పాక్ ఆటగాళ్లకు అండగా ఉండాలి: అఫ్రిది
కష్ట సమయంలో పాకిస్థాన్ ఆటగాళ్లకు అండగా ఉండాలని మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది అభిమానులకు, విమర్శకులకు పిలుపునిచ్చాడు. తాజాగా ఇంగ్లాండ్తో ఆడిన మూడో వన్డేలోనూ దాయాది జట్టు ఓటమిపాలవ్వడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది...
ఇంటర్నెట్డెస్క్: కష్ట సమయంలో పాకిస్థాన్ ఆటగాళ్లకు అండగా ఉండాలని మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది అభిమానులకు, విమర్శకులకు పిలుపునిచ్చాడు. తాజాగా ఇంగ్లాండ్తో ఆడిన మూడో వన్డేలోనూ దాయాది జట్టు ఓటమిపాలవ్వడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ప్రధాన ఆటగాళ్లు లేని ఇంగ్లాండ్ ద్వితీయశ్రేణి జట్టు పాక్పై 3-0 తేడాతో క్లీన్స్వీప్ చేయడం అభిమానులకు మింగుడుపడటం లేదు. ఈ నేపథ్యంలోనే అఫ్రిది ఓ వీడియోలో మాట్లాడుతూ ఇలా స్పందించాడు.
‘ఇప్పుడున్న పాకిస్థాన్ ఆటగాళ్లు నైపుణ్యం, సామర్థ్యం పరంగా అత్యుత్తమ ఆటగాళ్లు. నిజం చెప్పాలంటే ఈ ఆటగాళ్లు నిలకడగా ఆడుతున్నారు. ఇంకొంత మంది కొంతకాలంగా అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. వీళ్లు మంచి ఆటగాళ్లు. సరిగ్గా ఉపయోగించుకోవాలి. వారిలో విజయకాంక్ష నెలకొల్పుతూ ప్రోత్సహించాలి. ఇలాంటి కష్టసమయాల్లో అండగా ఉండాలి. మైదానంలో వాళ్లు పోరాడేంతవరకు నేను ఓటములను అంగీకరిస్తాను. అయితే, కొద్దికాలంగా క్రికెట్ ఎంతో మారిపోయింది. ఇప్పుడు విజయాలు సాధించాలంటే దంచికొట్టడమే పనిగా పెట్టుకోవాలి. అంతకుమించిన దారి లేదు’ అని అఫ్రిది చెప్పుకొచ్చాడు.
అనంతరం రాబోయే టీ20 ప్రపంచకప్పై స్పందించిన మాజీ సారథి.. యూఏఈలో పాకిస్థాన్ జట్టుకు ఘనచరిత్ర ఉందని పేర్కొన్నాడు. ‘యూఏఈలో మనకు మంచి రికార్డు ఉంది. గతంలో పలు మేటి జట్లను కూడా అక్కడ ఓడించాం. అదే ఇప్పుడు టీ20 ప్రపంచకప్లో మన జట్టుకు కలిసివస్తుంది. అక్కడి పిచ్లపై స్పిన్నర్లు, బ్యాట్స్మెన్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది’ అని అఫ్రిది అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉండగా, తాజాగా ఇంగ్లాండ్తో జరిగిన మూడో వన్డేలో పాక్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత ఆ జట్టు బ్యాటింగ్ చేసి 331/9 భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ బాబర్ అజామ్ (158; 139 బంతుల్లో 14x4, 4x4) భారీ శతకం సాధించగా రిజ్వాన్ (74; 58 బంతుల్లో 8x4) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. అనంతరం ఇంగ్లిష్ జట్టులో జేమ్స్ విన్స్ (102; 95 బంతుల్లో 11x4) శతకం సాధించగా లోయర్ ఆర్డర్ బ్యాట్స్మన్ లెవిస్ గ్రెగోరీ (77; 69 బంతుల్లో 6x4, 3x6) రాణించాడు. దాంతో ఆతిథ్య జట్టు 48 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
పంజాబ్పై 9 పరుగుల తేడాతో ముంబయి గెలిచింది. కానీ, ఆ జట్టుకు అంపైర్లు మద్దతుగా నిలిచారనే ఆరోపణలు వస్తున్నాయి. -
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్