T20 World Cup: కివీస్తో మ్యాచ్ పాయే.. సెమీస్ ఆశలు గల్లంతాయే!
టీ20 ప్రపంచకప్లో రెండో ఓటమి. సెమీస్ అవకాశాలు సంక్లిష్టం.. ఇదీ టీమ్ ఇండియా పరిస్థితి.
దుబాయ్: భారత్కు మరో ఘోర పరాజయం. టీ20 ప్రపంచకప్లో ఫేవరేట్గా దిగిన భారత్కు భంగపాటు. న్యూజిలాండ్తో జరిగిన కీలక మ్యాచ్లో చేతులేత్తేసింది. ఈ ఓటమితో భారత్ సెమీస్ అవకాశాలు దాదాపు గల్లంతయినట్లే. ఏదైనా సంచలనం జరిగితే కానీ సెమీస్ చేరుకోవడం కష్టమే. ఇప్పటికే దాయాది జట్టు పాక్తో ఓడి తీవ్ర విమర్శలపాలైన భారత్.. కీలక పోరులో న్యూజిలాండ్కు దాసోహమైంది.
టీ20 ప్రపంచకప్ సూపర్-12లో భాగంగా భారత్పై న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. భారత జట్టులో ఒక్కరూ కూడా 30 పరుగులు మించి చేయలేదు. రవీంద్ర జడేజా(26) టాప్ స్కోరర్. 2.5 ఓవర్లలో భారత్ 11 పరుగులకే ఇషాన్ కిషన్(4) రూపంలో తొలివికెట్ కోల్పోయింది. 50 పరుగుల లోపే రాహుల్(18), రోహిత్(14), కోహ్లీ(9) కీలక వికెట్లను చేజార్చుకుంది. దీనికి తోడు భారత ఇన్నింగ్స్ మందకొడిగా సాగడంతో ఇక ఏ మాత్రం కోలుకోలేకపోయింది. 10 ఓవర్లకు భారత్ 48 పరుగులే చేసింది. హర్దిక్ పాండ్య(23)తో కలిసి జట్టు కట్టిన పంత్(12) మరోవికెట్ పడకుండా కొంత సేపు పోరాడారు. అయితే 70 పరుగుల వద్ద పంత్ ఔటయ్యాడు. ఇక చివరలో జడేజా రాణించడంతో భారత్ ఆమాత్రమైనా స్కోర్ చేసింది.
అనంతరం స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన కివీస్ 111 పరుగుల లక్ష్యాన్ని 14.3 ఓవర్లలో రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి ఛేదించింది. న్యూజిలాండ్ ఓపెనర్ మిచెల్ (49) అద్భుత ఇన్నింగ్స్కు తోడు మార్టిన్ గప్తిల్ (20), కేన్ విలియమ్సన్ (33*) రాణించడంతో భారత్పై సునాయాస విజయాన్ని నమోదు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?