ఆ జట్టు గెలిస్తేనే లీగ్కు మంచిది: సెహ్వాగ్
క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20లీగ్ ఫైనల్ మ్యాచ్కు సమయం ఆసన్నమైంది. ఇదిలా ఉండగా.. టోర్నీ ఆరంభం నుంచి భారత మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాన్ ‘వీరూకి బైటక్’ ద్వారా తన విశ్లేషణ అభిమానులతో పంచుకుంటూ వస్తున్నాడు.
ఫైనల్ మ్యాచ్పై వీరూ విశ్లేషణ
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20లీగ్ ఫైనల్ మ్యాచ్కు సమయం ఆసన్నమైంది. ఇదిలా ఉండగా.. టోర్నీ ఆరంభం నుంచి భారత మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాన్ ‘వీరూకి బైటక్’ ద్వారా తన విశ్లేషణ అభిమానులతో పంచుకుంటూ వస్తున్నాడు. ఇప్పటి వరకూ జరిగిన మ్యాచుల్లో సెహ్వాగ్ చెప్పిన జట్లే దాదాపు విజయం సాధించాయి కూడా. అందరిలాగే తాను కూడా ఫైనల్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్తూనే ఈసారి కాబోయే ఛాంపియన్ ఎవరనేది వీరూ జోస్యం చెప్పేశాడు. అయితే.. ఛాంపియన్ ఎవరనేది తేలాలంటే ఈ రోజు దిల్లీ, ముంబయి జట్ల మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్ ముగిసే వరకూ వేచి చూడాల్సిందే అన్నాడు. అంతేకాదు.. టాస్ గెలిచిన జట్టు ఏం తీసుకోవాలి.. ఎలాంటి మ్యాచ్ ప్లాన్ అమలు చేయాలి అనే విషయాల్లో వీరూ పలు ‘ఉచిత’ సలహాలిచ్చాడు.
గబ్బర్ పంజరం నుంచి వచ్చిన పావురం..
‘‘దిల్లీకి ఇది ఒక కొత్త అనుభవం. కొత్తగా కారు కొన్న యజమానికి.. కొత్తగా ప్రేమలో పడ్డ యువకుడికి ఎలా ఉంటుందో.. దిల్లీకి ఈ ఫైనల్ మ్యాచ్ అచ్చం అలాంటిదే. ఒకవేళ టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవాలి. ఎందుకంటే ముంబయి బ్యాటింగ్ ఆర్డర్కు గురించి మనకు తెలిసిందే. వాళ్లు మొదటి బ్యాటింగ్ చేస్తే 200+పరుగుల బంపర్ ఆఫర్ ఇవ్వడం ఖాయం. కాబట్టి ఈ మ్యాచ్లో ఒకవేళ టాస్ గెలిస్తే కెప్టెన్ అయ్యర్ తీసుకునే నిర్ణయం కీలకం. టాస్ గెలవాలని అయ్యర్ ఆ దేవుణ్ని వేడుకోవాలి. దిల్లీకి ధావన్, స్టాయినీస్ అదిరిపోయే అరంభం ఇవ్వాలి. బ్యాట్స్మెన్ను బయపెట్టే బౌలర్లు బుమ్రా, బౌల్ట్ ముంబయిలో ఉన్నారు. కానీ, ధావన్ ఉన్న ఫామ్లో వాళ్ల మంత్రం పనిచేసే అవకాశం తక్కువే. అతను పంజరంలో నుంచి బయటికి వచ్చిన పావురంలాంటి వాడు. సీజన్లో నాలుగుసార్లు డకౌట్ అయిన తర్వాత కూడా టోర్నీ టాప్2 స్కోరర్గా ఉన్నాడంటే అర్థం చేసుకోవచ్చు. ధావన్తో దిల్లీకి ఓపెనింగ్ సమస్య పూర్తిగా సమసిపోయింది. మిడిల్ ఆర్డర్ ఒక్కటే ఇబ్బందిగా కనిపిస్తోంది. గత మ్యాచ్లో హెట్మైయెర్ ఫామ్లోకి రావడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. అయ్యర్, పంత్ పరుగులు చేయాలి’.
ఆ రెండు జోడీలు కీలకం..
ఇక ముంబయి గురించి మాట్లాడాలంటే.. ఈ జట్టులో రెండు జోడీలు కీలకం.. అవి పాండ్య-పొలార్డ్, బుమ్రా-బౌల్ట్. ఈ రెండు జోడీలు ముంబయిని అలవోకగా ఫైనల్కు చేర్చాయి. ఈ సీజన్లో ‘వడాపావ్’ రోహిత్ ఎలాగూ ఫామ్లో లేడు. అయినా.. అది జట్టుకు పెద్ద సమస్యేం కాబోదు. ఓపెనింగ్లో పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ ఉన్నాడు. ఈ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టింది అతనే. మ్యాచ్లో పొలార్డ్, హార్దిక్ పాండ్య ఇన్నింగ్స్ కీలకం. ఇప్పటి వరకూ వాళ్లిద్దరూ కలిసి 85 బంతులు ఎదుర్కొని 229 స్ట్రైక్రేట్తో 195 పరుగులు చేశారు. మూడు బంతులకో బౌండరీ కొట్టారు. బౌలింగ్లో బుమ్రా, బౌల్ట్ ఇద్దరూ కలిసి ముంబయిని బలంగా తయారుచేశారు. ఈ మ్యాచ్లో రబాడ, బుమ్రాకు పోటీ ప్రధానం.
మొత్తానికి.. ఈ మ్యాచ్లో దిల్లీపై విజయం సాధించి ముంబయి మరోసారి ట్రోఫీని ముద్దాడుతుందని నా అభిప్రాయం. కానీ.. నా అభిప్రాయం నిజం కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మ్యాచ్లో దిల్లీ గెలిచి కొత్త ఛాంపియన్గా అవతరించాలి. అదే లీగ్కు మంచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు.