Ganguly on Fifth Test: అది అయిదో టెస్టుగానే ఉండాలి: గంగూలీ

కరోనా భయాల వల్ల భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య అర్ధంతరంగా ఆగిపోయిన అయిదో టెస్టును తిరిగి ఎప్పుడు నిర్వహించినా.. అది ఈ సిరీస్‌లో భాగంగానే ఉండాలన్నది తమ అభిమతమని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ స్పష్టం చేశాడు.

Updated : 14 Sep 2021 09:42 IST

దిల్లీ: కరోనా భయాల వల్ల భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య అర్ధంతరంగా ఆగిపోయిన అయిదో టెస్టును తిరిగి ఎప్పుడు నిర్వహించినా.. అది ఈ సిరీస్‌లో భాగంగానే ఉండాలన్నది తమ అభిమతమని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ స్పష్టం చేశాడు. అయిదు టెస్టుల సిరీస్‌లో భాగంగా చివరిదైన ఈ మ్యాచ్‌ ఈ నెల 10న మాంచెస్టర్‌లో ఆరంభం కావాల్సింది. అయితే భారత సహాయ బృందంలో నలుగురు కరోనా బారిన పడటంతో మైదానంలోకి దిగేందుకు కోహ్లీసేన నిరాకరించింది. దీంతో మ్యాచ్‌ రద్దు చేశారు. ఈ మ్యాచ్‌ను రీషెడ్యూల్‌ చేయాలని చూస్తున్న నేపథ్యంలో గంగూలీ స్పందిస్తూ.. ‘‘ప్రస్తుత సిరీస్‌ పూర్తిగా   జరగాలి. ఇందులో విజయం సాధిస్తే.. 2007 తర్వాత తొలి సిరీస్‌ గెలుపవుతుంది. ప్రస్తుతం ఆగిపోయిన టెస్టు మ్యాచ్‌ ఎప్పుడు జరిగినా.. అది ఈ సిరీస్‌లో అయిదో టెస్టుగానే ఉండాలన్నది మా అభిమతం’’ అని గంగూలీ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని