటెక్కువ.. ఆట తక్కువ... ఐపీఎల్లో ఎప్పుడూ ఇదే కథ!
భారీ ధరపెట్టి జట్టులోకి తీసుకున్న స్టార్ ప్లేయర్లు ఐపీఎల్లో నిరాశపరుస్తుంటారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. -
కొత్త పేస్ స్టార్.. గాయాలు ఇబ్బంది పెట్టినా బెదరని మయాంక్ యాదవ్
ఐపీఎల్ ప్లాట్ఫామ్ ద్వారా మరో ఆణిముత్యం వెలుగులోకి వచ్చింది. కొత్త స్టార్ పేసర్పై భారత సెలక్టర్లు దృష్టి పెట్టే అవకాశం లేకపోలేదు.. -
సిరాజ్ మియా.. ఎక్కడ బౌలింగ్ మాయ..? తేలిపోతున్న బెంగళూరు పేస్ ఎటాక్!
భారత స్టార్ పేసర్గా మారిన సిరాజ్ (Siraj) తన మాయాజాలాన్ని ప్రదర్శించలేకపోతున్నాడు. ప్రత్యర్థి బ్యాటర్లు అతడి బౌలింగ్ను తేలిగ్గా ఆడేస్తున్నారు. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
30 ఏళ్ల క్రితం సచిన్ ఆట మొదలైంది ఈ రోజే..!
సరిగ్గా ఇదే రోజు.. 30 ఏళ్ల క్రితం (మార్చి 27, 1994) మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ కెరీర్ మలుపు తిరిగింది. -
ఫినిషర్ మళ్లీ వచ్చాడు.. ఈసారి బెంగళూరును గెలిపించాడు..
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా పంజాబ్తో జరిగిన మ్యాచ్లో దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) ఫినిషింగ్ టచ్ ఇచ్చి బెంగళూరును గెలిపించాడు. -
Bengaluru Vs Punjab: సొంత మైదానంలో విజయం.. ఆనవాయితీని బెంగళూరు కొనసాగించేనా?
ఐపీఎల్లో బెంగళూరు రెండో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా పంజాబ్తో తలపడనుంది. -
Mumbai Indians: వరుసగా 12వ సారి.. ముంబయి తొలి మ్యాచ్ల చరిత్ర ఎలా ఉందంటే..?
ఈ సీజన్లో ముంబయి ఇండియన్స్ ఆడిన తొలి మ్యాచ్లో గుజరాత్పై ఓటమిపాలైంది. ఇలా ఓటమితో సీజన్ను ప్రారంభించడం ఆ జట్టుకు కొత్తేమీ కాదు.