దాదా-షా భవితవ్యం ఆగస్టు 17కు వాయిదా!

రాజ్యాంగ సవరణ, అధ్యక్ష, కార్యదర్శుల పదవీ కాలం పొడగింపు సహా మరికొన్ని అంశాలపై బీసీసీఐ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఆగస్టు 17న తిరిగి విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి...

Published : 23 Jul 2020 02:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బీసీసీఐ రాజ్యాంగ సవరణ, అధ్యక్ష, కార్యదర్శుల పదవీ కాలం పొడగింపు సహా మరికొన్ని అంశాలపై బీసీసీఐ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఆగస్టు 17న తిరిగి విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావుతో కూడిన ధర్మాసనం తెలిపింది. అప్పటి వరకు సౌరవ్‌ గంగూలీ, జై షా తమ పదవుల్లో కొనసాగుతారని సమాచారం.

బీసీసీఐ నూతన రాజ్యాంగం ప్రకారం ఆరేళ్లు పదవుల్లో ఉన్న పాలకులు మూడేళ్లు విరామం (కూలింగ్‌ ఆఫ్‌) తీసుకోవాలి. బోర్డు నూతన కార్యవర్గం ఏర్పడి పది నెలలు మాత్రమే అవుతోంది. అంతకు ముందు గంగూలీ, షా తమ రాష్ట్ర బోర్డుల్లో పదవీ బాధ్యతల్లో ఉన్నారు. దాంతో కలిపి ఆరేళ్ల గడువు పూర్తవుతోంది. మేలో షా పదవీ కాలం ముగిసింది. జులై 27న దాదా గడువు ముగుస్తుంది. గత డిసెంబర్‌లో జరిగిన 88వ సర్వసభ్య సమావేశంలో రాజ్యాంగంలో మార్పులు చేస్తూ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఇందులో అధ్యక్ష, కార్యదర్శుల పదవీకాలం నిబంధనలు సవరించారు. దానిని సుప్రీం కోర్టు ఆమోదం కోసం పంపించారు.

ప్రస్తుతం దాదా, షా బోర్డు సమావేశాల్లో ఎంతో చురుగ్గా పాల్గొన్న సంగతి తెలిసిందే. సుప్రీం విచారణ వాయిదా పడటంతో పది రోజుల్లో జరిగే ఐపీఎల్‌ పాలక మండలి సమావేశంలోనూ వీరు పాల్గొంటారని తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని