రహానె శతకం.. భారత్ ఆధిపత్యం
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. తొలిరోజు ఆస్ట్రేలియాను 195కే పరిమితం చేసిన టీమ్ఇండియా రెండో రోజు బ్యాటింగ్లోనూ మంచి ప్రదర్శనే చేసింది...
తొలి ఇన్నింగ్స్లో 82 పరుగుల ఆధిక్యం
తోడుగా నిలిచిన రవీంద్ర జడేజా
మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. తొలిరోజు ఆస్ట్రేలియాను 195 పరుగులకే పరిమితం చేసిన టీమ్ఇండియా రెండో రోజు బ్యాటింగ్లోనూ మంచి ప్రదర్శన చేసింది. కెప్టెన్ అజింక్య రహానె(104; 200 బంతుల్లో 12x4) అజేయ శతకానికి తోడు రవీంద్ర జడేజా(40నాటౌట్; 104 బంతుల్లో 1x4) నిలకడగా రాణించడంతో భారత్ ప్రస్తుతం 82 పరుగుల ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఆదివారం ఆట పూర్తయ్యే సమయానికి 91.3 ఓవర్లలో 277/5 పరుగులు సాధించింది. సోమవారం వీరిద్దరూ ఏ మేరకు రాణిస్తారో వేచిచూడాలి. ఇక మూడో రోజు కూడా రహానె, జడేజా ఇలాగే ఆడితే ఆసీస్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించే అవకాశం ఉంది.
నిరాశపర్చిన పుజారా..
ఓవర్నైట్ స్కోర్ 36/1తో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమ్ఇండియా మరో 29 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న శుభ్మన్గిల్ (45), పుజారా(17)ను కమిన్స్ వరుస ఓవర్లలో పెవిలియన్ పంపాడు. దీంతో భారత్ 64 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రహానె, హనుమ విహారి(21) బాధ్యతగా ఆడి మరో వికెట్ పడకుండా తొలి సెషన్ను పూర్తి చేశారు. అప్పటికి టీమ్ఇండియా స్కోర్ 90/3గా నమోదైంది.
కుదురుకున్నారు అనుకునేలోపే..
భోజన విరామం తర్వాత కూడా నిలకడగా ఆడిన విహారి.. లైయన్ బౌలింగ్లో ఓ అనవసరపు షాట్కు ఔటయ్యాడు. దీంతో భారత్ 116 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ రిషభ్ పంత్(29) చక్కటి షాట్లతో అలరించాడు. రహానెతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే ఐదో వికెట్కు 57 పరుగులు జోడించాడు. అయితే, పంత్ కూడా కుదురుకున్నట్లే కనిపించగా స్టార్క్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. అతడు ఆడిన షాట్ను వికెట్ల వెనుక కీపర్ టిమ్పైన్ అద్భుత డైవ్తో అందుకోవడంతో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. అనంతరం రవీంద్ర జడేజా బరిలోకి దిగిన కాసేపటికే వర్షం కురవడంతో రెండో సెషన్ను ముందుగానే ముగించారు. టీ విరామ సమయానికి భారత్ 189/5తో నిలిచింది.
జడేజా తోడుతో రహానె శతకం..
ఇక చివరి సెషన్లో రహానె, జడేజా పూర్తి ఆధిపత్యం చెలాయించారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదిన రహానె ఆకట్టుకునే ఇన్నింగ్స్ ఆడాడు. చూడచక్కని షాట్లతో ఆసీస్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. మరోవైపు జడేజా సైతం అతడికి సహకరించాడు. జడ్డూ షాట్లు ఆడకుండా సింగిల్స్, డబుల్స్పైనే శ్రద్ధ పెట్టాడు. ఈ నేపథ్యంలోనే వారిద్దరూ ఆట నిలిచే సరికి 104 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. ఆదివారం ఆట ముగుస్తుందనే చివరి క్షణాల్లో రహానె టెస్టుల్లో 12వ శతకం పూర్తి చేసుకున్నాడు. అప్పుడే వర్షం కురవడంతో రెండో రోజు ఆట కాస్త ముందుగా నిలిచిపోయింది. మరోవైపు ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్(2), కమిన్స్(2) వికెట్లు పడగొట్టగా, లైయన్ ఒక వికెట్ తీశాడు.
ఇవీ చదవండి..
కోహ్లీ కన్నా బుమ్రాకే ఎక్కువ పారితోషికం
ఆస్ట్రేలియాపై పంత్ కొత్త రికార్డు..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు