కోహ్లీ కెప్టెన్సీకి మాజీ ఓపెనర్ మద్దతు
గౌతమ్ గంభీర్ వ్యాఖ్యలపై మరో మాజీ ఓపెనర్ సెహ్వాగ్ స్పందించాడు. కోహ్లీ కెప్టెన్సీకి మద్దతు తెలిపాడు. ‘సారథి జట్టుకు బలం. కోహ్లీ టీంఇండియాకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. అతని నుంచి గొప్ప విజయాలు చూశాం
గంభీర్ వ్యాఖ్యలను ఖండించిన సెహ్వాగ్
ఇంటర్నెట్డెస్క్ : టీ20 మెగా లీగ్ టైటిల్ సాధించడంలో కోహ్లీ సారథ్యంలోని బెంగళూరు జట్టు వరుసగా విఫలం అవుతోంది. ఈ ఏడాది యూఏఈలో జరుగుతున్న లీగ్లోనూ ఎలిమినేటర్ వరకూ వెళ్లిన బెంగళూరు బ్యాటింగ్ వైఫల్యాలతో తక్కువ స్కోరు చేసి హైదరాబాద్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో కోహ్లీ సారథ్యంపై విమర్శలు తీవ్రమయ్యాయి. ఈ క్రమంలో టీంఇండియా మాజీ ఓపెనర్, రెండు సార్లు కోల్కతాకు టైటిల్ సాధించిపెట్టిన గంభీర్ కోహ్లీని తీవ్రస్థాయిలో విమర్శించాడు. ఎనిమిదేళ్లుగా కప్పు గెలవకుండా ఉన్న కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించాలన్నాడు. లేకపోతే కోహ్లీనే ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాలని అభిప్రాయపడ్డాడు. ఏటా భారీ అంచనాల నడుమ బరిలోకి దిగే బెంగళూరు జట్టు ఈ ఏడాది ఎక్కువగా కోహ్లీ, డివిలియర్స్, యువ ఆటగాడు దేవదత్ పడిక్కల్పైనే ఆధారపడిన విషయం తెలిసిందే.
గౌతమ్ గంభీర్ వ్యాఖ్యలపై మరో మాజీ ఓపెనర్ సెహ్వాగ్ స్పందించాడు. కోహ్లీ కెప్టెన్సీకి మద్దతు తెలిపాడు. ‘సారథి జట్టుకు బలం. కోహ్లీ టీంఇండియాకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. అతని నుంచి గొప్ప విజయాలు చూశాం. అతను అన్ని ఫార్మాట్లలోనూ మ్యాచులను గెలపించగలడు. లీగ్లో తను సారథ్యం వహిస్తున్న బెంగళూరు జట్టు ఆశించిన మేర రాణించట్లేదు. ఓ కెప్టెన్కు మంచి జట్టు ఉండటం అవసరం. బెంగళూరు జట్టు యాజమాన్యం కెప్టెన్సీ మార్పుపై కాకుండా జట్టు కూర్పుపై ఆలోచించాలి’ అని సెహ్వాగ్ ఓ ఇంటర్వూలో అన్నాడు. ఇదిలా ఉంటే ఈ సీజన్లో 15 మ్యాచులాడిన కోహ్లీ 121.35 స్ట్రైక్రేట్తో 466 పరుగులు చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98కోట్ల ఆస్తులు అటాచ్
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
-
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
-
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
-
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి