ఆరెంజ్ ఆర్మీ.. ఆరంభానికి అడుగుపడింది..
ఆరెంజ్ ఆర్మీ, మన సన్రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు ఈరోజు దుబాయ్ ఫ్లైట్ ఎక్కింది. గురువారం, శుక్రవారమే అన్ని జట్లూ వెళ్లిపోగా ఆదివారం ఎస్ఆర్హెచ్, దిల్లీ క్యాపిటల్స్...
(ఫొటోలన్నీ సన్రైజర్స్ ట్విటర్ నుంచి సేకరించినవి)
ఇంటర్నెట్డెస్క్: ఆరెంజ్ ఆర్మీ, మన సన్రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు ఈరోజు దుబాయ్ ఫ్లైట్ ఎక్కింది. గురు, శుక్రవారాల్లో అన్ని జట్లూ వెళ్లిపోగా ఆదివారం ఎస్ఆర్హెచ్, దిల్లీ క్యాపిటల్స్ బయిలుదేరాయి. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆయా జట్లు ట్విటర్లో పంచుకున్నాయి. ఈ సందర్భంగా తమకు మద్దతు తెలపాలని అభిమానులను కోరాయి. మరోవైపు అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ ఐపీఎల్ పదమూడో సీజన్ ఇంకో నాలుగు వారాల్లో ప్రారంభంకానుంది. అందుకోసం బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆటగాళ్లు అక్కడికి వెళ్లాక ఆరు రోజులు ప్రత్యేకంగా క్వారంటైన్లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇప్పటికే కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్.. దుబాయ్, అబుదాబికి చేరుకొని సాధన కూడా మొదలుపెట్టాయి. ఇప్పుడు సన్రైజర్స్, దిల్లీ క్యాపిటల్స్ రెండు ప్రత్యేక విమానాల్లో బయలుదేరి వెళ్లగా కొద్ది సేపటి క్రితమే అక్కడికి చేరుకున్నాయి. శ్రీవాట్స్ గోస్వామి అనే సన్రైజర్స్ ఆటగాడు ట్వీట్ చేసి ఆ విషయాన్ని పంచుకున్నాడు. ఇప్పుడు వారికి కరోనా పరీక్షలు చేశాక హోటల్కి తరలిస్తారు. అలాగే వారం రోజులు క్వారంటైన్లో ఉంటూనే సాధన చేసుకోవచ్చు. అది కూడా పూర్తయ్యాక ఆటగాళ్లందర్నీ బయో బుడగలోకి అనుమతిస్తారు. ఇక సెప్టెంబర్ 19 నుంచి క్రికెట్ ప్రేమికులందరికీ కనుల విందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు