Ruturaj Gaikwad: ‘ఎమర్జింగ్ ప్లేయర్’ అని ఊరికే అన్నారా..? రుతురాజ్ అంటే ఇదే మరి!
రుతురాజ్ గైక్వాడ్.. ఇప్పుడీ పేరు ఓ సంచలనం.. చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఓపెనర్. 2019 సీజన్ కోసం సీఎస్కే యాజమాన్యం తొలిసారి అతడిని ఎంపిక చేసింది.
రుతురాజ్ గైక్వాడ్.. ఇప్పుడీ పేరు ఓ సంచలనం.. చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఓపెనర్. 2019 సీజన్ కోసం సీఎస్కే యాజమాన్యం తొలిసారి అతడిని ఎంపిక చేసింది. అయితే ఆ సీజన్లో డగౌట్కే పరిమితం చేసింది. ఇక కరోనా కారణంగా గతేడాది యూఏఈలో నిర్వహించిన ఐపీఎల్ 2020 సీజన్లో చివర్లో ఆరు మ్యాచ్లే ఆడినా 204 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. ఆ టోర్నీ ఆరంభానికి ముందే కొవిడ్ బారిన పడిన రుతురాజ్ తర్వాత కోలుకుని రాణించడం విశేషం.
5, 5, 10, 64, 33, 75, 4, 88, 38, 40, 45, 101, 13, 12, 70, 32.. ఈ సీజన్లో రుతురాజ్ సాధించిన స్కోర్లివి. ఆరంభంలో పెద్దగా అంచనాలు లేని ఈ యువ ఓపెనర్ తర్వాత గేర్ మార్చాడు. వరుసగా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. చివరికి క్వాలిఫయర్-1లో దిల్లీపై చెలరేగి చెన్నైని ఫైనల్కు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే కోల్కతాతో జరిగిన ఫైనల్లో మరోసారి డుప్లెసిస్(86)తో శుభారంభం చేశాడు. ఈ సీజన్లోనే అత్యధిక పరుగులు(635 చేసిన బ్యాట్స్మన్గా నిలిచాడు. దీంతో తన రెండో టోర్నీలోనే ఆరెంజ్ క్యాప్ అందుకోవడమే కాకుండా ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. అలాగే ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్గా’ ఎంపికై అందరి మన్ననలు పొందుతున్నాడు.
భరోసా కల్పిస్తే చెలరేగుతాడు..
సహజంగా ఏ జట్టులోనైనా ఒక ఆటగాడు ఒక మ్యాచ్లో సరిగా ఆడకపోతేనే రెండో మ్యాచ్కి జట్టులో స్థానం ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. అలాంటిది ఆరంభంలోనే వరుసగా మూడు మ్యాచుల్లో విఫలమైనా చెన్నై కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అతడికి అవకాశం ఇచ్చాడు. దాన్ని రెండు చేతులా సద్వినియోగం చేసుకున్న గైక్వాడ్.. సారథి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆడాడు. మరీ ముఖ్యంగా లీగ్ దశలో రాజస్థాన్తో పోరుకు ముందు కెప్టెన్ చివరి వరకూ క్రీజులో నిలబడి బ్యాటింగ్ చేయమని సూచించడంతో తనలోని అత్యుత్తమ ఆటగాడిని బయటకు తీశాడు. దాంతో శతకంతో బాది.. తనని ప్రోత్సహించాలే కానీ అద్భుతాలు సృష్టిస్తానని చెప్పకనే చెప్పాడు. తాను విఫలమైనప్పుడు ధోనీనే అండగా నిలిచాడని.. ప్రశాంతంగా ఆడమని సలహాలిచ్చాడని రుతురాజ్ ఓ సందర్భంలో చెప్పాడు.
ఏ జట్టుపై ఎలా చెలరేగాడు..
ఈ సీజన్లో రుతురాజ్ మొత్తం 635 పరుగులు చేశాడు. అందులో నాలుగు అర్ధశతకాలు, ఒక శతకం ఉన్నాయి. లీగ్ దశలో రాజస్థాన్ రాయల్స్పై రుతురాజ్ (101నాటౌట్; 60 బంతుల్లో 9x4, 5x6) శతకం బాది తన సత్తా ఏంటో చూపించాడు. ఆ మ్యాచ్లో చెన్నై ఓడిపోయినా అతడి చిరస్మరణీయ ఇన్నింగ్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. అలాగే టోర్నీ ఆరంభంలో వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓడిపోయినా నాలుగో మ్యాచ్లో కోల్కతాపై చెలరేగాడు. ఆ మ్యాచ్లో 64 పరుగులు చేసి ఈ సీజన్లో తొలిసారి మెరిశాడు. ఇక తర్వాతి మ్యాచ్లో బెంగళూరుపై 33 పరుగులు సాధించాడు. మళ్లీ సన్రైజర్స్పై 75 పరుగులతో చెలరేగాడు. అనంతరం యూఏఈ లెగ్లో ముంబయితో ఆడిన తొలి మ్యాచ్లోనే 88 పరుగులు సాధించి ఈ పొట్టి ఫార్మాట్లో తానూ శతకం బాదగలనని నిరూపించుకున్నాడు. ఈ క్రమంలోనే మరో మూడు మ్యాచ్ల తర్వాత రాజస్థాన్పై విశ్వరూపం చూపించాడు.
కెరీర్ ఎలా సాగింది?
మహారాష్ట్రలోని పుణెకు చెందిన రుతురాజ్.. 1997 జనవరి 31న జన్మించాడు. మహారాష్ట్ర తరఫున ఫస్ట్క్లాస్ క్రికెట్లో 2016-17 రంజీ ట్రోఫీతో కెరీర్ ప్రారంభించాడు. 2018లో ఇండియా-బి జట్టుకు, అదే ఏడాది ఏసీసీ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్కు ఎంపికయ్యాడు. ఇక 2019లో తొలిసారి చెన్నై సూపర్ కింగ్స్ అతడిని కొనుగోలు చేసింది. అయితే, తొలి సీజన్ కావడంతో అతడు డగౌట్కే పరిమితం కావాల్సి వచ్చింది. ఇక గతేడాది ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభంలోనే రుతురాజ్ కరోనా బారినపడి కోలుకున్నాడు. అయితే, పలు మ్యాచ్ల్లో అతడికి అవకాశాలు రాకపోయినా నిరుత్సాహపడలేదు. మరోవైపు సీనియర్ ఆటగాళ్లు పూర్తిగా విఫలమవడంతో లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ల్లో అవకాశం దక్కింది. దాంతో ఆరు మ్యాచ్లు ఆడిన రుతురాజ్ మూడు అర్ధశతకాలతో మొత్తం 204 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఇక ఈ సీజన్లో ఎలా చెలరేగిపోయాడో పైన స్కోర్లను బట్టే అర్థం చేసుకోవచ్చు. మరోవైపు యూఏఈ లీగ్ ప్రారంభానికి ముందు రుతురాజ్ జులైలో శ్రీలంక పర్యటనకు వెళ్లాడు. అక్కడ 35 పరుగులే చేసి నిరుత్సాహపరిచాడు.
లవ్ ఎఫైర్పై..
రుతురాజ్ వ్యక్తిగత జీవితానికి వస్తే.. బాలీవుడ్ నటి సాయాలీ సంజీవ్తో లవ్ ఎఫైర్ ఉందని సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. అవన్నీ వదంతులేనని ఓ సందర్భంలో తేల్చిచెప్పాడు. బౌలర్లు మాత్రమే తన వికెట్ను పడగొట్టగలరని, వారే తనని క్లీన్ బౌల్డ్ చేస్తారని సరదాగా ఓసారి ఇన్స్టాగ్రామ్లో పోస్టు కూడా చేశాడు.
రుతురాజ్ గురించి మరికొన్ని విశేషాలు
* రుతురాజ్కి క్రికెట్ ఎంత ఇష్టమో చెప్పాలంటే.. అతడు ఎప్పుడు క్రికెట్ అకాడమీలో చేరాడో చెబితే సరిపోతుంది. అతడు 12 ఏళ్ల వయసులోనే వెంగ్సర్కార్ క్రికెట్ అకాడమీలో చేరిపోయాడు.
* ఇప్పుడు ఐపీఎల్లో అదరగొడుతున్న రుతురాజ్ దేశవాళీ క్రికెట్లోనూ అదే జోరు ప్రదర్శించాడు. కూచ్ బెహర్ ట్రోఫీలో వరుసగా రెండేళ్లు అత్యధిక స్కోర్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు ఈ ఘనత అందుకున్న రెండో క్రికెటర్ ఈ సీఎస్కే ఓపెనరే కావడం విశేషం.
* క్రికెటర్లంటే కేవలం ఇదొక్క ఆట మీదే దృష్టిసారిస్తారని అనుకోవడం సరికాదు. ఎందుకంటే రుతురాజ్కు క్రికెట్తోపాటు టెన్నిస్ కూడా అమితాసక్తి. క్రికెటర్ కాకపోయి ఉంటే ఏం చేస్తావని ఓ సందర్భంలో అడిగినప్పుడు టెన్నిస్ ఆడేవాడినని బదులిచ్చాడు.
* క్రీజులో కుదురుకుంటే బౌలర్ల ఎదురుదాడి చేసే రుతురాజ్ పార్ట్టైమ్ ఆఫ్ స్పిన్నర్ కూడా. అయితే, ఇంత వరకూ అతడికి ఐపీఎల్లో బౌలింగ్ చేసే అవకాశం దక్కలేదు.
* ఖాళీ సమయాల్లో సినిమాలు, వెబ్ సిరీస్లు చూసేందుకు ఆసక్తి చూపిస్తాడు. నెట్ఫ్లిక్స్లోని ‘నార్కోస్’ షో మరీమరీ ఇష్టమని ఓ సందర్భంలో చెప్పాడు.
ఏమంటే ఇష్టం? * సెల్ఫీమ్యాన్: డిఫరెంట్గా సెల్ఫీలు తీసుకోవడం ఇష్టం * ఇష్టమైన కాంబినేషన్: బిస్కెట్లతో కాఫీ తాగడం * ఎంజాయ్మెంట్ స్పాట్: బీచ్లకు వెళ్లడం * మరిచిపోలేని సంఘటన: 2016లో రంజీలో అడుగుపెట్టినప్పుడు వేలికి దెబ్బతగిలింది. అప్పుడు గాయం పట్టీ మీద ఎంఎస్ ధోనీ సంతకం చేయడం మరిచిపోలేని సంఘటన * ఆల్టైమ్ ఫేవరైట్: ఇండియా జెర్సీ వేసుకోవడం * ఇష్టమైన క్రికెటర్: సచిన్ తెందూల్కర్, ఎంఎస్ ధోనీ * సరదా కాలక్షేపం: సరదాగా స్నేహితులతో వాలీబాల్ ఆడాలి * ఫిట్నెస్పై అభిప్రాయం: అత్యంత ప్రాధాన్యత * సూపర్ పిక్: ప్రాక్టీస్ సందర్భంగా ఎంఎస్ ధోనీతో దిగిన ఫొటో |
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎప్పుడూ నాతోనే.. కుమారుడిపై శిఖర్ ధావన్ ఎమోషనల్ పోస్ట్
గాయం నుంచి కోలుకుని ముంబయితో మ్యాచ్కు శిఖర్ ధావన్ సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో తన కుమారుడిపై పెట్టిన పోస్టు వైరల్గా మారింది. -
దూకుడైన బ్యాటింగ్తోనే కప్ కొట్టగలం..: రికీ పాంటింగ్
ఒకప్పుడు నాణ్యమైన బౌలింగ్ వనరులు ఉంటే జట్టు గెలవడం సులువని భావించేవారు. కానీ, ఇప్పుడు బౌలింగ్ కాస్త ఫర్వాలేదనిపించినా.. లోతైన బ్యాటింగ్ ఉండాలని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా రికీ పాంటింగ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. -
గౌతమ్ గంభీర్ బాధ పడొద్దు.. కాస్త నవ్వుతూ ఉండు: షారుఖ్ ఖాన్
ఈ సీజన్లో కోల్కతాకు రెండో ఓటమి ఎదురైంది. భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ చివరి బంతికి గెలిచింది. -
కోహ్లీనే తక్కువ పరుగులు ఇస్తాడేమో.. బెంగళూరు 11 మంది బ్యాటర్లతో ఆడాలి: క్రిష్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరు విజయాలబాట పట్టాలంటే.. జట్టు, ప్రణాళికల్లో మార్పులు అవసరమని భారత మాజీ క్రికెటర్ కీలక సూచనలు చేశాడు. -
క్రీజ్లో బట్లర్.. చివరి ఓవర్ను వరుణ్కి ఇవ్వడానికి కారణమదే: శ్రేయస్
ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ను ఓడించాలని భావించిన కోల్కతాకు చుక్కెదురైంది. జోస్ బట్లర్ పోరాడి వారి ఆశలకు గండికొట్టాడు. -
ఆ విషయంలో.. ధోనీ, కోహ్లీని అనుసరించా: జోస్ బట్లర్
ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో కోల్కతాను రాజస్థాన్ చివరి బంతికి ఓడించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన పోరులో జోస్ బట్లర్ సెంచరీ చేసి జట్టును గెలిపించాడు. -
బాప్రే బట్లర్.. ఒత్తిడిలో అద్భుత బ్యాటింగ్
ఆరు ఓవర్లలో 96 పరుగులు... ఎలాంటి పిచ్పైనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఛేదన చాలా చాలా కష్టం. పైగా ఆరు వికెట్లు పోయాయి. కోల్కతాతో మ్యాచ్లో భారీ లక్ష్య ఛేదనలో పోరాడుతున్న రాజస్థాన్ ఓపెనర్ బట్లర్కు సహకరించే వారూ లేరు. -
జ్యోతి వెలిగింది.. పారిస్ మురిసింది
ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా పండుగ ఒలింపిక్స్కు సమయం దగ్గర పడుతోంది. సరిగ్గా ఇంకో వంద రోజుల్లోనే పారిస్లో ఈ మెగా ఈవెంట్ జరగబోతోంది. -
టీ20 ప్రపంచకప్లో.. హార్దిక్ బౌలింగ్ చేస్తేనే..
రాబోయే టీ20 ప్రపంచకప్లో హార్దిక్ పాండ్య ఆడతాడా? ఐపీఎల్లో ఇప్పటిదాకా ఈ ఆల్రౌండర్ ప్రదర్శన చూసిన అభిమానుల్లో తలెత్తుతున్న ప్రశ్న ఇదే. కొన్ని నెలల ముందు వరకు అతడి సారథ్యంలోనే టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ ఆడుతుందని అంతా అనుకున్నారు. -
ఐపీఎల్కు మ్యాక్స్వెల్ నిరవధిక విరామం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పేలవమైన ఫామ్లో ఉన్న మ్యాక్స్వెల్ ఐపీఎల్ నుంచి నిరవధిక విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. -
నాదల్ విజయంతో..
స్పెయిన్ దిగ్గజం రఫెల్ నాదల్ పునరాగమనాన్ని విజయంతో మొదలుపెట్టాడు. బార్సిలోనా ఓపెన్ తొలి రౌండ్లో అతడు 6-2, 6-3తో ఫ్లావియో కొబాలి (ఇటలీ)పై విజయం సాధించాడు. -
అగ్రస్థానంలో గుకేశ్
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్ గుకేశ్.. అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. నెపోమ్నియాషి (రష్యా)తో జరిగిన పదో రౌండ్ గేమ్ను అతడు డ్రాగా ముగించాడు. -
రోహిత్ ఓటమి
ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో రోహిత్ దహియా పోరాటం ముగిసింది. మంగళవారం 82 కేజీల విభాగం కాంస్య పోరులో ఈ భారత కుర్రాడు 1-3తో రసులోవ్ (ఉజ్బెకిస్థాన్) చేతిలో ఓడాడు. -
నరైన్ శతకం వృథా.. సెంచరీ చేసి రాజస్థాన్ను గెలిపించిన బట్లర్
కోల్కతాపై రాజస్థాన్ 2 వికెట్ల తేడాతో నెగ్గింది. 224 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ చివరి బంతికి విజయం సాధించింది. ఆ జట్టు ఆటగాడు జోస్ బట్లర్ శతకం(107*)తో చెలరేగాడు.
తాజా వార్తలు (Latest News)
-
పీఎఫ్లో కీలక మార్పు.. ఇకపై చికిత్సకు రూ.లక్ష వరకు విత్డ్రా
-
మోదీ విమర్శలు.. రాహుల్ గాంధీ యూటర్న్
-
సీఎంపై రాయిదాడి కేసు.. పోలీసుల అదుపులో మరో వ్యక్తి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘ఇండియా’ కూటమి గెలిస్తే CAA, NRC రద్దు చేస్తాం: మమత
-
ఎప్పుడూ నాతోనే.. కుమారుడిపై శిఖర్ ధావన్ ఎమోషనల్ పోస్ట్