రెండో ఇన్నింగ్స్‌: టీమ్‌ఇండియా 36/9  

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా ఘోరంగా విఫలమైంది. 36 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి టెస్టు చరిత్రలో అతి తక్కువ స్కోరు నమోదు చేసింది...

Updated : 19 Dec 2020 11:52 IST

నిప్పులు చెరిగిన హాజిల్‌వుడ్‌, కమిన్స్‌

ఆస్ట్రేలియా విజయ లక్ష్యం 90 పరుగులు

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా ఘోరంగా విఫలమైంది. టెస్టు చరిత్రలో నాలుగో అత్యల్ప స్కోరు (36/9) నమోదు చేసింది. శనివారం మూడో రోజు ఆట మొదలైన రెండో ఓవర్‌ నుంచే వికెట్ల వేట మొదలెట్టిన ఆసీస్‌ బౌలర్లు గంటన్నరలో భారత బ్యాట్స్‌మెన్‌ను కుప్పకూల్చారు. హాజిల్‌వుడ్‌ 5/8, కమిన్స్‌ 4/21 నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడడంతో భారత బ్యాటింగ్‌ లైనప్‌ పేక మేడలా కూలింది. ఒక్కరు కూడా రెండంకెల స్కోర్‌ నమోదు చేయలేదంటే కోహ్లీసేన ఎలా ఆడిందో అర్థమవుతుంది. 31పరుగుల వద్ద హనుమ విహారి రూపంలో భారత్‌ తొమ్మిదో వికెట్‌ను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన మహ్మద్‌ షమి (1) రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు.  దీంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 21.2 ఓవర్లలో 36/9తో నిలిచింది. మరోవైపు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 53 పరుగుల ఆధిక్యం లభించడంతో ఆస్ట్రేలియా లక్ష్యం 90 పరుగులుగా నమోదైంది. మయాంక్‌ అగర్వాల్‌(9), హనుమ విహారి(8) టాప్‌ స్కోరర్లు.

గతంలో టెస్టు క్రికెట్లో అత్యల్ప స్కోర్లు ఇవే..

* 1955లో న్యూజిలాండ్‌ టీమ్‌ ఇంగ్లాండ్‌పై అత్యల్ప స్కోరు 26 పరుగులే నమోదు చేసింది.
* 1896లో దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్‌పై 30 పరుగులు.
* 1924లో దక్షిణాఫ్రికా మళ్లీ ఇంగ్లాండ్‌పైనే 30 పరుగులు
* 1899లో దక్షిణాఫ్రికా మూడోసారి ఇంగ్లాండ్‌ చేతిలో 35 పరుగులకు ఆలౌటైంది.
* 1902లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్‌తో ఆడిన టెస్టులో 36 పరుగులకు ఆలౌటైంది.
* 1932లో దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా చేతిలో 36 పరుగులకు ఆలౌటైంది.
* 2020 ఆస్ట్రేలియా చేతిలో భారత్‌ 36/9 అత్యల్ప స్కోరు నమోదు చేసింది.
* 1974లో టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌ చేతిలో 42 పరుగులకు ఆలౌటైంది. దీనిని కోహ్లీసేన నేడు తిరగరాసింది.

ఇవీ చదవండి..
బుమ్రా అలా గొప్పలు చెప్పుకుంటాడు 
జస్ప్రీత్‌ ద్రవిడ్‌ @ నంబర్‌ 3 : ఓజా

విరుష్క.. ఆసీస్‌లో బిడ్డను కనండి!

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని