బయోపిక్ కోసం హృతిక్కు దాదా షరతు!
సచిన్ తెందూల్కర్, మహేంద్రసింగ్ ధోనీ, అజహరుద్దీన్పై సినిమాలు వచ్చేశాయి. 1983 ప్రపంచకప్ నేపథ్యంలో కపిల్దేవ్ జీవితకథ వెండితెరపై వన్నెలీనేందుకు సిద్ధంగా ఉంది. మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్పై సినిమా త్వరలో పట్టాలకెక్కనుంది! ఇప్పుడు అభిమానులంతా ఆసక్తికరంగా ఒక క్రికెటర్ బయోపిక్ కోసం..
నేహా ధూపియా ఇంటర్వ్యూలో ఆసక్తికర సంభాషణ
సచిన్ తెందూల్కర్, మహేంద్రసింగ్ ధోనీ, అజహరుద్దీన్లపై సినిమాలు వచ్చేశాయి. 1983 ప్రపంచకప్ నేపథ్యంలో కపిల్దేవ్ జీవితకథ ప్రధాన ఇతివృత్తంగా వెండితెరపై వన్నెలీనేందుకు ‘83’ సిద్ధంగా ఉంది. మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్పై సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇప్పుడు అభిమానులంతా ఆసక్తిగా ఒక క్రికెటర్ బయోపిక్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆయనే టీమ్ఇండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.
వెండితెరపై రికార్డులు కొల్లగొట్టగలిగే సరకు దాదా జీవితంలో కచ్చితంగా దొరుకుతుంది. ఎందుకంటే అరంగేట్రం నుంచే గంగూలీ తనదైన ముద్ర వేశాడు. రిజర్వు బెంచీపై ఉన్నప్పుడే మైదానంలో క్రికెటర్లకు శీతల పానీయాలు ఇవ్వనని నిరాకరించాడు. రొటేషన్ పద్ధతిలో వచ్చి లార్డ్స్లో శతకం బాదేశాడు. సచిన్తో కలిసి ఓపెనింగ్లో ఘనతలెన్నో సృష్టించాడు. మ్యాచ్ ఫిక్సింగ్ చీకటిలో కూరుకుపోయిన భారత క్రికెట్కు వెలుగునిచ్చాడు. యువీ, కైఫ్, భజ్జీ, జహీర్, ధోనీ సహా చాలామంది యువకులను ప్రోత్సహించాడు. 2003లో జట్టును ప్రపంచకప్ ఫైనల్కు చేర్చాడు. ఆస్ట్రేలియా సారథి స్టీవ్వాను టాస్ కోసం ఎదురుచూసేలా చేశాడు. 2001 కోల్కతాలో ప్రపంచ క్రికెట్ను ఏలుతున్న ఆసీస్ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. గ్రెగ్ ఛాపెల్తో వివాదం, మళ్లీ పునరాగమనం, రిటైర్మెంట్, బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు, బీసీసీఐ అధ్యక్షుడు.. ఇలా ఎన్నో ఆసక్తికర అంశాలు అతడి కెరీర్లో ఉన్నాయి. వీటిపై అద్భుతమైన సినిమా వస్తుందనడంలో సందేహం లేదు.
జియో సావన్లో ‘నోఫిల్టర్ నేహా’ సీజన్5లో నేహా ధూపియాకు దాదా తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆసక్తికరమైన సంగతులెన్నో చెప్పాడు. ఒకవేళ బయోపిక్ చేస్తే హీరోగా ఎవరిని ఎంచుకుంటారని నేహా ప్రశ్నించింది. ‘ఎవరైతే బాగుంటుంది’ అని దాదా ఎదురు ప్రశ్నించాడు. అప్పుడు నేహా ‘నేనైతే హృతిక్ రోషన్’ అనుకుంటున్నానని చెప్పింది. అయితే ‘అతడు తన దేహాన్ని మరి నాలా మార్చుకోవాలి’ అని నవ్వుతూ చెప్పాడు. డ్రెస్సింగ్ రూమ్లో అంతగా డ్రెస్సింగ్ సెన్స్ లేనిది ఎవరికని ప్రశ్నించగా యువీ పేరు చెప్పాడు. అయితే క్రికెటర్లలో హీరో అయ్యే లక్షణాలు ఎవరికున్నాయని అడగ్గా మళ్లీ ‘యువీ’ పేరే చెప్పడం గమనార్హం. ప్రస్తుతం ఐపీఎల్-2020 కోసం దాదా దుబాయ్లో ఉన్న సంగతి తెలిసిందే.
-ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్