బీచ్‌లో సేద తీరుతున్న రోహిత్‌ జంట

గాయంతో గత రెండు మ్యాచ్‌లకు దూరమైన ముంబయి జట్టు కెప్టెన్‌ రోహిత్‌శర్మ దుబాయ్‌ బీచ్‌లో సేదతీరుతున్నాడు. భార్య రితిక, కూతురుతో కలిసి బీచ్‌లో దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకున్నాడు. ‘బీచ్‌లో సాయంకాలం సేదతీరాం’ అని ఆ పోస్టులో పేర్కొన్నాడు.

Updated : 29 Oct 2020 14:39 IST

(photo: Rohit Sharma twitter)

ఇంటర్నెట్‌ డెస్క్‌: గాయంతో గత రెండు మ్యాచ్‌లకు దూరమైన ముంబయి జట్టు కెప్టెన్‌ రోహిత్‌శర్మ దుబాయ్‌ బీచ్‌లో సేదతీరుతున్నాడు. భార్య రితిక, కూతురుతో కలిసి బీచ్‌లో దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకున్నాడు. ‘బీచ్‌లో సాయంకాలం సేదతీరాం’ అని ఆ పోస్టులో పేర్కొన్నాడు. వీలు చిక్కినప్పుడల్లా రోహిత్‌ తన కుటుంబంతో సమయం గడిపేందుకు ఆసక్తి చూపిస్తుంటాడు. వాటికి సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటాడు.

గాయం కారణంగా రోహిత్‌శర్మను సెలెక్టర్లు ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపిక చేయని విషయం తెలిసిందే. అయితే.. నెట్స్‌లో సాధన చేస్తున్న రోహిత్‌ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టిన తరువాత అభిమానుల్లో పలు అనుమానాలకు తెరతీసింది. అసలు రోహిత్‌కు గాయమైందా..? ఒకవేళ అయితే నెట్స్‌లో సాధన ఎందుకు చేస్తున్నట్లు.? తర్వాతి మ్యాచ్‌కు జట్టులో రోహిత్‌ ఉంటాడా..? అని అందరిలోనూ సందేహాలు తలెత్తాయి. రోహిత్‌ ఫిట్‌నెస్‌పై సరైన స్పష్టత ఇవ్వాలని పలువురు క్రికెట్‌ ప్రముఖులు సైతం ప్రశ్నలు లేవనెత్తారు. ముంబయి జట్టు గానీ.. బీసీసీఐ గానీ ఇంతవరకూ రోహిత్‌ గాయంపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. రోహిత్‌ గైర్హాజరి నేపథ్యంలో మరో సీనియర్‌ ఆటగాడు కీరన్‌ పొలార్డ్‌ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు తీసుకొని ముందుండి నడిపిస్తున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని