IND vs ENG: టీమిండియా హెడ్‌కోచ్‌ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్‌

భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. శనివారం సాయంత్రం నిర్వహించిన కరోనా పరీక్షల్లో అతనికి పాజిటివ్‌గా వచ్చిందని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది...

Updated : 05 Sep 2021 16:02 IST

హైదరాబాద్‌: భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. శనివారం సాయంత్రం నిర్వహించిన కరోనా పరీక్షల్లో అతనికి పాజిటివ్‌గా వచ్చిందని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే ఆయనతో ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్న బౌలింగ్‌ కోచ్‌ బి.అరుణ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌, ఫిజియోథెరపిస్ట్‌ నితిన్‌ పటేల్‌ను హోటల్‌ గదిలోనే ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో ఉంచినట్లు వెల్లడించింది. మరోవైపు ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు జరుగుతున్న నేపథ్యంలో జట్టు సభ్యులందరికీ రెండుసార్లు పరీక్షలు నిర్వహించారు. అయితే, అందరికీ నెగిటివ్‌గా తేలడంతో నాలుగో రోజు ఆట యథావిథిగా కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని