దక్షిణాఫ్రికా క్రికెట్లో ముగ్గురికి కరోనా
దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టులో ముగ్గురు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆ జట్టు యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఈనెల 27 నుంచి ప్రిటోరియాలో...
జోహెనస్బర్గ్: దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టులో ముగ్గురు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆ జట్టు యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఈనెల 27 నుంచి ప్రిటోరియాలో ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరానికి ముందు నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఇద్దరు క్రికెటర్లతో పాటు ఒక సహాయక సిబ్బందికి వైరస్ సోకినట్లు పేర్కొంది. ఆ ముగ్గురు పది రోజుల పాటు ఐసోలేషన్లో ఉంటారని, ఇప్పుడైతే తేలిక పాటి లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారని వివరించింది. అలాగే వారిని నిరంతరం తమ వైద్య సిబ్బంది పర్యవేక్షిస్తుంటారని చెప్పింది.
సెప్టెంబర్లో ఇంగ్లాండ్ పర్యటన సందర్భంగా నిర్వహించే పరిమిత ఓవర్ల క్రికెట్ కోసం ఈ శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. అలాగే ఆగస్టు 16 నుంచి జరగబోయే రెండో దఫా శిక్షణా శిబిరానికి మరోసారి అందరికి పరీక్షలు జరపనున్నట్లు ఆ బోర్డు ప్రకటించింది. ఇదిలా ఉండగా, లాక్డౌన్కు ముందు ఫిబ్రవరి, మార్చిలో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్లో ఈ దక్షిణాఫ్రికా జట్టు సెమీస్ వరకూ వెళ్లి ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కంగారూల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 134/5 స్కోర్ చేసింది. అనంతరం వర్షం కురవడంతో డక్వర్త్లూయిస్ పద్ధతిలో దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 13 ఓవర్లలో 98గా సవరించారు. దీంతో ఆ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 92 పరుగులే చేసి ఓటమిపాలైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.