టీమ్ఇండియా మర్చిపోవాలి.. అవన్నీ సహజం
అడిలైడ్లో టీమ్ఇండియా నమోదు చేసిన అత్యల్ప టెస్టు స్కోరును మర్చిపోవాలని ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ స్టీవ్స్మిత్ పేర్కొన్నాడు. తొలి టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్లో 36/9కే పరిమితమై సుదీర్ఘ ఫార్మాట్లో...
ఇంటర్నెట్డెస్క్: అడిలైడ్లో టీమ్ఇండియా నమోదు చేసిన అత్యల్ప టెస్టు స్కోరును మర్చిపోవాలని ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ స్టీవ్స్మిత్ పేర్కొన్నాడు. తొలి టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్లో 36/9కే పరిమితమై సుదీర్ఘ ఫార్మాట్లో చెత్త ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై ఓ స్థానిక వార్తా సంస్థతో మాట్లాడిన స్మిత్ ఈ విధంగా అన్నాడు. ఈ సిరీస్లో టీమ్ఇండియా ముందుకు సాగాలంటే వాటిని గురించి మర్చిపోవాలన్నాడు. ఆటలో ఇవన్నీ సహజమేనని, అప్పుడప్పుడూ ఇటువంటివి జరుగుతుంటాయని అన్నాడు. ప్రత్యర్థి జట్టు బౌలింగ్ అద్భుతంగా ఉన్నప్పుడు ఇతర జట్లు తక్కువ స్కోర్లకే పరిమితం అవుతాయని చెప్పాడు.
అలాగే భారత జట్టు తిరిగి ఎలా పుంజుకుంటుందనే విషయాన్ని వివరిస్తూ తొలి టెస్టులో వాళ్లెలా ఔటయ్యారనే వీడియోలు చూసి ఆ బలహీనతలపై శ్రద్ధ వహిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. దాంతో మెరుగవుతుందని తెలిపాడు. ఇప్పటికీ టీమ్ఇండియాలో నాణ్యమైన ఆటగాళ్లున్నారని, ఇప్పుడు వారు మరింత బాగా పుంజుకుంటారని స్మిత్ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో రెండో టెస్టులో ఎలా ఆడతారనేది వేచి చూడాలన్నాడు. అలాగే షార్ట్పిచ్ బంతులు ఆటలో భాగమని, టెయిలెండర్లకు ఆ బంతులేయొద్దన్న ఇయాన్ ఛాపెల్ వ్యాఖ్యలను తప్పుబట్టాడు. ఎన్నో ఏళ్లుగా ఆ బంతులేస్తున్నారని స్మిత్ వివరించాడు. ఇదిలా ఉండగా, ఈ ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఒక పరుగుకే వెనుతిరిగాడు. రెండో ఇన్నింగ్స్లో అతడు బ్యాటింగ్కు వచ్చినా అప్పటికే జట్టు విజయపుటంచుల్లో ఉంది. దీంతో రెండో ఇన్నింగ్స్లోనూ ఒక పరుగుకు పరిమితమయ్యాడు.
ఇవీ చదవండి..
36/9 ఊహించలేదు: బుద్ధిని వాడాలి! | 2020.. కోహ్లీ ఏంటి? |
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్