దాదా రక్షించు.. శాస్త్రీ దిగిపో!
ఆస్ట్రేలియాతో జరిగిన గులాబి టెస్టులో టీమ్ఇండియా ఘోర పరాజయం చవిచూసింది. రెండో ఇన్నింగ్స్లో 36 పరుగులకే కుప్పకూలింది. ఇలాంటి చెత్త ప్రదర్శనకు కారణం కోచ్ రవిశాస్త్రే అని నెటిజన్లు విమర్శిస్తున్నాడు. ఆయనను కోచ్గా తొలగించి రాహుల్ ద్రవిడ్ లేదా...
టీమ్ఇండియా కోచ్పై నెటిజన్ల విమర్శలు
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో జరిగిన గులాబి టెస్టులో టీమ్ఇండియా ఘోర పరాజయం చవిచూసింది. రెండో ఇన్నింగ్స్లో 36 పరుగులకే కుప్పకూలింది. ఇలాంటి చెత్త ప్రదర్శనకు కారణం కోచ్ రవిశాస్త్రే అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఆయనను కోచ్గా తొలగించి రాహుల్ ద్రవిడ్ లేదా అలాంటి వ్యక్తులకు బాధ్యతలు అప్పగించాలని సూచిస్తున్నారు. దయచేసి భారత క్రికెట్ను రక్షించండి అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని అభ్యర్థిస్తున్నారు.
అడిలైడ్ వేదికగా జరిగిన గులాబి టెస్టు తొలి రెండు రోజులు ఆసక్తికరంగా సాగింది. విరాట్ కోహ్లీ (74), ఛెతేశ్వర్ పుజారా (43), అజింక్య రహానె (42) రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా 244 పరుగులు చేసింది. ఇదే తక్కువ స్కోరని భావిస్తే ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన ఆసీస్ 191 పరుగులకే కుప్పకూలింది. రవిచంద్రన్ అశ్విన్ (4), ఉమేశ్ యాదవ్ (3), బుమ్రా (2) ఆ జట్టును దెబ్బకొట్టారు. 50+ ఆధిక్యం లభించడంతో టీమ్ఇండియా గెలుపుకు బాటలు వేసుకుంటుందని అంతా అనుకున్నారు.
ఇందుకు విరుద్ధంగా కోహ్లీసేన రెండో ఇన్నింగ్స్లో 21.2 ఓవర్లలో కేవలం 39 పరుగులకే చాప చుట్టేసింది. ఒక్క బ్యాట్స్మన్ సైతం రెండంకెల పరుగులు చేయలేదు. జోష్ హేజిల్వుడ్ 5/8, కమిన్స్ 4/21 చుక్కలు చూపించారు. భారత్ ఘోర పరాజయం పాలవ్వడంతో ఇందుకు రవిశాస్త్రినే నెటిజన్లు మీమ్స్తో విరుచుకుపడుతున్నారు.
ఇవీ చదవండి
పెద్ద జట్లు.. చిన్న స్కోర్లు: ఎందుకీ విలవిల?
భారత్ తప్పుకాదు..ఓటీపీని మరిచిపోవాలి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM