రైనా.. నువ్వెప్పుడూ సీఎస్కే గుండెచప్పుడే..
ఇప్పటికే కరోనా దెబ్బతో కంటికి కునుకు లేకుండా గడుపుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు తాజాగా ఆ జట్టు స్టార్ బ్యాట్స్మన్ సురేశ్ రైనా మరో ఎదురుదెబ్బ కొట్టాడు....
నువ్వు గర్వపడేలా ఏదైనా చేస్తాం: షేన్వాట్సన్
ఇంటర్నెట్డెస్క్: ఇప్పటికే కరోనా దెబ్బతో కంటికి కునుకు లేకుండా గడుపుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు తాజాగా ఆ జట్టు స్టార్ బ్యాట్స్మన్ సురేశ్ రైనా మరో ఎదురుదెబ్బ కొట్టాడు. వ్యక్తిగత కారణాలతో అతడు ఈ టోర్నీ నుంచి అర్ధాంతరంగా వైదొలుగుతున్నట్లు శనివారం ఆ జట్టు సీఈవో విశ్వనాథన్ ట్వీట్ చేశారు. రైనా ఎందుకు భారత్కు తిరిగి వచ్చాడనే విషయంపై కచ్చితమైన సమాచారం లేకపోయినా, అతడి మేనత్త కుటుంబంలో విషాదం చోటుచేసుకొందని పలు మీడియా కథనాలు ప్రసారం అవుతున్నాయి. దీంతో చెన్నై అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన అతడు ఐపీఎల్లో సీఎస్కే తరఫున కీలక బ్యాట్స్మన్. టోర్నీ తొలి సీజన్ నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా విఫలమవ్వలేదు. ఐపీఎల్లో అత్యధిక పరుగుల జాబితాలో కోహ్లీ తర్వాత రైనానే ఉన్నాడు. అలాంటి మేటి బ్యాట్స్మన్ ఈ సీజన్ నుంచి తప్పుకోవడంతో ఆ జట్టు ఆల్రౌండర్ షేన్వాట్సన్ స్పందించాడు.
ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో ఓ భావోద్వేగ వీడియో పంచుకొని ఇలా పేర్కొన్నాడు. ‘వ్యక్తిగత కారణాల రిత్యా రైనా భారత్కు తిరిగి వెళ్లాడనే చేదు వార్తతో ఈరోజు నిద్రలేచా. ఇప్పుడతడు బాగానే ఉన్నాడని అనుకుంటున్నా. సురేశ్.. సీఎస్కే నిన్ను కచ్చితంగా మిస్ అవుతుంది. ఆది నుంచీ ఈ జట్టుతోనే కలిసి ఉన్నావు. ఎల్లప్పుడూ నువ్వు ఈ జట్టుకు గుండెచప్పుడివి. ఈ టోర్నీకే స్టార్ ఆటగాడివి’ అని ప్రశంసలతో ముంచెత్తాడు. అనంతరం తమ జట్టులో కరోనా సోకిన విషయంపై స్పందిస్తూ.. మళ్లీ ఏడు రోజుల పాటు క్వారంటైన్లో ఉండడం ఆసక్తిగా ఉందన్నాడు. ఇప్పుడు ప్రతీ ఒక్కరూ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నాడు. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 లీగ్ అని, ఇలాంటి మెగా ఈవెంట్లో కరోనా వ్యాప్తి జరగకుండా జాగ్రత్తలు పాటించాలని చెప్పాడు.
అలాగే సురేశ్ రైనా కోసం ఏదైనా చేస్తామని, అతడు గర్వపడేలా ఈ సీజన్లో ఆడతామని వాట్సన్ పేర్కొన్నాడు. ఇప్పుడున్న పరిస్థితులు కఠినతరమైనవి అని, దాంతో ప్రతీఒక్కరికి ఎలా వ్యవహరించాలో తెలిసి వచ్చిందని చెప్పాడు. ఇప్పుడు కచ్చితంగా బీసీసీఐ, ఐపీఎల్ నియమాలను పాటించాల్సిన అవసరం ఉందన్నాడు. అలాగే మెగా టోర్నీ ఆరంభానికి ముందు ఇదో మింగుడు పడని విషయమని వ్యాఖ్యానించాడు. భవిష్యత్లో ఇలా జరగకుండా టోర్నీ సజావుగా సాగాలని ఆకాంక్షించాడు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం చెన్నై జట్టులో ఇద్దరు ఆటగాళ్లు, 11 మంది సహాయక సిబ్బంది కరోనా బారిన పడినట్లు బీసీసీఐ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. వారంతా ఇప్పుడు ప్రత్యేకంగా ఐసోలేషన్లో ఉన్నారని, ఎలాంటి లక్షణాలు లేవని తెలిపింది. అలాగే నిరంతరం వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతుందని చెప్పింది. కొద్ది రోజుల్లో మళ్లీ నిర్వహించే పరీక్షల్లో నెగిటివ్గా వస్తేనే వారిని బయోబుడగలోకి అనుమతి ఇస్తారని తెలుస్తోంది. ఏదేమైనా యూఏఈలో ఎన్ని పకడ్బందీ ఏర్పాట్లు చేసినా ఆటగాళ్లు ఇలా వైరస్ బారిన పడటం ఆందోళనగానే ఉంది. దీంతో మెగా టోర్నీ సజావుగా సాగుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM