సునీల్ నరైన్ యాక్షన్కు క్లీన్ చిట్
మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ తిరిగి కోల్కతా జట్టు తరఫున బౌలింగ్ చేయనున్నాడు. యూఏఈ వేదికగా జరగుతున్న మెగా టీ20 టోర్నీలో ఆడుతున్న నరైన్ అక్టోబరు 10న పంజాబ్తో జరిగిన మ్యాచ్లో వేసిన బౌలింగ్ యాక్షన్పై
ఇంటర్నెట్ డెస్క్: మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ తిరిగి కోల్కతా జట్టు తరఫున బౌలింగ్ చేయనున్నాడు. యూఏఈ వేదికగా జరగుతున్న మెగా టీ20 టోర్నీలో ఆడుతున్న నరైన్ అక్టోబరు 10న పంజాబ్తో జరిగిన మ్యాచ్లో వేసిన బౌలింగ్ యాక్షన్పై అంపైర్లు అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నిబంధనలను అతిక్రమించి మోచేతిని ఎక్కువగా వంచి బౌలింగ్ చేశాడని అంపైర్లు నరైన్ను లీగ్ బౌలర్ల హెచ్చరిక జాబితాలో ఉంచారు. దీంతో ఈ బౌలింగ్ ఆల్రౌండర్ 16వ తేదీ ముంబయితో కోల్కతా పోటీ పడిన మ్యాచ్లో స్థానం కోల్పోయాడు. ఈ మ్యాచ్లో కోల్కతా ఓడిపోయిన విషయం తెలిసిందే.
నరైన బౌలింగ్పై అంపైర్లు ఇచ్చిన నివేదిక ఆధారంగా కోల్కతా జట్టు యాజమాన్యం లీగ్ బౌలింగ్ కమిటీని ఆశ్రయించింది. నరైన్ బౌలింగ్ యాక్షన్కు సంబంధించిన వీడియోను కమిటీకి అందజేసింది. పంజాబ్ మ్యాచ్లో నరైన్ బౌలింగ్ యాక్షన్ను కమిటీ సునిశిత పరిశీలన చేసింది. ఈ మిస్టరీ స్పిన్నర్ నిబంధనల మేరకే మోచేయి వంచి బౌలింగ్ చేసినట్లు కమిటీ వివరణ ఇచ్చింది. అయితే ఈ లీగ్లో నరైన్ తర్వాత ఆడనున్న మ్యాచ్లతో సైతం ఈ విధంగానే బౌలింగ్ వేయాలని పేర్కొంది. ఇదిలా ఉంటే గతంలోనూ నరైన్ అంపైర్ల నుంచి ఇటువంటి హెచ్చరికలు అందుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.