బౌలింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌

రసవత్తరంగా సాగుతున్న టీ20 లీగ్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. అబుదాబి వేదికగా పంజాబ్‌×రాజస్థాన్‌ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన రాజస్థాన్‌ బౌలింగ్‌ ఎంచుకుంది

Updated : 30 Oct 2020 19:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రసవత్తరంగా సాగుతున్న టీ20 లీగ్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. అబుదాబి వేదికగా పంజాబ్‌×రాజస్థాన్‌ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన రాజస్థాన్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు 12 మ్యాచ్‌లు ఆడగా పంజాబ్‌ ఆరు విజయాలతో నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు 10 పాయింట్లతో రాజస్థాన్‌ ఏడో స్థానంలో నిలిచింది. ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే ఈ పోరులో స్మిత్‌సేన తప్పక గెలవాల్సిందే. ఇటీవల రెండు జట్లు తలపడిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రికార్డు ఛేదనతో విజయం సాధించింది.

జట్ల వివరాలు

పంజాబ్‌: కేఎల్ రాహుల్ (కెప్టెన్), మన్‌దీప్ సింగ్‌, క్రిస్ గేల్,  పూరన్‌, మాక్స్‌వెల్‌, దీపక్‌ హుడా, క్రిస్ జోర్డాన్‌, మురుగున్‌ అశ్విన్‌, రవి బిష్ణోయ్‌, అర్షదీప్‌ సింగ్‌, షమి

రాజస్థాన్‌: రాబిన్‌ ఉతప్ప, బెన్‌ స్టోక్స్‌, స్టీవ్‌ స్మిత్‌ (కెప్టెన్‌), సంజు శాంసన్‌, బట్లర్‌, రియాన్‌ పరాగ్, రాహుల్ తెవాతియా, జోఫ్రా ఆర్చర్‌, వరుణ్‌ ఆరోన్‌, కార్తీక్ త్యాగి, శ్రేయస్‌ గోపాల్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని