వామ్మో.. టీమ్ఇండియాపై 952/6 స్కోరా?
ఒకప్పుడు టెస్టు క్రికెటే అసలైన క్రికెట్. ఐదు రోజుల ఆటలో ఎన్ని మలుపులు తిరగాలో అన్ని తిరిగేవి. ఆటగాళ్లు నిలకడగా ఆడుతూ, ఎండలో ఓపిగ్గా నిలవాలంటే అంత తేలిక కాదు...
ఎప్పుడు.. ఎవరు.. ఎలా కొట్టారు?
ఈ తరం క్రికెట్ అభిమానులకు తెలియని విషయం..
ఒకప్పుడు టెస్టు క్రికెటే అసలైన క్రికెట్. ఐదు రోజుల ఆటలో ఎన్ని మలుపులు తిరగాలో అన్ని తిరిగేవి. ఆటగాళ్లు నిలకడగా ఆడుతూ, ఎండలో ఓపిగ్గా నిలవాలంటే అంత తేలిక కాదు. అయినా అలాగే ఆడుతూ ఎన్నో రికార్డులు నమోదు చేశారు. ఇక బ్యాట్స్మన్ క్రీజులో అతుక్కుపోయాడంటే ప్రత్యర్థి బౌలర్లకు విసుగు పుట్టాల్సిందే. ఆ క్రమంలోనే శతకాలు, ద్విశతకాలతో పాటు చాలా అరుదుగా త్రిశతకాలూ నమోదయ్యేవి. దాంతో మ్యాచ్ గెలవడం అటుంచితే ఆటగాళ్లు డ్రా చేసుకోడానికే ప్రధాన్యమిచ్చేవారు. అప్పుడు స్కోరు బోర్డులు 500, 600, ఒక్కోసారి 700 కూడా దాటేవి. అయితే, టీమ్ఇండియాపై శ్రీలంక చేసిన ఆ స్కోర్.. టెస్టు క్రికెట్లోనే అత్యధిక పరుగులుగా నిలిచిపోయింది. అది జరిగి నేటికి 23 ఏళ్లు పూర్తయ్యాయి. నాటి విశేషాలేంటో మీరూ తెలుసుకోండి.
సచిన్, సిద్ధూ, అజ్జూ శతకాలే..
1997లో క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ నేతృత్వంలో టీమ్ఇండియా శ్రీలంక పర్యటనకు వెళ్లింది. అప్పుడు ప్రేమదాస మైదానంలో జరిగిన తొలి టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆదిలోనే నయన్ మోంగియా ఔటైనా మరో ఓపెనర్ నవజోత్సింగ్ సిద్ధూ (111), రాహుల్ ద్రవిడ్(69) జట్టును ఆదుకున్నారు. తర్వాత సచిన్ తెందూల్కర్(143), మహ్మద్ అజహరుద్దీన్(126) కూడా శతకాలతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో 167.3 ఓవర్లు ఆడాక భారత్ 537/8 వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. అప్పటి శ్రీలంక స్టార్ ఆటగాడు సనత్ జయసూర్య 3 వికెట్లు తీశాడు.
ఇక తర్వాత మొత్తం శ్రీలంక ఆటే..
టీమ్ఇండియా భారీ స్కోర్ సాధించడంతో లంక గట్టిగానే బదులిచ్చింది. మిగిలిన అన్ని రోజులూ వాళ్లే ఆడేసి మ్యాచ్ను డ్రా చేసుకున్నారు. ఈ క్రమంలోనే టెస్టు చరిత్రలో అత్యధిక స్కోర్ సాధించారు. ఇంకో 48 పరుగులు చేసి ఉంటే మాత్రం పెద్ద సెన్సేషన్ అయ్యుండేది. అంతలా రెచ్చిపోయిన ఆ జట్టు చివరికి 952/6 స్కోర్ సాధించింది. సనత్ జయసూర్య(340), రోషన్ మహానామా(225), క్రీజులో పాతుకుపోయి రికార్డు స్థాయి భాగస్వామ్యం నెలకొల్పారు. 39 పరుగుల వద్ద తొలి వికెట్ పడగా, రెండో వికెట్ పడేసరికి ఆ జట్టు స్కోర్ 615కి చేరింది. అంటే రెండో వికెట్కు వారిద్దరూ జోడించిన పరుగులు 576 పరుగులు. అంతర్జాతీయ క్రికెట్లో అతిపెద్ద భాగస్వామ్యాల్లో ఒకటి. అనంతరం అరవింద డిసిల్వ(126) శతకం బాదగా కెప్టెన్ అర్జున రణతుంగా (86), మహేలా జయవర్ధనే(66) అర్ధ శతకాలతో రాణించారు.
టెస్టుల్లో ఇతర అత్యధిక స్కోర్లు చేసిన జట్లు..
*ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాపై 903/7 డిక్లేర్డ్. ఇంగ్లిష్ జట్టు ఇన్నింగ్స్ 579 పరుగులతో ఘన విజయం సాధించింది.
*ఇంగ్లాండ్ వెస్టిండీస్పై 849 పరుగులు. మ్యాచ్ డ్రాగా ముగిసింది.
*వెస్టిండీస్ పాకిస్థాన్పై 790/3 డిక్లేర్డ్. ఇన్నింగ్స్ 174 పరుగులతో వెస్టిండీస్ విజయం.
*పాకిస్థాన్ శ్రీలంకపై 765/6 డిక్లేర్డ్. మ్యాచ్ డ్రా.
*శ్రీలంక టీమ్ఇండియాపై760/7 డిక్లేర్డ్. మ్యాచ్ డ్రా.
*టీమ్ఇండియా ఇంగ్లాండ్పై 759/7 డిక్లేర్డ్. ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో భారత్ విజయం. టెస్టుల్లో భారత్కు ఇదే అత్యధిక ఇన్నింగ్స్ స్కోర్. దీని తర్వాత శ్రీలంకపై మరోసారి 726/9 స్కోర్ చేసింది. ఆ మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ 24 పరుగుల తేడాతో గెలుపొందింది.
-ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
వరుస ఓటములతో డీలా.. బెంగళూరుకు ఇంకా ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నాయా..?
ఈ సీజన్లో బెంగళూరు పేలవమైన ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఆడిన ఎనిమిదింట్లో ఏడు ఓడి.. ప్లేఆఫ్స్ అవకాశాలకు దాదాపు దూరమైంది . -
200+ స్కోరు... చాలడం లేదు బాసూ!
ఐపీఎల్ 17వ సీజన్లో మ్యాచ్లు చివరి బంతి వరకూ రసవత్తరంగా సాగుతున్నాయి. భారీ స్కోరు చేసినా గెలుస్తామనే నమ్మకం చివరి వరకూ జట్లకు రావడం లేదు. -
సగం IPL పూర్తి.. బాదుడు నుంచి ఫ్లైయింగ్ కిస్ వరకు... ఆసక్తికర విశేషాలివే!
సుదీర్ఘమైన ఐపీఎల్ టోర్నీలో సగం మ్యాచ్లు ముగిశాయి. అనూహ్యంగా కొన్ని జట్లు చెలరేగగా.. మరికొన్ని డీలా పడిపోయి పాయింట్ల పట్టికలో అడుగుకు చేరాయి. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
వీరుడొచ్చాడు.. సన్రైజర్స్కు దొరికిన మరో వార్నర్
సన్రైజర్స్ హైదరాబాద్ అంటే ఒకప్పుడు డేవిడ్ వార్నర్ (David Warner) మెరుపులే గుర్తుకొచ్చేవి. వార్నర్ వెళ్లిపోయిన తర్వాత ఆ లోటు కనిపించింది. ఓపెనింగ్లో ఓ ఖాళీ. రెండు సీజన్ల పాటు ఆ వెలితి అలాగే ఉంది. కానీ ఇప్పుడొక వీరుడొచ్చాడు. అతనే.. ట్రావిస్ హెడ్ (Travis Head). -
పరుగులివ్వడు.. వికెట్లు వదలడు... బెంబేలెత్తిస్తున్న బుమ్రా
ఐపీఎల్లో అదరగొడుతున్న బౌలర్ల జాబితా రాస్తే తొలి స్థానంలో కనిపించే పేరు జస్ప్రీత్ బుమ్రా. అతని బౌలింగ్లో ఆడటానికి బ్యాటర్లు బాగా ఇబ్బందిపడుతున్నారు. -
వీళ్లు ఆడితే మామూలుగా ఉండదు!
ఐపీఎల్.. ఈ టోర్నీ పేరు చెప్పగానే వెస్టిండీస్ ఆటగాళ్లే గుర్తొస్తారు. గత 16 ఏళ్లుగా కరీబియన్ ఆటగాళ్ల విన్యాసాలే అభిమానుల మనసుల్లో మెదులుతాయి. ఎందుకంటే తమ ఆటతోనే కాదు తమ హవభావాలతో మైదానంలో, మైదానం బయట ఈ విండీస్ వీరుల సందడి అంతాఇంతా కాదు. -
‘ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్’.. సత్తా చాటేందుకు విదేశీ సంచలనాల తహతహ
ఐపీఎల్లో తమ సత్తా నిరూపించుకోవడానికి ఆటగాళ్లు ఎదురు చూస్తుంటారు. ఫామ్ను అందుకోవడంతోపాటు ఫ్రాంచైజీ దృష్టిలో పడాలనేది కొందరి ఆశ. -
నితీశ్ రెడ్డి.. భారత్ క్రికెట్కు మరో పేస్ ఆల్రౌండర్ లభించినట్లేనా?
హైదరాబాద్ తరఫున మరో ఆణిముత్యం వంటి ఆటగాడు వెలుగులోకి వచ్చాడు. అదీనూ తెలుగు కుర్రాడు కావడం ఇక్కడ విశేషం. జట్టును గెలిపించే ప్రదర్శన చేయడం అభిమానులను ఆకట్టుకుంది. -
ఫామ్తో తంటాలా.. ఆర్సీబీ ఉందిగా!
ఈ ఐపీఎల్ సీజన్లో బెంగళూరుపై ఫామ్లో లేని ఆటగాళ్లు కూడా చెలరేగుతున్నారు. అంతేకాదు వారే మ్యాచ్ విన్నర్లుగా అవతరిస్తున్నారు. -
అప్పుడు వేస్ట్.. ఇప్పుడు బెస్ట్... ‘విఫల’ ముద్ర తొలగించుకున్న బ్యాటర్లు
ఐపీఎల్లో ఇప్పటివరకు సరిగ్గా ఆడని కొంతమంది ప్లేయర్లు ఈ సీజన్ ఐపీఎల్లో అదరగొట్టేస్తున్నారు. వాళ్లెవరు, వాళ్ల సంగతేంటో చూద్దాం! -
యశ్ ఠాకూర్.. ధోనీలా మారదామని వచ్చి.. పేసర్గా అదరగొట్టి!
లఖ్నవూ పేస్ బౌలర్లు పెను సంచలనంగా మారారు. ఇదివరకు మయాంక్ యాదవ్ తన ఫాస్ట్తో బెంబేలెత్తించగా.. తాజాగా యశ్ ఠాకూర్ అదరగొట్టాడు. -
వద్దనుకున్నవాడే వరమయ్యాడు.. ఎవరీ శశాంక్ సింగ్..?
తన అద్భుత బ్యాటింగ్తో గుజరాత్పై పంజాబ్కు విజయం అందించిన శశాంక్ సింగ్పై ఇప్పుడు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. -
ఓరి‘నరైనో’.. బ్యాటుతో రెచ్చిపోతున్న విండీస్ స్పిన్నర్
ప్రత్యర్థి సొంత మైదానాల్లో దూకుడుగా ఆడుతూ పరుగులు రాబట్టడం అతడి ప్రత్యేకత. గత సీజన్లో పెద్దగా ప్రభావం చూపని ఈ కోల్కతా ఆటగాడు మళ్లీ బ్యాట్తో అదరగొట్టేస్తున్నాడు. -
వింటేజ్ ధోనీ... కీపింగ్ మెరుపులు ఓవైపు... భారీ సిక్సర్లు మరోవైపు!
తొలి రెండు మ్యాచుల్లో బ్యాటింగ్కి రాని ధోనీ... మూడో మ్యాచులో బరిలోకి దిగి భారీ సిక్సర్లు బాదాడు. దీంతో ఇప్పుడు అంతా అతని మేనియానే కనిపిస్తోంది. -
పంత్.. ఇదే కావాలయ్యా...రిషబ్ ఇక రెచ్చిపో!
రిషభ్ పంత్ జట్టులో ఉంటే అదో ధైర్యం. మనది కాదనుకున్న మ్యాచ్ను అమాంతం మనవైపు తిప్పేస్తుంటాడు. యాక్సిడెంట్ తర్వాత రీఎంట్రీలో చెన్నై మీద అదరగొట్టాడు. -
రేటెక్కువ.. ఆట తక్కువ... ఐపీఎల్లో ఎప్పుడూ ఇదే కథ!
భారీ ధరపెట్టి జట్టులోకి తీసుకున్న స్టార్ ప్లేయర్లు ఐపీఎల్లో నిరాశపరుస్తుంటారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. -
కొత్త పేస్ స్టార్.. గాయాలు ఇబ్బంది పెట్టినా బెదరని మయాంక్ యాదవ్
ఐపీఎల్ ప్లాట్ఫామ్ ద్వారా మరో ఆణిముత్యం వెలుగులోకి వచ్చింది. కొత్త స్టార్ పేసర్పై భారత సెలక్టర్లు దృష్టి పెట్టే అవకాశం లేకపోలేదు.. -
సిరాజ్ మియా.. ఎక్కడ బౌలింగ్ మాయ..? తేలిపోతున్న బెంగళూరు పేస్ ఎటాక్!
భారత స్టార్ పేసర్గా మారిన సిరాజ్ (Siraj) తన మాయాజాలాన్ని ప్రదర్శించలేకపోతున్నాడు. ప్రత్యర్థి బ్యాటర్లు అతడి బౌలింగ్ను తేలిగ్గా ఆడేస్తున్నారు. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
-
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
-
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
-
అంటకాగితే.. అంతే రాణా..!