ఇండియా చితక్కొడితే ఇండోర్ దద్దరిల్లింది..
భారత్లో పేరు మోసిన క్రికెట్ స్టేడియాలు ఏవని అడిగితే వెంటనే గుర్తొచ్చే పేర్లు ఈడెన్ గార్డెన్స్, వాంఖడే, చెపాక్, చిన్నస్వామి, రాజ్కోట్, ఫిరోజ్ షా మైదానాలే. కానీ, ఇండోర్లోని హోల్కర్ స్టేడియం...
సెహ్వాగ్, రోహిత్ల విధ్వంసాలు..
భారత్లో పేరు మోసిన క్రికెట్ స్టేడియాలు ఏవని అడిగితే వెంటనే గుర్తొచ్చే పేర్లు ఈడెన్ గార్డెన్స్, వాంఖడే, చెపాక్, చిన్నస్వామి, రాజ్కోట్, ఫిరోజ్ షా మైదానాలే. కానీ, ఇండోర్లోని హోల్కర్ స్టేడియం కూడా ముఖ్యమైనదే. మధ్యప్రదేశ్లో ఉన్న ఈ స్టేడియానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే టీమ్ఇండియా అటు వన్డేల్లో, ఇటు టీ20ల్లో అత్యధిక స్కోర్లు సాధించింది ఇక్కడే. 2011లో వెస్టిండీస్పై అత్యధిక వన్డే స్కోర్ సాధించిన భారత జట్టు.. 2017లో శ్రీలంకపై పొట్టి క్రికెట్లో అదే ఘనత నమోదు చేసింది. ఇది జరిగి నేటికి సరిగ్గా మూడేళ్లైంది. ఈ సందర్భంగా ఆయా మ్యాచ్ల విశేషాలేంటో ఓసారి గుర్తు చేసుకుందాం..
రోహిత్, రాహుల్ ఆకాశమే హద్దుగా..
2017 డిసెంబర్ 22న భారత్-శ్రీలంక జట్లు రెండో టీ20 మ్యాచ్ ఆడాయి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ ఈ ఫార్మాట్లో తన అత్యధిక స్కోర్ నమోదు చేసింది. రోహిత్ (118; 43 బంతుల్లో 12x4, 10x6), కేఎల్ రాహుల్ (89; 49 బంతుల్లో 5x4, 8x6) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఇక్కడ రోహిత్ సాధించిన సెంచరీ టీ20 ఫార్మాట్లో భారత్ తరఫున అత్యంత వేగమైనదిగా(35 బంతుల్లో) రికార్డులకెక్కింది. రాహుల్తో కలిసి స్టేడియం మొత్తం సిక్సర్ల వర్షం కురిపించాడు. లంక బౌలర్లకు బంతులెక్కడ వేయాలో అర్థం కాకుండా చేశాడు. వీరిద్దరూ చెలరేగడంతో ప్రత్యర్థి ఫీల్డర్లు చూస్తుండిపోయారు. 12 ఓవర్లకే జట్టు స్కోర్ 160కి చేరిందంటే ఏ మేరకు విధ్వంసం సృష్టించారో అర్థం చేసుకోవచ్చు. మాథ్యూస్ మినహా మిగతా బౌలర్లకు చుక్కలు చూపించారు. వీళ్లిద్దరూ ఇలాగే కొనసాగి ఉంటే జట్టు స్కోర్ 300 దాటి కొత్త చరిత్ర సృష్టించేదేమో అనేంతలా బౌండరీలు బాదారు. చివరికి భారత్ 260/5 పరుగులు చేసి లంక ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆపై కుశాల్ పెరీరా(77; 37 బంతుల్లో 4x4, 7x6), ఉపుల్ తరంగ (47 ; 29 బంతుల్లో 3x4, 2x6) ధాటిగా ఆడినా మిగతా బ్యాట్స్మెన్ కుప్పకూలారు. దీంతో 17.2 ఓవర్లకే 172 పరుగులు చేసి ఆలౌటయ్యారు.
సచిన్ తర్వాత సెహ్వాగ్..
ఇక 2011లో డిసెంబర్ 8న భారత్-వెస్టిండీస్ జట్లు అదే హోల్కర్ మైదానంలో నాలుగో వన్డే ఆడాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 418 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్లు సెహ్వాగ్ (219; 149 బంతుల్లో 25x4, 7x6), గౌతమ్ గంభీర్(67; 67 బంతుల్లో 11x4) మెరుపు ఆరంభమిచ్చారు. వీరిద్దరూ 22 ఓవర్లకే 170 స్కోర్ సాధించారు. ఈ క్రమంలోనే గంభీర్ ఔటయ్యాక సురేశ్ రైనా(55; 44 బంతుల్లో 6x4)తో కలిసి వీరూ మరో కీలక భాగస్వామ్యం నిర్మించాడు. మైదానం నలువైపులా బౌండరీలు బాది అభిమానులను అలరించాడు. దీంతో క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ తర్వాత వన్డేల్లో ద్విశతకం బాదిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలోనే భారత్ 40 ఓవర్లకే 310 పరుగులు చేసింది. ఆపై వరుసగా వికెట్లు కోల్పోయి చివరికి 418 పరుగులు చేసింది. అనంతరం దినేష్ రామ్దిన్(96; 96 బంతుల్లో 12x4) పోరాడినా మిగతా బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. అలా విండీస్ 265 పరుగులకే ఆలౌటైంది.
మరిన్ని ఆసక్తికర విషయాలు..
* వెస్టిండీస్తో తలపడిన వన్డేలో సెహ్వాగ్ డబుల్ సెంచరీ బాదగా.. ఆ మ్యాచ్లో అతడే కెప్టెన్సీ చేపట్టాడు. భారత్ 153 పరుగులతో విజయం సాధించింది.
* ఇక శ్రీలంకతో ఆడిన టీ20 మ్యాచ్లో రోహిత్ శర్మ సెంచరీతో అలరించాడు. ఈ మ్యాచ్లోనూ అతడే కెప్టెన్సీ చేశాడు. టీమ్ఇండియా 88 పరుగుల తేడాతో విజయం సాధించింది.
* టీమ్ఇండియా వన్డే, టీ20ల్లో అత్యధిక స్కోర్లు సాధించిన డిసెంబర్లోనే టెస్టు క్రికెట్లోనూ ఆ ఘనత నమోదు చేసింది. కాకపోతే, అది 2016 డిసెంబర్ 19న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో. అప్పుడు ఇంగ్లాండ్ ప్రత్యర్థి జట్టు. టీమ్ఇండియా 759/7 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రాహుల్(199; 311 బంతుల్లో 16x4, 3x6), కరున్ నాయర్(303నాటౌట్; 381 బంతుల్లో 32x4, 4x6) సాధించాడు.
- ఇంటర్నెట్డెస్క్
ఇవీ చదవండి..
36/9 ఊహించలేదు: బుద్ధిని వాడాలి!
8 జట్లతోనే వచ్చే ఐపీఎల్!
2020.. కోహ్లీ ఏంటి?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’