ఆస్ట్రేలియా కన్నా భారత్కే తలనొప్పి ఎక్కువ
తొలి టెస్టులో టీమ్ఇండియాపై విజయం సాధించిన ఆస్ట్రేలియాకు ఈ సిరీస్ను క్లీన్స్వీప్ చేసే అవకాశం ఉందని ఆ జట్టు మాజీ సారథి రికీ పాంటింగ్ అన్నాడు. శనివారం అడిలైడ్లో తొలి టెస్టు పూర్తయ్యాక...
రెండో టెస్టుపై మాజీ సారథి రికీ పాంటింగ్..
ఇంటర్నెట్డెస్క్: తొలి టెస్టులో టీమ్ఇండియాపై విజయం సాధించిన ఆస్ట్రేలియాకు ఈ సిరీస్ను క్లీన్స్వీప్ చేసే అవకాశం ఉందని ఆ జట్టు మాజీ సారథి రికీ పాంటింగ్ అన్నాడు. శనివారం అడిలైడ్లో తొలి టెస్టు పూర్తయ్యాక అతడు ఓ క్రీడా వెబ్సైట్తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. రెండో ఇన్నింగ్స్లో భారత్ 36/9 అత్యల్ప స్కోరుకే చేతులెత్తేయడంతో అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా 2 వికెట్లు కోల్పోయి 90 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేసింది. దీంతో ఆస్ట్రేలియా 4 టెస్టుల సిరీస్లో 1-0 ఆధిక్యం సంపాదించింది. ఈ నేపథ్యంలోనే పాంటింగ్ పై విధంగా స్పందించాడు.
మరోవైపు టీమ్ఇండియాలో అసలైన లోటుపాట్లు తెలిశాయని, దాంతో సిరీస్ను క్లీన్స్వీప్ చేసే మంచి అవకాశం ఆస్ట్రేలియాకు దక్కిందని పాంటింగ్ పేర్కొన్నాడు. మెల్బోర్న్లోనూ తమ జట్టు విజయం సాధిస్తే భారత్ తిరిగి కోలుకోవడం చాలా కష్టమన్నాడు. ఇక రెండో టెస్టు నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకపోవడం ఆ జట్టుకు మరింత ఇబ్బందికరమని చెప్పాడు. అప్పుడు టీమ్ఇండియాకు అసలైన సవాలు ఎదురుకానుందన్నాడు. అలాగే ‘బాక్సింగ్డే’ టెస్టుకు ముందు భారత జట్టులో పలు మార్పులు చేసుకోవాలని సూచించాడు. తుది జట్టులో కోహ్లీ లేనందున మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్గా రిషభ్ పంత్ను తీసుకోవాలన్నాడు.
ఇక తర్వాతి టెస్టులో ఆస్ట్రేలియా మరింత బలంగా ఉండనుందని, ఒకవేళ డేవిడ్ వార్నర్ గాయం నుంచి కోలుకుంటే జో బర్న్స్తో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉందన్నాడు. అదే నిజమైతే గాయం బారిన పడిన మరో ఆటగాడు పకోస్కీ మరికొంత కాలం టెస్టుల్లో అరంగేట్రం కోసం వేచి చూడక తప్పదని చెప్పాడు. బర్న్స్ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో అర్ధశతకంతో మెరిసినందున ఫామ్లోకి వచ్చాడని, దాంతో అతడిని కొనసాగిస్తారని పాంటింగ్ వివరించాడు. ఇలాంటి పరిస్థితుల్లో రెండో టెస్టుకు తుది జట్టును ఎంపిక చేయడంలో ఆస్ట్రేలియా కంటే భారత్కే ఎక్కువ తలనొప్పి ఉందన్నాడు.
ఇవీ చదవండి..
ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి ఇతరులను పట్టించుకోకండి..
నిద్రమత్తులో టీమిండియా స్కోర్ 369 అనుకున్నా..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి.
తాజా వార్తలు (Latest News)
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి