డ్రీమ్11లో చైనా పెట్టుబడులు
2020 ఐపీఎల్ టైటిల్ స్పాన్సరర్గా బీసీసీఐ డ్రీమ్11ను ఎన్నుకోవడాన్ని..
బీసీసీఐకి లేఖ రాసిన సీఏఐటీ
దిల్లీ: 2020 ఐపీఎల్ టైటిల్ స్పాన్సరర్గా బీసీసీఐ ‘డ్రీమ్11’ను ఎంచుకోవడాన్ని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) వ్యతిరేకించింది. డ్రీమ్11లో చైనా పెట్టుబడులు ఉన్నాయని పేర్కొంటూ బుధవారం బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీకి లేఖ రాసింది. ‘2020 ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ను డ్రీమ్11కు అప్పగించడంతో తీవ్ర కలత చెందాం. ఆ సంస్థలో చైనా పెట్టుడబులు ఉన్నాయి. చైనాకి చెందిన టెన్సెంట్ గ్లోబల్ అనే సంస్థ డ్రీమ్11లో ముఖ్య వాటాదారు’ అని పేర్కొంది. ‘డ్రీమ్11కు స్పాన్సర్షిప్ను కట్టబెట్టడం చైనా వస్తువులను బహిష్కరిస్తున్న భారతీయుల మనోభావాలను దెబ్బదీయడమే’ అని చైనా వస్తువులను బహిష్కరించాలనే ప్రచారానికి నాయకత్వం వహిస్తున్న సీఏఐటీ ఆ లేఖలో స్పష్టం చేసింది.
భారత్లో చైనా వస్తువుల బహిష్కరణ ఉద్యమం కొనసాగుతుండటంతో ఐపీఎల్ టైటిల్ స్పాన్సరర్గా కొన్నేళ్లపాటు కొనసాగిన మొబైల్ సంస్థ వివో ఈ మధ్యే తప్పుకుంది. దీంతో వచ్చే నెల దుబాయ్లో నిర్వహించే ఐపీఎల్ 13వ సీజన్ కోసం బీసీసీఐ కొత్త సంస్థలను ఆహ్వానించింది. స్వదేశీ కంపెనీలైన టాటా, బైజుస్, పతంజలి లాంటి సంస్థలతో పోటీ పడి రూ.222 కోట్లకు ఫాంటసీ క్రీడల నిర్వహణ సంస్థ డ్రీమ్11 ఆ హక్కులను దక్కించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.