ఈ విజయం మధుర జ్ఞాపకం..!
టీమ్ఇండియా ఎట్టకేలకు 2020లో తొలి టెస్టు విజయం సాధించింది. ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్తో రెండు టెస్టుల సిరీస్లో వైట్వాష్కు గురైన భారత్ తర్వాత 9 నెలలు టెస్టులే ఆడలేదు...
మెల్బోర్న్: టీమ్ఇండియా ఎట్టకేలకు 2020లో తొలి టెస్టు విజయం సాధించింది. ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్తో రెండు టెస్టుల సిరీస్లో వైట్వాష్కు గురైన భారత్ ఆ తర్వాత 9 నెలలు టెస్టులే ఆడలేదు. ఐపీఎల్ తర్వాత ఆస్ట్రేలియాతో సుదీర్ఘ పర్యటనకు వచ్చిన భారత్ ఇటీవల అడిలైడ్ టెస్టులోనూ ఘోర పరాభవం పాలైంది. ఆ మ్యాచ్లో తొలి రెండు రోజులు ఆధిపత్యంలో నిలిచినా మూడో రోజు అనూహ్యంగా ఓటమిపాలైంది. రెండో ఇన్నింగ్స్లో 36/9 స్కోర్ సాధించి టెస్టు చరిత్రలో అవమానకరమైన రికార్డు నెలకొల్పింది. ఈ నేపథ్యంలోనే రెండో టెస్టులో విజయం సాధించి ఆస్ట్రేలియాకు దీటుగా బదులివ్వడమే కాకుండా ఈ ఏడాది తొలి విజయాన్ని అందుకుంది.
ఆస్ట్రేలియాపై గెలుపు.. ఆసక్తికర విశేషాలు..
* విదేశాల్లో భారత్కిది 52వ టెస్టు విజయం. ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుతో ఆడిన 50 టెస్టుల్లో ఇది ఎనిమిదో విజయం. మొత్తంగా కంగారూలపై ఆడిన 100 మ్యాచ్ల్లో 29వ గెలుపు
* విదేశాల్లో మెల్బోర్న్లోనే భారత్ అత్యధికంగా 4 టెస్టుల్లో విజయం సాధించింది. ఇంతకుముందు 1978, 1981, 2018లో భారత్ ఈ మైదానంలో గెలుపొందింది. ఆ తర్వాత పోర్ట్ ఆఫ్ స్పెయిన్, కింగ్స్టన్, కొలంబో మైదానాల్లో మూడు విజయాలు సాధించింది.
* ఇక 1996 నుంచి జరుగుతున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో మొత్తం 50 టెస్టులు జరగ్గా భారత్ 21 మ్యాచ్ల్లో గెలుపొందింది. ఆస్ట్రేలియా 19 గెలవగా 10 టెస్టులు డ్రా అయ్యాయి.
* గత పదేళ్లలో భారత్ 3 బాక్సింగ్ డే టెస్టులు ఆడగా 2 మ్యాచ్ల్లో విజయం సాధించింది. 2010లో తొలిసారి ధోనీ సారథ్యంలో డర్బన్లో 87 పరుగులతో దక్షిణాఫ్రికాపై గెలిచిన భారత్ తర్వాత రహానె నేతృత్వంలో ఈరోజు ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
* ఈ శతాబ్దంలో భారత జట్టు ఆస్ట్రేలియాలో 22 టెస్టులు ఆడగా 5 మ్యాచ్లు గెలుపొందింది. అలాగే ఆస్ట్రేలియా జట్టు భారత్లో 21 టెస్టులు ఆడగా 4 గెలిచింది.
* ఈ మ్యాచ్లో రహానె విన్నింగ్ షాట్ కొట్టడం ద్వారా టెస్టు కెరీర్లో తొలిసారి ఆ ఘనత సాధించాడు. అంతకుముందు ఆస్ట్రేలియాలో విన్నింగ్ రన్స్ సాధించిన ఆటగాడు దిగ్గజ బ్యాట్స్మన్ రాహుల్ ద్రవిడ్.
* టీమ్ఇండియా టెస్టు క్రికెట్ చరిత్రలో కనీసం 100 వికెట్లు తీసిన వారిలో రవీంద్ర జడేజాకు మించిన అత్యుత్తమ బౌలింగ్ సగటు 24.48 ఎవరికీ లేదు. ఈ మ్యాచ్లో అతడు 3 వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే.
* ఆస్ట్రేలియా 100 ఓవర్లలో 200 పరుగుల స్కోర్ సాధించకపోవడం ఈ శతాబ్దంలో ఇదే తొలిసారి. రెండో ఇన్నింగ్స్లో ఆ జట్టు 100 ఓవర్లకు 196/9తో నిలిచింది. చివరికి 103 ఓవర్లలో 200 పరుగులు చేరుకుంది.
ఇవీ చదవండి..
రెండో టెస్టులో విజయం మనదే
విరాట్కు పోటీయా! వార్నర్ ప్రశంసలివి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో సన్రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్కు మారు పేరు! సన్రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్రేట్లో ఎప్పుడూ వెనుకంజే! సన్రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. -
స్టిమాక్ను తప్పించాల్సిందే
ఫుట్బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో చిన్న జట్టు అఫ్గానిస్థాన్ చేతిలో భారత్ అనూహ్య ఓటమితో కోచ్ స్టిమాక్ను తప్పించాలని మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదు అయ్యాయి.