ట్రోఫీతో పాటు ఊరిస్తున్న రికార్డులివే
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 లీగ్ 13వ సీజన్ విజేతను తేల్చే మ్యాచ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఎప్పటిలాగే అందరి నమ్మకాన్ని నిలబెడుతూ ఫెనల్ చేరిన ముంబయి ఓవైపు.. ఈసారి అత్యుత్తమ..
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 లీగ్ 13వ సీజన్ విజేతను తేల్చే మ్యాచ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఎప్పటిలాగే అందరి నమ్మకాన్ని నిలబెడుతూ ఫెనల్ చేరిన ముంబయి ఓవైపు.. ఈసారి అత్యుత్తమ ప్రదర్శనతో మేటి జట్లను మట్టికరిపించి కొండంత ఆత్మవిశ్వాసంతో తొలిసారి ఫైనల్ చేరిన దిల్లీ మరోవైపు. గత రికార్డులు ఎలా ఉన్నా సరే.. ఇది టీ20. ఫలితాన్ని ఎవరూ ముందే నిర్ణయించలేరు. ఈసారి ట్రోఫీని ముద్దాడేదెవరో తెలుసుకోవాలంటే మ్యాచ్ ముగిసే వరకూ వేచి చూడాల్సిందే. మరి కీలకమైన ఈ మ్యాచ్లో ట్రోఫీతో పాటు కొన్ని రికార్డులు ఆటగాళ్లను ఊరిస్తున్నాయి. అవేంటో తెలుసా..? ఇవే రికార్డులు..
* ఈ మ్యాచ్తో రోహిత్శర్మ టీ20లీగ్లో 200 మ్యాచ్లు పూర్తి చేసుకుంటాడు.
* 4,000 పరుగుల మైలురాయికి హిట్మ్యాన్ మరో 8 పరుగుల దూరంలో ఉన్నాడు.
* మరో రెండు సిక్సర్లు బాదితే ముంబయి ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్ టీ20 లీగ్లో 200 సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కుతాడు.
* దిల్లీ ఆటగాడు శిఖర్ ధావన్ టీ20లీగ్లో 1,500 పరుగులకు మరో 36 పరుగుల దూరంలో ఉన్నాడు. దిల్లీ తరఫున గబ్బర్ ఇప్పటి వరకూ 1,464 పరుగులు చేశాడు.
* ఈ మ్యాచ్తో ధావన్కు టోర్నీలో టాప్స్కోరర్ అయ్యే అవకాశం ఉంది. మరో 68 పరుగులు చేస్తే పంజాబ్ ఆటగాడు కెఎల్.రాహుల్ (670)ను గబ్బర్ అధిగమిస్తాడు.
* దిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందు కూడా ఓ రికార్డు ఉంది. మరో 46 పరుగులు చేస్తే అతను ఈ సీజన్లో 500 పరుగులు చేసిన ఆటగాడవుతాడు.
ఈ మైదానం ముంబయికి ప్రతికూలమే..!
ఈ మైదానంలో ఇప్పటి వరకూ ముంబయి ఆడిన 7 మ్యాచుల్లో ఐదింట్లో ఓడింది. కేవలం రెండు మ్యాచుల్లోనే విజయం సాధించింది. మరోవైపు ఇదే మైదానంలో 10మ్యాచ్లాడిన దిల్లీ 5 విజయాలు, 5 ఓటములతో మిశ్రమ ఫలితాలు రాబట్టింది. ఈ రెండు జట్లు 27 మ్యాచుల్లో ఎదురుపడగా.. అందులో ముంబయి - 15, దిల్లీ - 12 విజయాలు సాధించాయి. కాగా.. ఈ సీజన్లోనే శ్రేయస్ జట్టుపై రోహిత్సేన మూడు మ్యాచుల్లో గెలుపొంది ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే.. ముంబయికి అంతగా కలిసిరాని ఈ దుబాయ్ మైదానం దిల్లీకి ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి మరి.!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే ఆలోచన లేదని వెస్టిండీస్ మాజీ ఆటగాడు సునీల్ నరైన్ (Sunil Narine) అన్నాడు. -
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ గురించి భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. -
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?