కోహ్లీని కాపాడిన ధోనీ: మంజ్రేకర్
ఒకానొక సందర్భంలో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టులో స్థానం కోల్పోయే వాడని, ఆ ప్రమాదం నుంచి మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ రక్షించాడని మాజీ క్రికెటర్...
ఇంటర్నెట్డెస్క్: ఒకానొక సందర్భంలో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టులో స్థానం కోల్పోయే వాడని, ఆ ప్రమాదం నుంచి మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ రక్షించాడని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ వెల్లడించాడు. తాజాగా అతడు ఓ క్రీడాఛానల్తో మాట్లాడుతూ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2011-2012 సీజన్లో టీమ్ఇండియా ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఇలా జరిగిందని చెప్పాడు. అప్పుడు కోహ్లీ వరుసగా ఆరు టెస్టుల్లో విఫలమయ్యాడని, దాంతో సిడ్నీ టెస్టు తర్వాత అతడికి జట్టులో స్థానం కష్టమైందని మంజ్రేకర్ పేర్కొన్నాడు. అయితే, అదే సమయంలో కెప్టెన్ ధోనీ అండగా నిలిచాడని, దాంతో తర్వాతి టెస్టులో 75 పరుగులు సాధించి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడని వివరించాడు. ఇక తర్వాత అడిలైడ్లో జరిగిన నాలుగో మ్యాచ్లో కోహ్లీ తొలి టెస్టు శతకం నమోదు చేశాడని మాజీ క్రికెటర్ పేర్కొన్నాడు. ఆ సిరీస్లో టీమ్ఇండియా తరఫున అదొక్కటే సెంచరీ అని గుర్తుచేసుకున్నాడు. ఇదిలాఉండగా, ఆ సిరీస్లో భారత్ 0-4 తేడాతో ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడిపోయింది.
ఇవీ చదవండి..
పుజారా ఉండగ.. భయమెందుకు దండగ!
షమి, బుమ్రా: 20 కంగారూల వేట!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?