ధోనీ విషయంలో బీసీసీఐ ప్రవర్తన సరిగ్గా లేదు
గతేడాది వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలయ్యాక మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. తర్వాత ఐపీఎల్ ఆడి జట్టులోకి వస్తాడని
భారత క్రికెట్ బోర్డుపై పాక్ మాజీ క్రికెటర్ ఏమన్నాడంటే..
ఇంటర్నెట్డెస్క్: గతేడాది వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలయ్యాక మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. తర్వాత ఐపీఎల్ ఆడి జట్టులోకి వస్తాడని ఆశించినా గతవారం స్వాతంత్ర్య దినోత్సవం రోజున అందర్నీ ఆశ్చర్యపరుస్తూ రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, ఈ విషయంలో బీసీసీఐ సరిగ్గా వ్యవహరించలేదని, అంత గొప్ప సారథికి సరైన వీడ్కోలు ఇవ్వలేదని పాకిస్థాన్ మాజీ కీపర్ సక్లైన్ ముస్తాక్ పేర్కొన్నాడు. మహీ వీడ్కోలు పలికాక తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ ఇలా అన్నాడు.
ప్రతీ క్రికెటర్కి జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని, ఆటకు వీడ్కోలు చెప్పక తప్పదని ముస్తాక్ అన్నాడు. అలాగే ధోనీ తన ఫేవరెట్ క్రికెటర్ అని, అతడో గొప్ప ఆటగాడే కాకుండా అత్యత్తమ ఫినిషర్, పోరాడే నాయకుడు, నిరాడంబర వ్యక్తి అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. చూడ్డానికి ఎంత ప్రశాంతంగా కనిపించినా అతడు చాలా ప్రభావితం చేస్తాడన్నాడు. మహీ సామాన్యమైన ఆటగాడు కాదని, నూటికి ఒక్కడని ప్రశంసించాడు. అతడి పేరూ, గౌరవం అలా నిలిచిపోతాయని చెప్పాడు. టీమ్ఇండియా ఇప్పుడున్న స్థితికి అతడే పెద్ద కారణమని పేర్కొన్నాడు. అలాగే అతడిని అనుకరించి, అభిమానించే వాళ్లు ఎంతో మంది ఉన్నారని, వాళ్లంతా ధోనీని చివరి మ్యాచ్లో చూడాలనుకుంటారని అభిప్రాయపడ్డాడు.
ఈ క్రమంలోనే మాట్లాడుతూ తాను ఎవరిమీదా తప్పుగా మాట్లాడనని చెప్పాడు. అయితే, ధోనీ విషయంలోనే మనసు ఆగలేక ఇలా స్పందించాల్సి వచ్చిందని వివరించాడు. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ అతడితో సరిగ్గా ప్రవర్తించలేదని తెలిపాడు. అంత గొప్ప ఆటగాడికి సరైన పద్ధతిలో వీడ్కోలు పలకలేదన్నాడు. ధోనీ కోట్లాది మంది అభిమానులు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తారన్నాడు. ఇలా అన్నందుకు బీసీసీఐకి క్షమాపణలు చెబుతున్నట్లు వివరించాడు. ప్రతీ క్రికెటర్ కూడా గొప్పగా వీడ్కోలు అందుకోవాలనుకుంటాడని, ఆ విషయంలో ధోనీ కూడా అతీతుడు కాదని తాను అనుకుంటున్నట్లు చెప్పాడు. చివరగా టీమ్ఇండియా మాజీ సారథి అసలైన హీరో అని, అతడో వజ్రం వంటి మనిషని కీర్తించాడు. మహీ పట్ల గర్వంగా ఉందని ముస్తాక్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
తన అభిమాన క్రికెటర్తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ఎప్పటికీ మరిచిపోలేనని చెన్నై ఆటగాడు సమీర్ రిజ్వీ వ్యాఖ్యానించాడు. -
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్కతా మాజీ ఆటగాడు
కోల్కతా ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిత్ వల్ల చాలామంది విదేశీ క్రికెటర్లు ఇబ్బందిపడ్డారని నమీబియా క్రికెటర్ వ్యాఖ్యానించడం సంచలనమైంది. -
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
ముంబయి బౌలర్లు భారీగా పరుగులు ఇవ్వడంతో హైదరాబాద్ రికార్డు స్కోరును నమోదు చేసి చరిత్ర సృష్టించింది. దీంతో ఐపీఎల్ 17వ సీజన్లో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. -
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్గా మారిన కావ్యా మారన్
కావ్యా మారన్.. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని. ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ భారీ స్కోరు సాధించడంతో ఆమె ఒక్కసారిగా నెట్టింట వైరల్గా మారారు. -
ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ బోణీ కొట్టింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబయిని చిత్తు చేసింది. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదు అయ్యాయి. -
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో సన్రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్కు మారు పేరు! సన్రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్రేట్లో ఎప్పుడూ వెనుకంజే! సన్రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. -
స్టిమాక్ను తప్పించాల్సిందే
ఫుట్బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో చిన్న జట్టు అఫ్గానిస్థాన్ చేతిలో భారత్ అనూహ్య ఓటమితో కోచ్ స్టిమాక్ను తప్పించాలని మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?